/rtv/media/media_files/2026/04/05/rini-sampath-2026-04-05-08-58-48.jpg)
వాషింగ్టన్ డీసీ మేయర్ రేసులో నిలిచిన తొలి దక్షిణాసియా మహిళగా తమిళనాడులో జన్మించిన రిని సంపత్ చరిత్ర సృష్టించారు. 2026లో జరగనున్న ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన అర్హతను ఆమె సాధించారు. సుమారు 4,500 మందికి పైగా ప్రజలు ఆమె అభ్యర్థిత్వానికి మద్దతుగా సంతకాలు చేయడంతో రిని అధికారికంగా బ్యాలెట్లో చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏడేళ్ల వయసులో అమెరికా కలల సాకారం కోసం ఇక్కడికి వచ్చానని, ఇప్పుడు డీసీ ప్రజల కలలను నిజం చేసేందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఎంతో ఉద్వేగంగా చెప్పారు.
తమిళనాడులోని తేనిలో
రిని సంపత్ 31 ఏళ్ల భారత సంతతి మహిళ. ఆమె తమిళనాడులోని తేనిలో జన్మించి, గత పదేళ్లుగా వాషింగ్టన్ డీసీలో నివసిస్తున్నారు. వృత్తిరీత్యా ఆమె సైబర్ సెక్యూరిటీ నిపుణురాలిగా, ప్రభుత్వ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు. ప్రసిద్ధ యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ పూర్తి చేసిన రిని, ప్రస్తుతం ‘థారోస్’ అనే సంస్థకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఆమె తాతగారు తనకు స్ఫూర్తి అని, అలాగే తన తండ్రి తీసుకున్న అమెరికాకు వచ్చే నిర్ణయమే తన జీవితాన్ని మలుపు తిప్పిందని ఆమె గొప్పగా చెప్పుకుంటారు.
ఆమె ఎన్నికల ప్రచారం ప్రధానంగా ‘మౌలిక సదుపాయాల పరిష్కారం’ (Fix the Basics) అనే అంశం చుట్టూ సాగుతోంది. తాను రాజకీయ నాయకురాలిని కాదని, ఏ ప్రత్యేక ప్రయోజన గ్రూపులకూ లొంగిపోనని ఆమె స్పష్టం చేశారు. నగరంలో గుంతలు లేని రోడ్లు వేయడం, పొటోమాక్ నదిలో వ్యర్థాల కలయికను ఆపడం, పెరిగిన ధరలను తగ్గించడం మరియు అత్యవసర సేవలైన 911 వెయిటింగ్ టైమ్ను తగ్గించడం వంటి కనీస అవసరాలపైనే తాను దృష్టి పెడతానని ఆమె వాగ్దానం చేస్తున్నారు. కొత్త డీసీని నిర్మించడమే తన లక్ష్యమని ఆమె ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ఈ మేయర్ ఎన్నికల్లో రిని సంపత్తో పాటు జనీస్ లూయిస్ జార్జ్, కెన్యాన్ మెక్డఫీ, గ్యారీ గుడ్వెదర్, రాబర్ట్ ఎల్ గ్రాస్ మరియు రోండా హామిల్టన్ వంటి ఇతర అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు. ఒక అవుట్సైడర్గా రంగంలోకి దిగి, నగర సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని తహతహలాడుతున్న రిని సంపత్, ప్రస్తుత ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. దక్షిణాసియా నుంచి ఈ స్థాయి పోటీకి వెళ్లిన తొలి మహిళగా ఆమె ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు.
Follow Us