ICC World Cup: టీమిండియా ఓటమి జీర్ణించుకోలేక అభిమాని మృతి..
ప్రపంచకప్ ఫైనల్స్ టీమిండియా ఓడిపోవడంతో తిరుపతిలోని ఓ క్రికెట్ అభిమాని గుండెపోటుతో చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుడు తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రంకు చెందిన జ్యోతి కుమార్గా గుర్తించారు.
ప్రపంచకప్ ఫైనల్స్ టీమిండియా ఓడిపోవడంతో తిరుపతిలోని ఓ క్రికెట్ అభిమాని గుండెపోటుతో చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుడు తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రంకు చెందిన జ్యోతి కుమార్గా గుర్తించారు.
విశాఖలోని ఫిషింగ్ హర్బర్లో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమదంలో 40కిపైగా బోట్లు కాలిపోయాయని అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు చెబుతున్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. కన్న తండ్రికి వెన్నుపోటు పొడిచి.. ఆయన మానసిక వేదనతో చనిపోయేలా చేసిన పురంధేశ్వరి లాంటి కూతురు ఎవరికీ ఉండదన్నారు.
మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మద్యం ధరలను పెంచింది సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. క్వార్డర్ పై రూ. 10, ఫుల్ బాటిల్పై రూ. 20 చొప్పున పెంచింది ప్రభుత్వం. విదేశీ మద్యంపైనా ధరలు పెంచింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన నేపథ్యంలో నెలకొన్న ఆలిండియా సర్వీస్ అధికారుల కేటాయింపు వివాదానికి సంబంధించి పిటిషన్లపై నవంబర్ 20వ తేదీ నుంచి రోజూ విచారణ చేపడతామని తెలంగాణ హైకోర్టు తెలిపింది.
టీడీపీ నేత బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్ విధించారు కడప జిల్లా కోర్టు న్యాయమూర్తి. కడప విమానాశ్రయం వద్ద ఘర్షణ కేసు, టికెట్ బెట్టింగ్ కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అర్థరాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. అలాగే, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.
ఇసుక స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు నాయుడు. ఉచిత ఇసుక స్కీమ్ ద్వారా అక్రమాలకు పాల్పడినట్లు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు అధికారులు.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ దళిత యువకుడ్ని కిడ్నాప్ చేసి.. అతనిపై దాడి చేసి మూత్రం పోయడం కలకలం రేపుతోంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాది ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి కావడం చర్చనీయాంశమవుతోంది.