U Thackeray: ముంబైపై గుజరాతీల కుట్ర.. RSS నేతపై దేశద్రోహం కేసు: మాజీ సీఎం సంచలనం!

ఆర్ఎస్ఎస్ నేత సురేష్ భయ్యాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఘాటుగా స్పందించారు. భయ్యాజీపై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ముంబైని లాక్కునేందుకు గుజరాతీలు కుట్ర చేస్తున్నారని ఠాక్రే ఆరోపించారు. 

New Update
mumbai

mumbai Photograph: (mumbai )

U Thackeray: ఆర్ఎస్ఎస్ నేత సురేష్ భయ్యాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఘాటుగా స్పందించారు. భయ్యాజీపై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ముంబైని లాక్కునేందుకు గుజరాతీలు కుట్ర చేస్తున్నారని ఠాక్రే ఆరోపించారు. 

మరాఠీ మాట్లాడాల్సిన అవసరం లేదు..

ఈ మేరకు ముంబైలో ఉండాలంటే మరాఠీ మాట్లాడాల్సిన అవసరం లేదన్న భయ్యాజీకి మాటల వేకన కుట్ర దాగివుందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి ఘాట్‌కోపర్‌లో అధికార భాష గుజరాతీనే అని వాదిస్తున్నాయన్నారు. ముంబై నగరాన్ని తమ కంట్రోల్ లోకి తీసుకోవాలని, కుదిరితే లాక్కునేందుకు గుజరాతీలు కుట్ర చేస్తున్నారంటూ ఠాక్రే సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రహస్య ఎజెండాతోనే ముంబైపై కామెంట్స్ చేస్తున్నరని మండిపడ్డారు. 

ఇది కూడా చూడండి: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!

ఇదిలా ఉంటే.. మార్చి 21, 22, 23 తేదీల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభను బెంగళూరులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభను గతేడాది నాగ్‌పూర్‌లో నిర్వహించారు. అయితే ఈ ఏడాది బెంగళూరు వేదిక కానుంది. ఈ సభలో 2024-25 కార్యకలాపాల నివేదికను ప్రతిపాదించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల విశ్లేషణతో పాటు భవిష్యత్ ప్రణాళిక గురించి చర్చించనున్నారు. ఈ సభపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. 

ఇది కూడా చూడండి: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ vs న్యూజిలాండ్..దక్షిణాఫ్రికా ఇంటికి..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

New Update
Agniveers

Agniveers

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఆదివారం నాయబ్ సింగ్‌ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

'' హర్యానా నుంచి 2022-23లో 2,227 మంది, 2023-24లో 2893 మంది ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరారు. త్రివిధ దళాల్లో తమ సర్వీసులు పూర్తి చేసుకున్న అగ్నివీరుల భవిష్యత్తు కాపాడేందుకు మా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచిందని'' నాయబ్ సింగ్ సైనీ అన్నారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా హర్యానాలో చేపట్టే కానిస్టేబుళ్లు, ఫారెస్టు గార్డు, జైల్‌ వార్డెన్ల నియామకాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు హర్యానా అగ్నివీర్ పాలసీ 2024ను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా అగ్నివీరులకు పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. వీటితో పాటు స్వయం ఉపాధిని ఎంచుకునే వాళ్లకి కూడా అవసరమైన సబ్సిడీలు అందిస్తామని పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

Also Read: అమెరికాలో అగ్నిప్రమాదం...పది మంది తెలుగు విద్యార్థులు..

 telugu-news | rtv-news | haryana | agniveer | agniveer-jobs

Advertisment
Advertisment
Advertisment