J&K: కాశ్మీర్ లో కరువు తప్పదేమో.. వాతావరణశాఖ

కాశ్మీర్ లో కరువు తప్పదు అంటున్నారు వాతావరణ నిపుణులు. ఈ ఏడాది ఫిబ్రవరి, జనవరిల్లో 80 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. దీని ప్రభావం వల్ల రానున్న రోజుల్లో కరువు తప్పదని హెచ్చరిస్తున్నారు. 

author-image
By Manogna alamuru
New Update
j&k

Drought In Kasmir

కాశ్మీర్ లో జనవరి, ఫిబ్రవరి నెల్లో వర్షాలు (Rains) పడతాయి. అలా పడితేనే అక్కడి నదుల్లో నీరు ఉంటుంది. అప్పుడే వారికి వేసవిలో తాగునీరుకు లోటు ఉండదు. కానీ ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలో ఇప్పటి వరకు పెద్దగా వర్షాలు పడలేదు. ఈ లోటు 79 శాతంగా ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇలాగే పొడి వాతావరణం కొనసాగితే కాశ్మీర్ లోయవాసులకు తాగు నీటితో పాటూ సాగు జలాలకు లోటుపాట్లు తప్పవని చెప్పింది. జీలం, ఇతర నదుల్లో సాధారణ నీటి మట్టంతో పోలిస్తే ఈ ఏడాది ఒక మీటరు తక్కువ స్థాయిలో ప్రవాహం ఉందని..నీటి పారుదల శాఖ తెలిపింది.  మరో 15 రోజుల్లో వర్షం లేదా మంచు పడకుంటే మరింత  కష్టతరం అవుతుందని అంటున్నారు. 

Also Read: Cricket: నేనప్పుడే వెళ్ళను..రిటైర్మెంట్ పై రోహిత్ క్లారిటీ

Also Read :  సూడాన్‌లో దారుణం.. 200 మంది మృతి

వర్షమూ లేదు..మంచూ లేదు..

కాశ్మీర్ (Kashmir) లో ఇప్పటికే నదులు అన్నీ చాలా తక్కువ నీటితో ఉన్నాయి. దక్షిణ కాశ్మీర్ లో అయితే పూర్తిగా ఎండిపోయాయి. దీనికి సంబంధించి చాలా వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. వర్షాలు పడకపోవడం ఒక కారణం అయితే ఈ ఏడాది పెద్దగా మంచు కూడా పడలేదు. సాధారణంగా హిమాలయాల్లో మంచు ఎక్కువగానే పడుతుంది. నవంబర్ నుంచి మార్చి వరకు ఇక్కడ పడే మంచు తర్వాత ఎండలకు కరికి నీరుగా మారుతుంది. దాని వలన కూడా నదులు నిండుతాయి. అయితే ఈ ఏడాది హిమపాతం కూడా తక్కువగానే ఉంది. అది ఇప్పటికే కరిగి నీరుగా మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ పెద్దగా మంచు పడితేనే కానీ రానున్న రోజుల్లో నీరుగా మారే అవకాశం ఉండదు అని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. కానీ మంచు కురిసే పరిస్థితులు కనిపించడం లేదని చెబుతన్నారు. దీంతో కాశ్మీర్ కు కరువు తప్పదని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.

Also Read :  త్వరలో క్యాన్సర్‌కు టీకా.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

Also Read: Champions Trophy: మెగా సమరానికి సై..నేటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ...

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన

పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. బీహార్‌ పర్యటనకు వెళ్లిన ఆయన ఉగ్రదాడిలో మరణించిన బాధితులకు నివాళులర్పించారు. తన ప్రసంగానికి ముందు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఉగ్రవాదులను వదలిపెట్టమని స్పష్టం చేశారు.

author-image
By B Aravind
New Update
PM Modi Pay Tributes to Pahalgam Terrorist Attack Victims

PM Modi Pay Tributes to Pahalgam Terrorist Attack Victims

పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. ఉగ్రదాడిలో అమాయకులు చనిపోయారని అన్నారు. గురువారం ఆయన బీహార్‌ పర్యటనకు వెళ్లారు. అక్కడ నిర్వహిస్తున్న జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవ కార్యక్రమంలో.. రూ.13,480 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని.. ఉగ్రదాడిలో మరణించిన బాధితులకు నివాళులర్పించారు. అలాగే తన ప్రసంగానికి ముందు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం మాట్లాడుతూ.. '' పహల్గాం దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులను భూమిలోకి తొక్కేస్తాం. కలలో కూడా ఊహించని శిక్షలు విధిస్తాం. పహల్గాం ఘటనతో దేశమంతా దుఃఖంలో మునిగిపోయింది. మృతుల కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుంది. ఇది కేవలం పర్యాటకులపై జరిగిన దాడి కాదు. భారత ఆత్మపై జరిగింది. ఉగ్రవాదుల వేట కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం.  చనిపోయిన వాళ్లలో అన్న రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఉన్నారు. ఉగ్రవాదులకు సహకరించిన సూత్రధారులను కూడా వదలిపెట్టమని'' ప్రధాని మోదీ అన్నారు. 

Also Read: స్విట్జర్లాండ్ వీసా క్యాన్సిల్.. మినీ స్విట్జర్లాండ్‌కి వెళ్లి బలి!

ఇక టెర్రరిస్టుల దాడికి వ్యతిరేకంగా కాశ్మీర్‌‌‌‌లో తీవ్రంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మృతులు, బాధితుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ అక్కడి ప్రజలు, వ్యాపారులు, హోటల్స్ యజమానులు పెద్ద సంఖ్యలో రోడ్లమీదికి వచ్చి ఆందోళన చేపట్టారు. టెర్రరిజాన్ని సహించం.. ఆర్మీకి అండగా ఉంటాం అంటూ నినాదాలు చేశారు. కాశ్మీరుల  రోడ్లపైకి వచ్చి నిరసనలు కొనసాగిస్తున్నారు. స్వచ్చంధంగా దుకాణాలు మూసేసి.. నిరసనల్లో పాల్గొంటున్నారు. ఐక్యతా నినాదాలతో భారత సైన్యానికి మద్దతు ఇస్తున్నారు.హిందూస్తాన్ జిందాబాద్ అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: పహల్గాంలో ఉగ్రదాడి..తిరుమలలో హై అలర్ట్

మరోవైపు పహల్గాం దాడి అనంతరం టెన్షన్ వాతావరణం నెలకొంది. భారత్‌లోని  పాక్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది, అధికారులను వారం రోజుల్లోగా వెళ్లిపోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్‌ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అరేబియా మహాసముద్రంలో క్షిపణి పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.  

ఏప్రిల్ 24, 25 తేదీల్లో కరాచీ తీరం వెంబడి ఎకనామిక్ ఎక్లూజివ్‌ జోన్‌లో ఈ క్షిపణి ప్రయోగాలు నిర్వహించేందుకు పాకిస్థాన్‌ ఓ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే ఈ పరిణామాలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని.. భారత రక్షణ రంగ వర్గాలు వెల్లడించాయి. దీంతో ముంబయిలోని భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరమంతా పోలీసు బలగాలు రాత్రిపూట క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించాలని సీనియర్ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. దీంతో బీచ్, హోటల్స్, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, ప్రజలు ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో పెట్రోలింగ్ చేస్తున్నారు. అయితే పాకిస్థాన్‌ క్షిపణి ప్రయోగానికి సిద్ధమవుతుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరికి ఇది భారత్, పాక్ యుద్ధానికి దారి తీస్తుందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. 

telugu-news | rtv-news | pm modi 

Advertisment
Advertisment
Advertisment