/rtv/media/media_files/2026/02/09/shooting-in-college-2026-02-09-15-43-13.jpg)
Shooting in College
పంజాబ్(punjab) లోని తర్న్తరన్ జిల్లాలో దారుణం జరిగింది. లా ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని తోటి స్టూడెంట్ కాల్చి(shooting) చంపేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య(suicide) చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని ఉస్మా అనే గ్రామంలో ఓ లా కాలేజీ ఉంది. ఇందులో ప్రిన్స్ రాజ్, సందీప్ కౌర్ అనే విద్యార్థులు ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు.
Also Read: ఆర్టిఫిషియల్ రంగంలో సత్తా చాటిన భారత్.. చాట్ GPT, జెమినిలను బీట్ చేసిన మన AI టూల్స్
College Shooting In Punjab - One Side Love
అయితే ప్రిన్స్రాజ్ సోమవారం ఉదయం తన వద్ద ఉన్న గన్తో క్లాస్కు వచ్చాడు. అప్పటికి క్లాస్ ఇంకా మొదలుకాలేదు. దీంతో తనవద్ద ఉన్న గన్తో సందీప్ కౌర్ తలలో కాల్చి చంపేశాడు. ఆ తర్వాత అదే పిస్తోల్తో అతడు సూసైడ్ చేసుకున్నాడు. సందీప్ కౌర్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలపాలైన ప్రిన్స్ రాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దుర్ఘటనను చూసిన తోటి విద్యార్థులు, కళాశాల సిబ్బంది షాకైపోయారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
పంజాబ్లోని టార్న్ తరణ్ జిల్లాలో దారుణం
— greatandhra (@greatandhranews) February 9, 2026
లా కాలేజీ క్లాస్ రూమ్ ఫస్టియర్ విద్యార్థిని సందీప్ కౌర్ను తోటి విద్యార్థి ప్రిన్స్ రాజ్ తుపాకీతో కాల్చి చంపేశాడు.
అనంతరం తానూ తలపై కాల్చుకున్నాడు. ప్రస్తుతం అతను తీవ్ర గాయంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు pic.twitter.com/i7G7jO8wjr
Also Read: చైనాలో భారత్ తొలి జయకేతనం: అథ్లెటిక్స్లో తేజస్విన్ శంకర్కు 'గోల్డ్'
కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టారు. అయితే వన్సైడ్ లవ్(one-side-love) వల్ల ఈ దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. రాజ్ తీసుకొచ్చిన పిస్తోల్ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కాలేజీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాక్ష్యాలు సేకరించేందుకు ఫోరెన్సిక్ టీమ్ కూడా అక్కడికి చేరుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
Follow Us