Love Story: ఇదొక విచిత్రమైన లవ్ స్టోరీ.. ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చి పాపను పడేశాడు!

బిహార్‌లో ఓ ప్రేమ వివాహం విచిత్రంగా జరిగింది. ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చిన ఎలక్ట్రీషియన్ ఆ ఇంటి యువతిని ప్రేమలో పడేసి పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వార్త వైరల్ అవుతుండగా ఇంట్రెస్టింగ్ సోర్టీకోసం పూర్తి ఆర్టికల్లోకి వెళ్లండి. 

New Update
fan love

fan love story

బిహార్‌లో ఓ ప్రేమ వివాహం విచిత్రంగా జరిగింది. ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చిన ఎలక్ట్రీషియన్ ఆ ఇంటి యువతిని ప్రేమలో పడేసి పెళ్లి చేసుకున్న ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు తమ లవ్ స్టోరీ గురించి దంపతులిద్దరూ మీడియాకు వెల్లడించగా జనాలు సరదాగా నవ్వుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

Also Read :  ట్రంప్‌కు షాకిచ్చిన చైనా.. ఏకంగా 125% టారిఫ్ విధింపు..

మొదటి చూపులోనే ప్రేమ..

ఈ మేరకు బిహార్‌లోని ఓ గ్రామానికి చెందిన యువతి ఇంట్లో ఫ్యాన్‌ పాడైపోయింది. దీంతో రిపేర్‌ చేయాలంటూ ఎలక్ట్రిషియన్‌ను పిలిపించుకుది. ఫస్ట్ టైమ్ వచ్చి తన పని తాను చేసుకొని వెళ్లిపోయాడు. అయితే మొదటి చూపులోనే ఆ యువకుడిని ఇష్టపడ్డ యువతి.. అతని ఫోన్‌ నెంబర్‌ సేవ్ చేసుకుంది.  ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తుపు రిపేర్ అయినా అతనికే కాల్‌ చేయడం మొదలుపెట్టింది. ఇలా ఇద్దరి మధ్య పరిచయం మరింత క్లోజ్ కావడంతో ఇంట్లో వాళ్లను ఒప్పంచి పెళ్లి చేసుకున్నారు. 

Also Read: ఆర్మీలో డాక్టర్ టెర్రరిస్ట్ గ్రూప్‌ మాస్టర్ మైండ్‌గా ఎందుకు మారాడు..?

ఇక తమ ప్రేమ పెళ్లి గురించి ఇలా చెప్పారు. 'ఫస్ట్ టైమ్ రిపేర్‌కు వెళ్లినప్పుడు ఆమె నన్ను ఇష్టపడినట్లు అర్థం చేసుకోలేకపోయా. కానీ ఆమె తరచూ ఫోన్ చేయడంతో అనుమానం వచ్చింది. అయినా పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు లవ్ చేస్తున్నట్లు మెసేజ్‌ చేయడంతో అయోమయానికి గురయ్యాను' అని వరుడు చెప్పాడు. 'అతను మొదటిసారే నా మనసు దోచేశాడు. అతనిలో ఏదో కొత్తగా అనిపించింది. అతనితో మాట్లాడుతుంటే నాకు మంచిగా అనిపించేది. మొత్తానికి మేము పెళ్లి చేసుకోవడం సంతోంగా ఉంది' అంటూ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తతం ఈ వార్త వైరల్ అవుతోంది. 

Also Read: TGPSC మరో కీలక నిర్ణయం.. ఇక నుంచి 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన!

Also Read :  సోషల్ మీడియాలో ఎక్కువ చేస్తే.. వాళ్లకు అదే ఆఖరి రోజు.. చంద్రబాబు మాస్ వార్నింగ్

love-story | telugu-news | Fan Repair | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | viral news telugu

#viral news telugu #national news in Telugu #today-news-in-telugu #latest-telugu-news #Fan Repair #telugu-news #love-story #bihar
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Muda case: ముడా స్కామ్ కేసులో సిద్దరామయ్యకు కోర్టు...

Muda case: ముడా స్కామ్ కేసులో సిద్దరామయ్యకు కోర్టు షాక్..!

ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు అనుమతించింది. లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బిరిపోర్ట్ విభేదిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసింది.

New Update
MUDA Scam: కర్ణాటకలో ముడా స్కామ్ కలకలం.. సిద్ధరామయ్య భార్యపై కేసు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ముడా స్కామ్ కేసు వేంటాడుతోంది. మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ కేసులో ఆయనకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముడా కేసులో విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు మంగళవారం అనుమతించింది. కర్ణాటక లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బి రిపోర్ట్ తో విభేదిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.

Also read: ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

ముడా భూముల కేటాయింపులో సిద్ధరామయ్య అవినీతికి పాల్పడలేదని లోకాయుక్త పోలీసులు ఇటీవల క్లీన్‌చిట్ ఇచ్చారు. అయితే దీనిని ఈడీ, హక్కుల కార్యకర్త స్నేహమయి కృష్ణ సవాలు చేశారు. ఈ కేసులో కొన్ని కీలక కోణాల్లో విచారణ జరగలేదని ఈడీ, స్నేహమయి కృష్ణ వాదించారు. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్‌ విచారణ చేపట్టారు. లోకాయుక్త పోలీసులు పూర్తి దర్యాప్తు నివేదిక సమర్పించిన తర్వాతే బి రిపోర్ట్ పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను మే 7న తేదీకి వాయిదా వేశారు. దీనికి ముందు, సిద్ధరామయ్య, మరో ముగ్గురిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మైసూరు డివిజన్ లోకాయుక్త పోలీసులు ప్రాథమిక నివేదకను సమర్పించారు. అయితే విచారణ కేవలం నలుగురు వ్యక్తులకే పరిమితం కాదని, ఇందులో ప్రమేయమున్న అందరికీ దర్యాప్తు జరపాలని, సమగ్ర నివేదిక సమర్పించాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

Advertisment
Advertisment
Advertisment