ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీకి BIG షాక్.. బీజేపీకి గుడ్‌న్యూస్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు 8 మంది ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆప్ నుంచి MLA టికెట్ రాలేని అసంతృప్తితో శనివారం బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇది కేజ్రీవాల్‌కు పెద్ద లోటు. కాగా ఫిబ్రవరి 5నే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.

New Update
BJP in dilhi join

BJP in dilhi join Photograph: (BJP in dilhi join)

ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని రాజకీయాలు వేడెక్కాయి. అధికార పార్టీ ఆమ్ ఆద్మీకి చెందిన 8 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి షాక్‌ ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు దక్కలేదని అసంతృప్తితో శుక్రవారం సొంత పార్టీకి రాజీనామా చేశారు. ఆ 8 మంది ఎమ్మెల్యేలు శనివారం బీజేపీలో చేరారు.

ఇది కూడా చదవండి : Amit Shah: ఒక్కసారి మోదీకి అవకాశం ఇవ్వండి.. అది చేసి చూపిస్తాం: అమిత్ షా

ఆప్‌కు రాజీనామా చేసిన ఈ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే ముందు తమ ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకర్‌కు అందజేశారు. పాలం నియోజకవర్గం నుంచి వందన గౌర్, త్రిలోక్‌పురి నుంచి రోహిత్ మెహ్రౌలియా,  మెహ్రౌలి ఆప్ లీడర్ నరేష్ యాదవ్, కస్తూర్బా నగర్‌కు చెందిన మదన్ లాల్, ఉత్తం నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రాజేష్ రిషి, మాదిపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే గిరీష్ సోని,  బిజ్వాసన్ ఎమ్మెల్యే బీఎస్ జూన్,ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే పవన్ శర్మ లు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇది కూడా చదవండి :Budget 2025: బడ్జెట్‌లో సామాన్యులకు ఊరట.. ఢిల్లీ ఎన్నికలపై ప్రభావం ఉంటుందా ?

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా, బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా సమక్షంలో బీజేపీ పార్టీ కడువా కప్పుకున్నారు. ఓటింగ్ కొన్ని రోజుల ముందు ఇలా జరగడం ఢిల్లీలో బీజేపీకి మైలేజ్ ఇస్తోందని అనుకుంటున్నారు. ఆప్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం వల్లే వారు ఇన్ని రోజులు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఆప్‌ను వీడి.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వనున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు