Hero Navadeep Drugs Case: నవదీప్ కు షాక్.. నార్కోటిక్ పోలీసుల నోటీసులు.. అసలేమైందంటే?

నవదీప్ కు నార్కోటిక్ పోలీసులు నోటీసులను జారీ చేశారు. ఈనెల 23 వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేశారు. 41 A కింద నార్కోటిక్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

New Update
Hero Navadeep Drugs Case: నవదీప్ కు షాక్.. నార్కోటిక్ పోలీసుల నోటీసులు.. అసలేమైందంటే?

నటుడు నవదీప్ చుట్టు డ్రగ్స్ ఉచ్చు గట్టిగానే బిగుసుకుంది. హైకోర్టులో అతను వేసి పిటిషన్ కొట్టివేయండతో నార్కోటిక్ పోలీసులు ఈరోజు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేశారు. ఎక్కడున్నా వెంటనే హైదరాబాద్ కు తిరిగిరావాలని చెప్పారు. డ్రగ్స్ కేసుకు తనకూ ఏం సంబంధం లేదని, విచారణకు హాజరు కానని హైకోర్టులో నవదీప్ పిటిషన్ వేశారు. గతంలో ఉన్న డ్రగ్స్ కేసుల్లో నవదీప్ నిందితుడిగా లేడని.. గతంలోనూ దర్యాప్తు సంస్థల ముందు నవదీప్ హాజరయ్యారని.. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్‌ కు అసలు ఎలాంటి సంబంధం లేదని అతని తరపు న్యాయవాది సిద్దార్థ్ వాదించారు. కానీ కోర్టు ఈ పిటిషన్ ను కొట్టేసింది. ఈ క్రమంలో తాజాగా నవదీప్ కు 41ఏ నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ డ్రామా ఆడుతున్నాడని పోలీసులు చెబుతున్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో తనకు ఏమి సంబంధం లేదంటూ నవదీప్ బుకాయిస్తున్నారని వారు చెబుతున్నారు. నవదీప్ ఇంట్లో నార్కోటిక్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నటుడు పోలీసు విచారణకు ఏ మేరకు సహకరిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రీసెంట్ గా మాదాపూర్ పోలీసులు నిర్వహించిన రైడ్‌లో మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో హీరో నవదీప్‌ను డ్రగ్స్ వాడినట్లుగా గుర్తించారు.  పోలీసుల ఆపరేషన్‌లో పట్టుబడిన రాంచందర్ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలంతో ఈ విషయం బయటపడింది.  దీంతో నార్కోటిక్ అధికారులు నవదీప్ ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: ఏపీలో దారుణం.. టీడీపీ నేతను నరికి నరికి

ఒంగోలులో మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. తన ఆఫీసులో ఉండగా ముగ్గురు దుండగులు వచ్చి కత్తులతో దాడులు చేశారు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా ఆయన అప్పటికే మృతి చెందారు.

author-image
By B Aravind
New Update

ఒంగోలులో దారుణం జరిగింది. మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. పద్మ టవర్స్‌లోని తన ఆఫీసులో ఉండగా ముగ్గురు దుండగులు వచ్చి కత్తులతో దాడులు చేశారు. ఆ తర్వాత స్థానికులు వీరయ్యను సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే లిక్కర్‌ సిండికేట్‌ విషయంలో గత కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 

Also Read: ముంబై నుంచి హీరోయిన్‌ని తీసుకొచ్చి.. అరెస్టైన ఆ IPS చేసిన పని ఇదేనా..?

 

Advertisment
Advertisment
Advertisment