Rice: బియ్యాన్ని వంటకే కాదు.. ఇలా కూడా ఉపయోగించవచ్చు

బియ్యం వండిన నీటిని మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే పోషకాలు మొక్కలను తెగుళ్ల నుండి రక్షిస్తాయి. కొన్ని ఇనుప వస్తువులు, కత్తులు, కత్తెరలు, తేమతో తుప్పు పడతాయి. బియ్యాన్ని క్రమం తప్పకుండా మార్చడం మర్చిపోవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు.

New Update
Rice

Rice

చాలా మంది బియ్యాన్ని వంటకు మాత్రమే ఉపయోగిస్తారు. కానీ ఇతర పనులకు కూడా బియ్యాని వాడవచ్చు. మనం ప్రతిరోజూ ఉపయోగించే మొబైల్ ఫోన్లు, రిమోట్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కొన్నిసార్లు అనుకోకుండా నీటిలో పడతాయి లేదా వర్షంలో తడిసిపోతాయి. ఈ సమయంలో వాటిని బియ్యంతో నిండిన పెట్టెలో వే బియ్యాన్ని కప్పి  దాదాపు రెండు గంటలు అలాగే ఉంచండి. ఇలా చేయడం వల్ల బియ్యం దానిలోని తేమను గ్రహిస్తాయి. అప్పుడప్పుడు వంటగది, రిఫ్రిజిరేటర్‌ల నుండి కూడా దుర్వాసన వస్తుంది. ఫ్రిజ్ లేదా అల్మారా మూలలో బియ్యం నిండిన గిన్నెను ఉంచితే బియ్యం వాసనను గ్రహిస్తుంది. 

Also Read :  బూట్లలో కుప్పలు తెప్పలుగా బంగారం.. మొత్తం ఎన్ని కేజీలంటే?

పండ్లను శుభ్రం చేయడానికి..

మనకు అవసరమైన పదార్థమైన ఉప్పు తడిసినప్పుడు గట్టిపడుతుంది. ఇది నిరోధించడానికి కొన్ని బియ్యపు గింజలను జోడిస్తే సమస్య మాయమవుతుంది. మామిడి, పనస వంటి పండ్లు త్వరగా పండించడానికి చాలా మంది వాటికి కొన్ని రసాయనాలను కలుపుతారు. వీటిని బియ్యంలో కలిపితే రసాయనాలు లేకుండా సహజంగా పండుతుంది. బియ్యం కడగడానికి ఉపయోగించే నీటిని కూరగాయలు, పండ్లను శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ పద్ధతిలో కూరగాయలు, పండ్లను ఆ నీటిలో అరగంట పాటు ఉంచి ఆపై వాటిని సాధారణ నీటితో మళ్ళీ శుభ్రం చేస్తే సరిపోతుంది. ఈ రోజుల్లో అరటి తొక్కలు, గుడ్డు పెంకులను ఇండోర్ మొక్కలకు సహజ ఎరువులుగా ఉపయోగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: వేసవిలో పాలు చెడిపోకుండా ఉండటానికి చిట్కాలు

కానీ దీనితో పాటు బియ్యం వండిన నీటిని మొక్కలకు ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే పోషకాలు మొక్కలను తెగుళ్ల నుండి రక్షిస్తాయి. కొన్ని ఇనుప వస్తువులు, కత్తులు, కత్తెరలు, తేమతో తుప్పు పడతాయి. అయితే వాటిని బయట ఉంచడానికి బదులుగా బియ్యం నిల్వ చేసే పాత్రలో ఉంచితే ఈ సమస్య తలెత్తదు. తేమ వెండి ఆభరణాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా అవి కళలా కనిపిస్తాయి. అలాంటి సమయాల్లో మెష్ బ్యాగ్‌లో బియ్యం నింపండి. వీటిని నిల్వ పెట్టెలో పెడితే బియ్యం తేమను గ్రహిస్తాయి. ఈ బియ్యాన్ని క్రమం తప్పకుండా మార్చడం మర్చిపోవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Also Read :  రాష్ట్రపతి బిల్లులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

ఇది కూడా చదవండి: చాక్‌పీస్‌తో కేవలం రాయడమే కాదు.. ఇలా కూడా చేయొచ్చు


rice | latest health tips | best-health-tips | latest-telugu-news | today-news-in-telugu | healthy life style | daily-life-style | human-life-style

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Cancer Reduce Foods: ఈ పండ్లు తింటే క్యాన్సర్‌ పరార్.. ఆ అద్భుతమైన ఆహారాలు ఇవే

నేటి కాలంలో క్యాన్సర్‌ మరణాల సంఖ్య పెరుగుతోంది. క్యాన్సర్ రోగులు సోర్సోప్, బ్రోకలీ, ఆపిల్స్‌ తింటే క్యాన్సర్ తగ్గుతుంది. ఇవి రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్‌ను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు