Israel-Netanyahu: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్‌ కు నెతన్యాహు హెచ్చరికలు!

లెబనాన్ పై ఇజ్రాయెల్‌ మరోసారి ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది.తమ పై వచ్చే దాడులను ఎదుర్కోవడానికి ప్రతీదాడులు తప్పవని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టం చేశారు.

New Update
NETHANYAHU

NETHANYAHU

లెబనాన్ పై ఇజ్రాయెల్‌ మరోసారి ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది.బీరూట్‌ శివారు ప్రాంతం పై భారీ వైమానిక దాడులు చేసింది. వీటితో పాటు డ్రోన్‌ లతో మరో మూడు హెచ్చరిక దాడులకు పాల్పడింది.నగరమంతా వీటి శబ్దాలు వినిపించడంతో పాటు దట్టమైన పొగ అలముకుంది.తాజా పరిణామాలపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యూహు స్పందిస్తూ..తమ పై వచ్చే బెదిరింపులను ఎదుర్కోవడానికి ప్రతిదాడులు తప్పవన్నారు. ఈ క్రమంలో లెబనాన్‌ అంతటా దాడి చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: Pastor Praveen: ప్రవీణ్ ది హత్యే.. పోలీసులు దాస్తున్న విషయాలివే.. మహాసేన రాజేష్ సంచలన ఆరోపణలు!

ప్రతిచోట దాడులు....

లెబనాన్‌ ప్రభుత్వానికి స్పష్టమైన సందేశాన్ని పంపిస్తున్నా.సమీకరణాలు మారాయి.మా ప్రాంతాలపై ఎటువంటి దాడులను అనుమతించం. మీరు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయకపోతే ...మేము అమలు చేస్తాం.ఇజ్రాయెల్‌ కు ఎటువంటి ముప్పు ఎదురైనా లెబనాన్‌ లో ప్రతిచోట దాడులు నిర్వహిస్తామని తెలిపారు. ఉత్తర భాగంలో ఉన్న మా ప్రాంతవాసులంతా సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకునేలా చర్యలు తీసుకుంటాం అని నెతన్యాహు పేర్కొన్నారు. 

Also Read: Palamuru Project: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేం.. కేంద్రం సంచలన ప్రకటన

మరో వైపు అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య గత నవంబరులో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాలు ఉల్లంఘనకు గురవుతున్నాయి.లెబనాన్‌ నుంచి తమ భూభాగంలోకి రాకెట్లు దూసుకొచ్చాయని ఇజ్రాయెల్‌ సైన్యం ఇటీవల ఆరోపించింది. హెజ్‌బొల్లామాతరం తాము వాటిని ప్రయోగించలేది,కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది.అయినప్పటికీ తాజాగా బీరూట్‌ పై దాడులు చేసిన ఇజ్రాయెల్‌ తాజా హెచ్చరికలు చేసింది.

Also Read:Restaurant Service Charges: రెస్టారెంట్లపై ఢిల్లీ హైకోర్టు మండిపాటు..సర్వీస్ ఛార్జీలపై ఆదేశాలు

Also Read: Wife Cheating: మేనల్లుడితో అక్రమ సంబంధం.. కాఫీలో విషం కలిపి భర్తపై భార్య దారుణం!

israel | lebanon | attack | netanyahu | benjamin-netanyahu | benjamin netanyahu on lebanon | benjamin netanyahu hezbollah | latest-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Fire Accident : టెస్లా షోరూంలో అగ్ని ప్రమాదం...17 కార్లు దగ్ధం.. వారి పనే అంటున్న మస్క్

ప్రంపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ర్టిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇటలీలోని రోమ్ శివార్లలో ఉన్న షోరూంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 17 కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

New Update
Fire At Tesla Dealership

Fire At Tesla Dealership

Fire Accident: ప్రంపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ర్టిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇటలీలోని రోమ్ శివార్లలో ఉన్న షోరూంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 17 కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

ఇటలీలోని రోమ్ నగర శివార్లలోని టెస్లా షోరూంలో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది.షార్ట్‌ సర్య్కూట్‌ లేదా ఇతర కారణాలతో  షోరూం అంతా కాలిపోయింది. ఫలితంగా అందులో ఉన్న 17 కార్లు పూర్తిగా కాలిపోయాయి. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. హుటాహుటిన రంగంలోకి దిగారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో సిబ్బంది మంటలను ఆర్పారు. అయితే ఉదయం 4.30 గంటలకు మంటలు అంటుకున్నాయని.. అదృష్ట వశాత్తు షోరూంలో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని అగ్నిమాపక సిబ్బంది ఓ ప్రకటనలో తెలిపింది.

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

అయితే ఈ విషయం తెలుసుకున్న మస్క్ తాజాగా స్పందించారు. ఇది కావాలనే ఉగ్రవాదులు చేశారని ఆరోపించారు. తమ సంస్థ కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే తయారు చేస్తోందని.. ఈ స్థాయిలో హింస చాలా పెద్ద తప్పని వ్యాఖ్యానించారు. మరోవైపు ఇటలీ ఉప ప్రధాని మాటియో సాల్విని సైతం దీనిపై స్పందించి మస్క్‌కు మద్దతు తెలిపారు. టెస్లా కంపెనీపై కావాలని దాడులు చేయడం దారుణం అన్నారు. ఇకనైనా ఈ దాడులు ఆపాలని కోరుతున్నట్లు చెప్పారు. అలాగే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ను డోజ్ అధినేతగా నియమించారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి.. అనేక షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.. దీంతో వారికి అనేక మంది శత్రువులవుతున్నారు. ఈక్రమంలోనే స్థానిక ప్రజల నుంచి ఉగ్రవాదుల వరకు వీరిపై కోపంగా ఉన్నారు. అందుకే పగ తీర్చుకోవాలని ఎలాన్ మస్క్ కంపెనీపై దాడులు చేస్తున్నారు. అమెరికాతో పాటు అనేక దేశాల్లో ఈ దాడులు సాగుతున్నాయి. ఇటీవలే ట్రంప్ సైతం దీనిపై స్పందించి.. టెస్లా కార్లపై దాడికి పాల్పడితే 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించారు.

ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్

Advertisment
Advertisment
Advertisment