US-Iran: చర్చలకు ముందే ఇరాన్ షరతులకు ఒప్పుకున్న అమెరికా..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు కీలక ముందడుగు పడింది. ఇరాన్ తీసుకొచ్చిన ప్రతిపాదనలకు అమెరికా సానుకూలంగా స్పందించింది. మరికొన్ని గంటల్లో ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు కీలక ముందడుగు పడింది. ఇరాన్ తీసుకొచ్చిన ప్రతిపాదనలకు అమెరికా సానుకూలంగా స్పందించింది. మరికొన్ని గంటల్లో ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి.
ఇరాన్, అమెరికాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ లెబనాన్ పై మాత్రం ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. లెబనాన్పై దాడులను ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
ప్రపంచ దేశాలన్నీ ఊపిరి పీల్చుకుంటాయనుకున్న తరుణంలో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం కేవలం కొన్ని గంటల్లోనే కుప్పకూలిపోయేలా కనిపిస్తోంది.
ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. అయితే నిన్న సీజ్ఫైర్ ఒప్పందం కుదరడంతో హార్మూజ్ను తెరిచినట్లు వార్తలు వచ్చాయి. అయితే కొన్ని గంటల్లోనే ఇరాన్ తిరిగి హార్మూజ్ను మూసివేసింది
ఇరాన్, అమెరికాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం రెండవ వారంలోనే ప్రమాదంలో పడింది. ఇజ్రాయెల్ లెబనాన్లోని హెజ్బుల్లా లక్ష్యాలపై దాడులను తీవ్రతరం చేయడంతో, దానికి నిరసనగా ఇరాన్ ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని మరోసారి మూసివేసింది.
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదిరాయి. ఇటు ఇరాన్ దాడులు, అటు ఇజ్రాయెల్ భూతల దాడులతో ప్రాంతీయ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. హిజ్బుల్లా స్థావరాలను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం ఉదయం దక్షిణ లెబనాన్లోకి ప్రవేశించింది.
తాజాగా ఇజ్రాయెల్ మళ్లీ హెజ్బొల్లాపై దాడులకు దిగింది. శుక్రవారం లెబనాన్లోని హెజ్బొల్లా భూగర్భ స్థావరాలపై బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 11 మంది పాలస్తీనియన్లు గాయపడ్డారు.