Canada: కెనడాలో బోల్తాపడ్డ విమానం..18మందికి తీవ్రగాయాలు

ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగానే అవుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట విమానాలు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. తాజాగా కెనడాలోని టొరంటో పియర్‌సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మందికి తీవ్రగాయాలయ్యాయి. 

author-image
By Manogna alamuru
New Update
flight

canada Flight Accident

ఎయిర్ ప్లైన్ (Airplane) లు గుద్దుకోవడం, కూలిపోవడం లాంటి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ ఏకంగా బోల్తా పడ్డం ఎక్కడైనా చేశారా. అది కూడా రన్ వే మీద ల్యాండ్ అవుతూ. కొద్దిసేపటి క్రితం కెనడా (Canada) లోని టొరంటోలో ఈ ఘటన జరిగింది. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) లో ప్రమాదం చోటు చేసుకుంది. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అమెరికాలోని మిన్నె పొలిస్‌ నుంచి టోరంటోకు వచ్చింది. అక్కడకు వచ్చి ల్యాంగ్ అవుతుండగా..రన్ వే మీద విపరీతమైన మంచు ఉండడంతో స్కిడ్ అయింది. అలా అయిన విమానం వేగంగా వెళ్ళి కాపేటికి బోర్లా పడిపోయింది. పైలట్ ఎంత కంట్రోల్ చేసినప్పటికీ ఫ్లైట్ కంట్రోల్ అవ్వలేదు. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. ఫ్లైట్ లో నుంచి ప్రయాణికులను బయటకు తీసి...దగ్గర లోని ఆసుపత్రికి తరలించింది.  

వైరల్ అవుతున్న వీడియో..

రన్ వేపై విమానం జారుతూ బోల్తాపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానం జారుతున్నప్పుడు అందులో నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే ఎమర్జెన్సీ సిబ్బంది అప్రమత్తమై వాటిని అదుపుచేశారు. అందులో చిక్కుకుపోయిన ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనకు కారణం ఇదీ అని ఇప్పుడే చెప్పలేమని...కానీ ప్రాథమికంగా వాతావరణ పరిస్థితులే కారణమని అధికారులు చెబుతున్నారు. టొరంటో విమానాశ్రయం వద్ద ఉష్ణోగ్రత మైనస్‌ 8.6 డిగ్రీలుగా ఉంది. గంటకు 51కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రన్‌వేపై దట్టంగా మంచు పేరుకుపోయిందని అధికారులు చెప్పారు. 

Also Read :  ఏపీలో మహిళలకు తీపికబురు.. వారందరికి ఉచితంగా కుట్టు మిషన్లు

Also Read :  ఎంతకు తెగించావ్రా..  అక్రమసంబంధం కోసం కట్టుకున్న భార్యను..

Also Read :   భారత్ను చూసి బుద్దితెచ్చుకో .. టీమిండియా జెర్సీ పై పాకిస్తాన్ పేరు!

ఎక్కువవుతున్న ప్రమాదాలు...

ఈమధ్య కాలంలో విమానాలు ప్రమాదానికి గురవ్వడం చాలా ఎక్కువ అవుతోంది. ముఖ్యంగా అగ్రరాజ్యంలో ఇది ఎక్కువగా జరుగుతోంది. వాషింగ్టన్ రీగన్ ఎయిర్ పోర్ట్ దగ్గర జరిగిన ప్రమాదంలో 68 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అక్కడ పెను విషాదాన్నే మిగిల్చింది. దాని తరువాత కూడా వరుసగా రెండు సార్లు అమెరికాలో విమానాలు ప్రమాదాలుకు గురైయ్యాయి. ఫిలడెల్ఫియాలో ఇళ్ళు, షాపింగ్ మాల్ మీద ఫ్లైట్ కూలిపోయిన ఘటనలో 10 మంది దాకా చనిపోయారు. రీసెంట్గా టెక్సాస్ లో కూడా మరో విమానం అదుపు తప్పి రోడ్డు మీద ల్యాండ్ అయింది. ఇందులో విమానం రెండు ముక్కలైనట్లు తెలుస్తోంది. అలాగే పలు కార్లు కూడా ధ్వంసం అయ్యాయి. అయితే ఈ విమాన ప్రమాదాలకు ఇదీ కారణం అని ప్రత్యేకంగా చెప్పలేకపోతున్నారు. పైలట్లను కూడా తప్పు పట్టడానికి వీలు లేకుం డా పోయింది. 

Also Read :  తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

అమెరికా కలలు ఇంక కల్లలుగానే మిగిలిపోతాయా అంటే అవుననే అనిపిస్తోంది. ఒకవైపు హెచ్ 1 వీసాల లాటరీ తగ్గించేశారు...మరోవైపు విద్యార్థి వీసాల మీ కూడా భారీగా కత్తెర వేస్తోంది. ఈసారి చాలా మంది విద్యార్థులకు వీసాలను తిరస్కరించింది. 

New Update
F1 Visa

F1 Visa

అమెరికాలో ఉన్నత విద్యకు బోలెడంత డిమాండ్ ఉంది. మన దేశం నుంచి దీని కోసం చాలా మంది వెళుతుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది.  అయితే కొంతకాలంగా విద్యార్థి వీసాల్లో బాగా కోత పడిపోతోంది.  కొత్తగా వచ్చే అప్లికేషన్లు చాలా మట్టుకు తిరస్కరణకు గురౌతున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు చెందినవే ఎక్కువ ఉంటున్నాయని హైదరాబాద్ కన్సెల్టెన్సీలు చెబుతున్నాయి. యూఎస్ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు లభించినా..వీసాలు రావడం లేదని చెబుతున్నారు. 

ఏ చిన్న తప్పు ఉన్నా వదలడం లేదు..

అమెరికాలో ఆగస్టు- డిసెంబర్‌ సెమిస్టర్‌ సమయంలోనే మన విద్యార్థులు అధికంగా వెళ్తుంటారు. అయితే, గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 41 శాతం వీసా దరఖాస్తులను ఒప్పుకోలేదు. వాటికి కారణాలేంటనేది కూడా చెప్పడం లేదు. ఏ చిన్న పొపాటు ఉన్నా వదడలడం లేదు..అన్నీ పట్టి పట్టి చూస్తున్నారని చెబుతున్నారు. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదని...ట్రంప్ వచ్చాకనే ఇదంతా జరుగుతోంది అంటున్నారు. విద్యార్థులకు ఇచ్చేది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఎఫ్ 1. దీనితో అక్కడ సెటిల్ అవడం కూడా కుదరదు. అయినా కూడా వీసాలను అనుమతించడం లేదు. 

అమెరికా చెబుతున్న లెక్కల ప్రకారం 2023-24 లో ఎఫ్‌-1 వీసాల కోసం 6.79 లక్షల దరఖాస్తులు రాగా.. ఇందులో 2.79 లక్షల దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. అంతకుముందు 2022-23లో 6.99 లక్షల దరఖాస్తుల్లో 2.53 లక్షల అప్లికేషన్లను నిరాకరించారు. దీనికి ప్రధాన కారణం చదువు అయిపోయినా కూడా విద్యార్థులు అమెరికాలోనే ఉండిపోవడం అని చెబుతున్నారు. ఇక్కడ చదువు అవ్వగానే.. ఇక్కడే ఉద్యోగం సంపాదించుకోవాలని విద్యార్థులు అనుకుంటారు. చదువుకు, ఉద్యోగానికి మధ్య గ్యాప్ వచ్చినా కూడా ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతున్నారు. దీన్ని గమనించిన అమెరికా ప్రభుత్వం ఏకంగా వీసాలనే తిరస్కరిస్తోంది. మరోవైపు అమెరికాలో సీటు దొరకని స్టూడెంట్స్ అందరూ యూకే, జర్మనీలకు వెళ్ళిపోతున్నారు.

 today-latest-news-in-telugu | usa | student-visa 

Also Read: సుంకాల పేరుతో ప్రపంచంపై ట్రంప్ ట్రేడ్ వార్.. ఎవరికెంత నష్టం! 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు