BIMSTEC: ఎట్టకేలకు నెరవేరిన యూనస్ కోరిక.. మొదటిసారి విందు పంచుకున్న మోదీ

థాయ్‌లాండ్ వేదికగా బీమ్‌స్టిక్ శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. దీనికి భారత్‌ ప్రధాని మోదీతో పాటు బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహ్మద్ యూనస్ కూడా హాజరయ్యారు. మోదీ పక్కనే కూర్చోని విందు చేశారు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కలవడం ఇదే మొదటిసారి.

New Update
Modi Yunus dinner BIMSTEC

Modi Yunus dinner BIMSTEC Photograph: (Modi Yunus dinner BIMSTEC )

భారత ప్రధాని మోదీ ప్రస్తుత థాయ్‌లాండ్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా బీమ్‌స్టిక్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సదస్సులో భారత్‌తో పాటు థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, భూటాన్‌ దేశాల అధినేతలు కూడా పాల్గొన్నారు. అయితే షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌లో తలదాచుకున్న తర్వాత మోదీని బంగ్లాదేశ్ చీఫ్ మహ్మద్ యూనస్ కలవడం ఇదే మొదటిసారి. ఈ సమావేశంలో పాల్గొనడంతో పాటు మోదీతో కలిసి విందు పంచుకున్నారు.

ఇది కూడా చూడండి: Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

మోదీ పక్కనే కూర్చోని..

థాయ్‌లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ప్రధాని మోదీ పక్కనే బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత యూనస్ కూర్చుకున్నారు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కూడా పెద్దగా లేవు. షేక్ హసీనా ప్రభుత్వం నిష్క్రమించిన తర్వాత మొదటిసారి జరుగుతున్న సమావేశం ఇదే. 

ఇది కూడా చూడండి: Crime News: ఐదుగురు మహిళలతో నటుడు అక్రమ సంబంధం.. 64 ఏళ్ల వయసులో మారని బుద్ధి!

ఇదిలా ఉండగా ఇటీవల మహ్మద్ యూనస్ చైనా పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహ్మద్ మాట్లాడుతూ.. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల గురించి ప్రస్తావించారు. భారత దేశానికి సముద్రం ఉందనే విషయాన్ని మరిచిపోయి మాట్లాడారు. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలు పూర్తిగా భూపరివేష్టితమైవున్నందున బంగాళాఖాతానికి మేమే సంరక్షకులం. ఇదొక పెద్ద ప్రయోజనానికి అవకాశం కల్పిస్తోంది. అందుకే మా దేశంలో పెట్టుబడులు పెట్టండని చైనాని ఆహ్వానిస్తూ.. భారత దేశంపై విమర్శలు గుప్పించారు.

ఇది కూడా చూడండి: Pornography: పోర్న్ వీక్షకులకు బిగ్ షాక్.. 3 నెలల్లో 15 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా!

 

latest-telugu-news | thailand | muhammad-yunus | national news in Telugu | international news in telugu | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

తాను పట్టుకున్న కుందేలుకు మూడ కాళ్ళు అన్నట్టు వ్యవహరిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎవరైనా తగ్గాల్సిందే కానీ తాను తగ్గేదే లే అంటున్నారు. తాజాగా చైనాపై ఏకంగా 104 శాతం సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకుని..ఆ దేశానికి షాక్ ఇచ్చారు.  

New Update
tariffs

USA-China

అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరి పోయింది.  చైనా వెనక్కు తగ్గకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని ట్రంప్ మూడు రోజుల నుంచి హెచ్చరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇవాళ ఆ దేశంపై విధిస్తున్న సుంకాలను 104 శాతం పెంచి భారీ షాక్ ఇచ్చారు. ఇవి ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ కార్యదర్శి ప్రకటించారు. 

ముందే హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు..

రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాల్లో భాగంగా చైనాపై 54 శాతం సుంకాలను విధింారు. దీనికి ప్రతిగా ఆ దేశం కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 34శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే దీనిపై ట్రపం మండిపడ్డారు చైనా తప్పు చేస్తోందని హెచ్చరించారు. ఏప్రిల్ 8లోగా సుంకాలను తగ్గించకపోతే 50శాతం పెంచుతామని చెప్పారు. అన్నట్టుగానే ఇప్పుడు ఈరోజు చైనాపై ఏకంగా 104 శాతం మేర టారీఫ్ లను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

today-latest-news-in-telugu | usa | china | trump tariffs

Also Read: PBKS VS CSK: పంజాబ్ విజయం..ఇక చెన్నై ఇంటికే..

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు