Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 22 మంది దుర్మరణం
థాయ్లాండ్లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. కదులుతున్న రైలుపై ఓ క్రేన్ జారీ పడటం కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్యాంకాక్కు 230 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.
థాయ్లాండ్లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. కదులుతున్న రైలుపై ఓ క్రేన్ జారీ పడటం కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్యాంకాక్కు 230 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.
కంబోడియా - థాయ్లాండ్ మధ్య జరుగుతున్న సరిహద్దు వివాదం కూల్చివేతల వరకు వెళ్లింది. థాయ్ సైన్యం కంబోడియాలోని ఓ హిందూ దేవుడి విగ్రహాన్ని కూల్చివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అక్కడి ప్రజలు హిందూ, బౌద్ధ దేవుళ్లను పూజిస్తారు. నాగరిక వారసత్వంలో ఇదో భాగంగా ఉంది.
కంబోడియా, థాయ్లాండ్ దేశాల మధ్య సరిహద్దు వివాదాలు గత కొద్దికాలంగా ముదురుతున్నాయి. ఈ క్రమంలో వివాదాస్పద సరిహద్దు ప్రాంతమైన 'అన్ సెస్'లో విష్ణుమూర్తి విగ్రహాన్ని థాయ్ సైనికలు కూల్చివేయడం వివాదాస్పదమైంది.
గోవాలోని నైట్క్లబ్ అగ్నిప్రమాదంలో ప్రధాన నిందితులు గౌరవ్, సౌరభ్ లూత్రా సోదరులను థాయిలాండ్ పోలీసులు భారత్కు అప్పగించారు. థాయిలాండ్లోని ఫుకెట్లో వీరిని ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసు ఆధారంగా అదుపులోకి తీసుకుని, మంగళవారం ఢిల్లీకి తీసుకువచ్చారు.
థాయ్లాండ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కోహ్ కూద్ నుంచి ట్రాట్ ప్రావిన్స్లోని ప్రధాన భూభాగం వైపు ప్రయాణిస్తున్న ఫెర్రీ ప్రమాదంలో చిక్కుకుంది. విషయం తెలిసిన వెంటనే సకాలంలో స్పందించిన అధికార యంత్రాంగం పడవల ద్వారా 100 మందిని సురక్షితంగా రక్షించారు.
థాయ్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వైన్స్ బంద్ చేయాలనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.
ఉద్యోగాల ఆశతో మయన్మార్ చేరుకుని, సైబర్క్రైమ్ స్కామ్ హబ్స్లో చిక్కుకుపోయిన 500 మందికి పైగా భారతీయలు థాయిలాండ్ సరిహద్దులో చిక్కుకుపోయారు. నకిలీ ఉద్యోగ ప్రకటనలకు బలై, సైబర్ క్రైమ్లోకి బలవంతంగా నెట్టబడిన వీరిని కేంద్రం విడిపించడానికి చర్యలు చేపట్టింది.
థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం అందరినీ షాక్కు గురి చేసింది. రద్దీగా ఉండే ఒక రోడ్డు అమాంతం కుంగిపోవడం కలకలం రేపింది. ఓ రహదారిపై బుధవారం ఉన్నట్టుండి భారీ గొయ్యి ఏర్పడింది. 50 మీటర్ల లోతున భారీ గొయ్యి పడింది.