Donald Trump: అవును అతను మోసం చేశాడు...తేల్చిచెప్పిన న్యూయార్క్ జడ్జ్

ట్రంప్ మోసగాడే అంటున్నారు న్యూయార్క్ జడ్జి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతని కుమారులు పదేళ్ళపాటూ తప్పుడు ఆర్ధిక నివేదికలను సమర్పించారని న్యూయార్క్ జడ్జి స్పష్టం చేశారు.

New Update
US Presidential Election: డోనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్...అధ్యక్ష పదవికి అనర్హుడని ప్రకటించిన కోర్టు...!!

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ షాక్ తగిలింది. 2024 అమెరికన్ ఎన్నికల్లో పాల్గొనాలని అనుకుంటున్న అతనికి న్యూయార్క్ కోర్టు (New York Court) ఝలక్ ఇచ్చింది.
ట్రంప్, అతని కుమారులు ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారని తేల్చి చెప్పింది న్యూయార్క్ నాయస్థానం. ట్రంప్ తమ కంపెనీ ఆస్తులను ఎక్కువగా చూపిస్తూ పలు ఒప్పందాలు చేసుకోవడమే కాక అక్రమంగా అప్పులు కూడా తీసుకున్నారని న్యూయార్క్ జడ్జి ఆర్ధర్ ఎంగ్రోన్ (Judge Arthur Engoron) స్పష్టం చేశారు. తన ఆస్తుల విలువను డాక్యుమెంట్లలో భారీగా చూపించి బ్యాంకులు, బీమా సంస్థలను, ఇతరులను ట్రంప్ మోసం చేశారన్నారు.

అమెరికన్ వార్తా కథనాల ప్రకారం ట్రంప్ కు సంబంధించిన కొన్ని కంపెనీల లైసెన్స్ లను రద్దు చేయాలని జడ్జి ఆర్ధర్ ఆదేశించారు. ట్రంప్ కు, ఆయన వారసులకు 250 మిలియన్ డాలర్ల జరిమానా విధించాలని, న్యూయార్క్ లో ట్రంప్ వ్యాపారం చేయకుండా నిషేధించాలని న్యూయార్క్ అటారీ జరనల్ లెటిటియో జేమ్స్ కోరారు. అయితే ట్రంప్...తాను ఎలాంటి ఆర్ధిక నేరాలకు పాల్పడలేదని చెబుతున్నారు. విచారణకు ముందే ట్రంప్ మీద ఉన్న కేసులను కొట్టేయాలని అతని లాయర్లు న్యూయార్క్ జడ్జ్ ను కోరారు. కానీ కేసును విచారించిన జడ్జి ఆర్ధర్ ట్రంప్ మీద వచ్చిన ఆరోపణలు నిజమే అని నిర్ధారించారు.

అయితే అక్టోబర్ 2న నాన్ జ్యూరీ ట్రయల్ ని నిర్వహించి ట్రంప్ కు విధించే శిక్ష మీద నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఒకవేళ ట్రంప్ కు కనుక శిక్ష పడితే 2024 రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధిత్వానికి ఎసరు పడుతుంది. అదే కనుక జరిగితే భారత సంతతి వివేక రామస్వామికి రూట్ క్లియర్ అవుతుంది.

ఇవి కూడా చదవండి:వాళ్ళకు అసలు జీతాలే ఉండవట…లాభాల మీద కమీషన్ మాత్రమే ఇస్తారుట.

నయనానందం…పుట్టినరోజు నాడు పిల్లల ముఖాలు చూపించిన లేడీ సూపర్ స్టార్ 

పవర్ స్టార్ కోసం పవర్ ఫుల్ విలన్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మోదీకి సౌదీ పర్యటనలో ఫైటర్ జెట్ల ఎస్కార్ట్.. 6 విమానాలతో స్వాగతం (VIDEO)

సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీకి రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌‌ గగనతలంలో ఎస్కార్ట్ ఏర్పాటు చేసింది. మోదీ విమానం ఆ దేశంలోకి వెళ్లగానే 6ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌గా వచ్చాయి. 2వ స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ స‌మావేశానికి ఆయన అక్కడికి వెళ్లారు.

New Update
Saudi Arabia visit

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 2 రోజుల పాటు ఆయన సౌదీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌదీ బయల్దేరి వెళ్లారు. ప్రధానికి సౌదీ ప్రభుత్వం ప్రత్యేకంగా స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తోన్న విమానం ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించగానే రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌‌కు చెందిన ఎఫ్‌-15 విమానాలు దానిని ఎస్కార్ట్‌గా వచ్చాయి. మోదీ ప్రయాణిస్తు్న్న విమానానికి ఇరువైపులా మూడేసి చొప్పున 6 జెట్ ఫైటర్లు ఎస్కార్ట్‌గా నిలిచి స్వాగతం పలికాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Also read: New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్

సౌదీకి బ‌య‌లుదేరి వెళ్లడానికి ముందు ప్రధాని ఓ ట్వీట్ చేశారు. ఇటీవ‌ల 2 దేశాల మ‌ధ్య బంధం మ‌రింత దృఢ‌మైంద‌న్నారు. ర‌క్షణ‌, వాణిజ్య, పెట్టుబ‌డి, ఎనర్జీ రంగాల్లో స‌హ‌కారం పెరిగింద‌న్నారు. ప్రాంతీయంగా శాంతి, సామ‌ర‌స్యం, స్థిర‌త్వం పెంచేందుకు ఇండియా, సౌదీ దేశాలు క‌ట్టుబ‌డి ఉన్నట్లు తెలిపారు.

Also read: BIG BREAKING: గుజరాత్‌లో కూప్పకూలిపోయిన విమానం.. భారీ పేలుడు

ప్రధాని హోదాలో మోదీ సౌదీ వెళ్లడం ఇది మూడోసారి అయినా.. జెడ్డాకు వెళ్లడం ఇదే మొద‌టిసారి. రెండ‌వ స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ స‌మావేశంలో ఆయ‌న పాల్గొనున్నారు. ప్రధాని తన పర్యటనలో జెడ్డాలో ఆ దేశంతో 6 ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. సౌదీ ఆరేబియా చ‌క్రవ‌ర్తి మ‌హ‌మ్మద్ బిన్ స‌ల్మాన్ అల్ సౌద్‌తో జ‌రిగే చ‌ర్చల్లో భార‌తీయ యాత్రికుల‌కు చెందిన హ‌జ్ కోటా గురించి మాట్లాడ‌నున్నారు.

(saudi-arabia | modi-visit | Air escort)

Advertisment
Advertisment
Advertisment