Couple Murder: అయోధ్యలో పెళ్లి.. అదే రాత్రి నవ దంపతుల మర్డర్.. అసలేం జరిగిందంటే!

ఉత్తరప్రదేశ్ అయోధ్యలో దారుణం జరిగింది. ఉదయం పెళ్లి చేసుకుని భారీ ఊరేగింపుతో ఇళ్లు చేరిన నవదంపతులు ప్రదీప్, శివాని అదే రాత్రి మరణించడం సంచలనం రేపుతోంది. మొదట ఆమె గొంతుకోసి వరుడు ఉరేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

New Update
up couple

UttarPradesh Ayodhya ew couple Murder

Couple Murder: ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ఓ జంట పెళ్లి ఘనంగా జరిగింది. నవ దంపతులు ఘనంగా ఊరేగింపు జరుపుకుని అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొనగా పూజలు జరుగుతూనే ఉన్నాయి. మరుసటి రోజు రిసెప్షన్ కోసం సన్నాహాలు నడుస్తుండగా ఒకపక్క ఇంట్లో పాటల కార్యక్రమం నడుస్తోంది. మరికొందరు నిద్రపోయారు. అప్పుడే అసలు కథ మొదలైంది. వధూవరులు కాసేపు కునుకు తీసేందుకు గదిలోకి వెళ్లారు. కాసేపటికి బంధువులు వెళ్లి తలుపు కొట్టగా ఎంతకు తీయలేదు. ఫోన్ చేసిన స్పందించలేదు. చాలాసార్లు తలుపు తట్టారు. కానీ ఎలాంటి ఫలితం లేదు. చివరికి గది తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా గుండెపగిలే దృశ్యం కనిపించింది. నవ వధువులు ఇద్దరు విగతజీవులుగా కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ భయంకరమైన ఘటన యూపీలో కలకలం రేపగా వివరాలు ఇలా ఉన్నాయి.

ఒకరు మంచంలో మరొకరు ఫ్యాన్ కు..

ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అయోధ్య నివాసి అయిన ప్రదీప్, శివానికి మార్చి 7న ఉదయం వివాహం జరిగింది. సాయంత్రం వివాహ ఊరేగింపు చాలా కోలాహలంతో షహదత్‌గంజ్ నుంచి డీలిసారియకు చేరుకున్నారు. మార్చి 9 ఆదివారం రిసెప్షన్ ఉంది. అయితే శుక్రవారం రాత్రి దాదాపు 12.30గంటలకు వరుడు ప్రదీప్, వధువు శివాని తమ గదికి వెళ్లారు. తలుపు మూసుకున్నారు.
కాసేపటికి బంధువులు వారిని పిలవగా ఎలాంటి శబ్దం రాకపోవడంతో తలపులు విరగొట్టి చూడగా ఇద్దరు చనిపోయారు. శివాని మంచం మీద చనిపోయి పడి ఉండగా ప్రదీప్ మృతదేహం ఫ్యాన్‌కు కట్టిన ఉచ్చుకు వేలాడుతూ ఉంది. ప్రదీప్ మృతదేహాన్ని వెంటనే కిందకు దించి వధూవరులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇద్దరూ చనిపోయారని వైద్యులు తెలిపారు. దీంతో కన్నీరుమున్నీరైన బంధువులకు మృతదేహాలను అప్పగించామని పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చూడండి: హరిహర వీరమల్లు మరోసారి వాయిదా.. ప్రకటించిన మేకర్స్ !

గొంతు కోయడం వల్లే..

అయితే సంతోషంగా పెళ్లి జరిగిన 24 గంటల్లోనే వధూవరులు మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆశ్చర్యం ఏమిటంటే వివాహ ఊరేగింపు నుంచి వధూవరులు ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. తమ ఫోటోలు తీసుకున్నారు. వరుడు ప్రదీప్ కూడా తన పెళ్లి ఆనందంలో డ్యాన్స్ చేశాడు. అన్యూహ్యంగా చనిపోవడంపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం శివాని గొంతు కోయడం వల్లే మరణించినట్లు నిర్ధారించారు. ఆ తర్వాతే ప్రదీప్ ఉరి వేసుకుని చనిపోయినట్లు గుర్తించారు. గది తలుపు లోపలి నుంచి లాక్ చేసినందున బయటి వ్యక్తి ఎవరూ లోపలికి ప్రవేశించే అవకాశం లేదు. కాబట్టి ప్రదీప్ మొదట శివానీని గొంతు కోసి చంపి, ఆపై ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలిపారు.

ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశి వారు అతిగా మాట్లాడకుండా ఉంటే బెటర్‌!

ఏడాదిగా పరిచయం.. 

ప్రదీప్, శివానీల సంబంధం దాదాపు ఒక సంవత్సరం క్రితం బలపడింది. వారిద్దరూ ఫోన్‌లో కూడా మాట్లాడుకునేవారు. వివాహంలో పాల్గొన్న రెండు కుటుంబాలు చెప్పిన దాని ప్రకారం.. ఇద్దరూ చాలా సంతోషంగానే పెళ్లి చేసుకున్నారు. శివాని తల్లి కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదని చెప్పింది. ప్రస్తుతం పోలీసులు ఇద్దరి మొబైల్స్, కాల్ వివరాలు, చాట్స్ పరిశీలిస్తున్నారు. బంధువులను విచారిస్తూ ఈ హత్యల వెనుక గల కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Nightclub Roof Collapses : కూలిన నైట్ క్లబ్..150 మంది స్పాట్ లోనే...

నార్త్‌ అమెరికా డొమినికన్ రిపబ్లిక్ లోని సంతో డామింగో నగరంలో జెట్ సెట్ నైట్‌ క్లబ్ లో పై కప్పు కూలడంతో సుమారు 18 మంది మరణించారు. 120 మందికి పైగా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

New Update
Dominican Republic Nightclub Roof Collapses At Club

Dominican Republic Nightclub Roof Collapses At Club

Nightclub Roof Collapses : నార్త్‌ అమెరికా డొమినికన్ రిపబ్లిక్ లోని సంతో డామింగో నగరంలో జెట్ సెట్ నైట్‌ క్లబ్ లో పై కప్పు కూలడంతో సుమారు 18 మంది మరణించారు, 120 మందికి పైగా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద మరికొంతమంది ఉండవచ్చని తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 8 న తెల్లవారుజామున 12:45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!


క్లబ్ లో మెరెంగే సింగర్ రూబీపెరెజ్‌ ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రూబీ ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఒక సారిగా భారీ శబ్ధంతో రూప్‌ కూలిపోవడంతో అప్పటివరకు ఆనందంతో కెరింతలు కొడుతున్న వారంతా హాహాకారాలు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. 

Also Read: Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..


ఈ ప్రమాదంలో రూబీ పెరెజ్‌ గాయపడడంతోపాటు ఆయన బృందలోని శాక్సోఫోనిస్ట్ కూడా మరణించినట్లు తెలుస్తోంది. క్లబ్‌లో ప్రమాదం జరిగన సమయంలో  సుమారు 500 నుండి 1000 మంది ఉన్నట్లు తెలుస్తోంది.. శిథిలాల కింద మరికొంతమంది ఉండవచ్చని భావిస్తున్నారు. 400 మంది సహాయక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కాగా  జెట్ సెట్ నైట్‌ క్లబ్ లో ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయని కానీ ఈ రోజు ప్రమాదం జరగడానికి కారణం ఏంటని మాత్రం తెలియరాలేదు. రూప్‌ బలహీనంగా ఉండటం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చన్న వాదన వినపడుతోంది.

Also Read: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

Also Read: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

Advertisment
Advertisment
Advertisment