Blue Ghost : చంద్రుడిపైకి దారులు.. మూన్‌పై సేఫ్‌గా ల్యాండైన ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ ఇదే

అమెరికా టెక్సాస్‌కు చెందిన ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ బ్లూ ఘోస్ట్ అనే లూనార్ ల్యాండర్‌ను ఆదివారం చంద్రుడిపై దించింది. చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ చేసిన తొలి ప్రైవేట్ సంస్థగా ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ నిలిచింది. ఇది నాసా 10 శాస్త్ర, సాంకేతిక పరికరాలు తీసుకెళ్లింది.

New Update
blue ghost

blue ghost Photograph: (blue ghost)

చందమామకు దారులు పడుతున్నాయి. సంవత్సరం కాలంలోనే రెండు ప్రైవేట్ ల్యాండర్ దిగాయి. అమెరికాలోని టెక్సాస్ కు చెందిన ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ చరిత్ర సృష్టించింది. బ్లూ ఘోస్ట్ అనే లూనార్ ల్యాండర్‌ను ఆదివారం జాబిల్లి ఉపరితలంపై విజయవంతంగా దించింది. చంద్రుడిపై కూలిపోకుండా, పడిపోకుండా సరిగ్గా ల్యాండర్ ను దించిన తొలి ప్రైవేట్ సంస్థగా ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ నిలిచింది. ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ అనే ప్రైవేటు అంతరిక్ష పరిశోధనల సంస్థ ప్రయోగించిన మరో ల్యాండర్‌ ఎథెనా గురువారం చంద్రుడిపై ల్యాండ్‌ అవుతుంది. అయితే, అది చంద్రుడి దక్షిణ ధ్రువానికి 100 మైళ్ల పరిధిలో ల్యాండ్‌ కానుంది. ఆ సంస్థ గత ఏడాది ఫిబ్రవరి 22న ఒడిసస్‌ ల్యాండర్‌ను చందమామపై దించి, ఆ ఘనత సాధించిన తొలి ప్రైవేటు అంతరిక్ష పరిశోధనల సంస్థగా చరిత్ర సృష్టించింది. కానీ, ల్యాండింగ్‌ టైంలో టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా కిందపడిపోయింది. 

Also Read: 4వేల ఎకరాల్లో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి - 80కి పైగా భవనాలు దగ్ధం..!

ఈ  బ్లూ ఘోస్ట్‌ ల్యాండర్‌ నాసాకు చెందిన 10 శాస్త్ర, సాంకేతిక పరికరాలతో ఆదివారం చందమామపై అడుగుపెట్టింది. దాదాపు 6.6 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పున ఉండే ఈ ల్యాండర్‌ను జనవరి 15న ఫ్లోరిడాలోని  కేప్‌కెనవరాల్‌ కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. చందమామపై నిర్ణీత ల్యాండింగ్‌ సైట్‌కు 328 అడుగుల పరిధిలోనే ఇది ల్యాండ్‌ అయినట్టు ఫైర్‌ఫ్లై సంస్థ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.

Also Read: రైతులకు రూ.5కే శాశ్వత విద్యుత్‌ కనెక్షన్‌.. సీఎం కీలక ప్రకటన

చంద్రుడిపై దిగిన అరగంటలోనే బ్లూ ఘోస్ట్‌ అక్కడి చిత్రాలు తీసి భూమికి పంపడం ప్రారంభించింది. బ్లూఘోస్ట్‌ ద్వారా చంద్రుడిపైకి 10 పరికరాలను పంపడానికి నాసా 101 మిలియన్‌ డాలర్లు అంటే దాదాపుగా రూ.883.45 కోట్లు, వాటి తయారీకి 44 మిలియన్‌ డాలర్లు (రూ.385 కోట్లు) ఖర్చు చేశారు. ఆ పరికరాలతో చంద్రుడిపై బ్లూ ఘోస్ట్‌ చంద్రుడిపై 15 రోజులుపాటు రీసెర్చ్ చేయనుంది. చంద్రుడిపై మానవ మనుగడకు, అంతరిక్ష యాత్రకు ప్రైవేట్ సంస్థలు పోటీ పడుతున్నాయి.

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Airtel Cheapest Recharge Plan: ఐపీఎల్ ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.451కే మూడు నెలల వ్యాలిడిటీ!

ఐపీఎల్ ప్రియుల కోసం ఎయిర్‌టెల్ డేటా ఓచర్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ.451తో రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. 50GB డేటా పొందొచ్చు. మూడు నెలల జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. క్రికెట్ అభిమానులకు ఇదొక మంచి ప్లాన్ అని చెప్పొచ్చు.

New Update
Airtel new recharge plan offers Rs 10 per day free calls and 2GB daily data

Airtel Cheapest Recharge Plan

ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL ) 2025 అత్యంత రసవత్తరంగా కొనసాగుతోంది. ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోటా పోటీమీద ఆడుతున్నాయి. టైటిల్ సొంతం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లు చూసేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. కానీ గతంలో మాదిరిగా ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగా చూసే వెసులుబాటు లేదు. జియోహాట్ స్టార్ గా ఏర్పడిన తర్వాత డబ్బులు చెల్లించి మ్యాచ్‌లు చూడాల్సి వస్తుంది. 

Also read :  TG 10th Results: తెలంగాణ టెన్త్‌ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్‌.. అది తేలితేనే ఫలితాలు !

దీంతో ప్రముఖ టెలికాం కంపెనీలు తక్కువ ధరలో సబ్ స్కిప్షన్ ప్లాన్‌లను అందించి క్రికెట్ ప్రియులను అట్రాక్ట్ చేస్తున్నాయి. అధిక వాలిడిటీని కూడా అందిస్తున్నాయి. ఇప్పటికే జియో, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి కంపెనీలు తక్కువ ధరలో జియో హాట్ స్టార్ సబ్ స్కిప్షన్ ప్లాన్‌లను ప్రకటించాయి. తాజాగా ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు, క్రికెట్ ప్రియులకు కిక్కిచే ఆఫర్ అందించింది. 

Also read : Zaheer Khan: పెళ్లైన ఎనిమిదేళ్లకు గుడ్ న్యూస్.. తండ్రైన జహీర్ ఖాన్!

కేవలం రూ. 451 రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో JioHotstarకి యాక్సెస్‌ను అందించడమే కాకుండా భారీగా డేటా కూడా వస్తుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే.. ఇది కేవలం డేటా వోచర్ ప్లాన్. ఇందులో ఎలాంటి కాల్స్, మెసేజ్ ప్రయోజనాలు ఉండవు. ఈ వోచర్ పొందాలంటే వినియోగదారులు యాక్టివ్ బేస్ ప్లాన్ కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ ప్లాన్ బెనిఫిట్స్ తెలుసుకుందాం. 

Also read :  Teeth Brush: ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి

రూ.451 రీఛార్జ్ ప్లాన్

ఈ రీఛార్జ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇది వినియోగదారులకు 50GB డేటాను అందిస్తుంది. దీంతోపాటు మూడు నెలల జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగాను ఐపిఎల్ అభిమానులను లక్ష్యంగా చేసుకుని ఎయిర్‌టెల్ తీసుకువచ్చింది. 

కాగా గతంలో కంపెనీ రూ. 100, రూ. 195 ధరలతో మరో రెండు డేటా వోచర్‌లను ప్రారంభించింది. అందులో రూ.100 ప్లాన్ 30 రోజుల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 5GB డేటాను అందిస్తుంది. అలాగే రూ.195 ప్లాన్ 15GB డేటా, మూడు నెలల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. 

ఇక జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు సర్వీస్ వాలిడిటీని కలిపే రీఛార్జ్‌లు కూడా ఉన్నాయి. ఎయిర్‌టెల్ రూ.3999, రూ.549, రూ.1029, రూ.398 ధరలకు అనేక ప్లాన్‌లను అందుబాటులో ఉంచింది.

airtel | airtel-ott-offers | airtel-recharge-plan | airtel-new-recharge-plans | airtel-free-offers | latest-telugu-news | telugu-news | IPL 2025

Advertisment
Advertisment
Advertisment