అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
AP: రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మారిటైమ్ హబ్గా తీర్చిదిద్దాలని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
AP: రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మారిటైమ్ హబ్గా తీర్చిదిద్దాలని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
రఘురామరాజుపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన అదనపు ఎస్పీ విజయ్పాల్కు గుంటూరు కోర్టు14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు కస్టోడియల్ ఇంటరాగేషన్ను కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
గుండెపోటును నిరోధించే కొత్త ఔషధ ఫార్ములాను బాపట్ల ఫార్మసీ కాలేజీ విద్యార్థులు కనుగొన్నారు.ప్రొఫెసర్ సాయి కిషోర్ నేతృత్వంలో పరిశోధక విద్యార్థులు వంశీకృష్ణ, వాణీ ప్రసన్న అభివృద్ది చేశారు. వీరి ఫార్ములాకు పేటెంట్ లభించింది.
ఏపీలో మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్ను రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసింది. ఈ సిలబస్ను ఏపీ డీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
AP: సజ్జల భార్గవ్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. మొత్తం 8 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని భార్గవ్ పిటిషన్లు వేశారు. కాగా బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరిస్తే పోలీసులు భార్గవ్ను అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో మరో ఎన్నికకు నగారా మోగింది. ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల 20న ఈ ఎన్నికకు పోలింగ్ జరగనుంది.
AP: పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే పింఛన్ పంపిణీ చేయనుంది. డిసెంబర్ 1 ఆదివారం కావడంతో నవంబర్ 30వ తేదీన పింఛన్ పంపిణీ చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.
AP: సీఎం చంద్రబాబు టార్గెట్ చేస్తూ వైసీపీ ట్వీట్ చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దమ్ములేక సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది. దమ్ముంటే తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలనిన్ డిమాండ్ చేసింది.
AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. నూతన రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతికి కానుకగా అర్హులకు కొత్త రేషన్ కార్డులను అందించనున్నారు. ఇందుకోసం డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.