AP Election: ఏపీలో మరో ఎన్నికకు మోగిన నగారా!
ఏపీలో మరో ఎన్నికకు నగారా మోగింది. ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల 20న ఈ ఎన్నికకు పోలింగ్ జరగనుంది.
ఏపీలో మరో ఎన్నికకు నగారా మోగింది. ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల 20న ఈ ఎన్నికకు పోలింగ్ జరగనుంది.
AP: పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే పింఛన్ పంపిణీ చేయనుంది. డిసెంబర్ 1 ఆదివారం కావడంతో నవంబర్ 30వ తేదీన పింఛన్ పంపిణీ చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.
AP: సీఎం చంద్రబాబు టార్గెట్ చేస్తూ వైసీపీ ట్వీట్ చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దమ్ములేక సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది. దమ్ముంటే తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలనిన్ డిమాండ్ చేసింది.
AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. నూతన రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతికి కానుకగా అర్హులకు కొత్త రేషన్ కార్డులను అందించనున్నారు. ఇందుకోసం డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
AP: మాజీ సీఎం జగన్కు కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాంలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వ పరిమితం చేయాలనే ప్రతిపాదన, నిర్ణయం కూడా జగన్ ప్రభుత్వంలో తీసుకున్నవేనని కేంద్రం తేల్చిచెప్పింది.
AP: చిన్న పిల్లల చిక్కీల్లో కూడా డబ్బులు మింగేసిన జగన్ సుద్ధపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉందని లోకేష్ మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందన్న జగన్ విమర్శలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP: చంద్రబాబుకు జగన్ ఆరు ప్రశ్నలు వేశారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. హామీలపై అడిగితే వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
ఏపీలో మూడు రోజులు పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీతో పాటు తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది
AP: జగన్కు షాక్ తగిలింది. మరో కీలక నేత వైసీపీకి రాజీనామా చేశారు. కైకలూరుకు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తాజాగా ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. MLC పదవికి చేసిన రాజీనామా లేఖను శాసన మండలి ఛైర్మన్ మోసేనురాజుకు పంపించారు.