గుండెపోటు నిరోధించే ఔషధ ఫార్ములా..పేటెంట్‌ పొందిన బాపట్ల కాలేజీ బృందం

గుండెపోటును నిరోధించే కొత్త ఔషధ ఫార్ములాను బాపట్ల ఫార్మసీ కాలేజీ విద్యార్థులు కనుగొన్నారు.ప్రొఫెసర్‌ సాయి కిషోర్‌ నేతృత్వంలో పరిశోధక విద్యార్థులు వంశీకృష్ణ, వాణీ ప్రసన్న అభివృద్ది చేశారు. వీరి ఫార్ములాకు పేటెంట్‌ లభించింది.

New Update
heart attack  Law student

గుండెపోటును  నిరోధించే కొత్త ఔషధ ఫార్ములాను బాపట్ల ఫార్మసీ కాలేజీ ప్రొఫెసర్‌ సాయి కిషోర్‌ నేతృత్వంలో పరిశోధక విద్యార్థులు వంశీకృష్ణ, వాణీ ప్రసన్న అభివృద్ది చేశారు. వీరి ఫార్ములాకు పేటెంట్‌ లభించింది. గుండెపోటు ఎక్కువగా తెల్లవారుజామున వస్తోంది. దాని కారకాలు తెల్లవారుజామున విడుదల కావడమే అందుకు కారణం. అర్థరాత్రి, తెల్లవారుజామున గుండెపోటు వస్తే ఆ సమయంలో బాధితులు వెంటనే మాత్రలు వేసుకోలేకపోతున్నారు.

Also Read: అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌గా భారతీయుడు..అసలేవరి భట్టాచార్య!

New Drug Formula To Prevent Heart Attack

ఈ ప్రతికూలతలను అధిగమించి కారకాలను నిరోధించేలా ఔషధాలు రూపొందించడం పై ఆచార్యుడు సాయి కిషోర్‌, పరిశోధక విద్యార్థులు వంశీకృష్ణ, వాణీ ప్రసన్న పరిశోధనలు చేశారు. నాలుగున్నరేళ్లకు పైగా శ్రమించి గుండెపోటు కారకాలను నిరోధించే ప్రతి నిరోధకాలను శరీరంలో తగిన సమయంలో విడుదల చేయడం ద్వారా ముప్పులేకుండా చూడొచ్చని తెలుసుకున్నారు.

Also Read: అది ఏఆర్ డెయిరీ నెయ్యి కాదు.. సిట్ విచారణలో సంచలన విషయాలు!

రాత్రి భోజనం తరువాత 9 గంటలకు ఈ క్యాప్సూల్స్‌ వేసుకుంటే అర్థరాత్రి 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రతి నిరోధకాలను విడుదల చేసి గుండె పోటును సమర్థంగా అడ్డుకుంటుందని పరిశోధనల ద్వారా నిరూపించారు.

Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..!

కుందేళ్ల పై రెండు దశల్లో ఈ ఔషధాన్ని పరీక్షించి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి పరిశోధనా గ్రంథం సమర్పించారు. అంతర్జాతీయ రీసెర్చ్‌ జర్నల్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీలో పరిశోధన పత్రం ప్రచురితమైంది.

తమ ఔషధ ఫార్ములా పై పేటెంట్‌ హక్కు కోసం ఈ సంవత్సరం మేలో దరఖాస్తు చేశామని , తాజాగా కేంద్ర పేటెంట్‌ సంస్థ పేటెంట్‌ జారీ చేసిందని ఆచార్యుడు సాయి కిశోర్‌ తెలిపారు. పేటెంట్‌ పొందిన బృందాన్ని బాపట్ల ఎడ్యుకేషన్‌ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు, కార్యదర్శి మానం నాగేశ్వరరావు, కాలేజీ ప్రిన్సిపల్ గోపాల కృష్ణమూర్తి అభినందించారు.

Also Read: UP: పాపం.. పెళ్లికి వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్.. ఐదుగురు వైద్యులు మృతి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Cricket Betting : క్రికెట్‌ బెట్టింగ్‌ భూతానికి మరో విద్యార్థి బలి

బెట్టింగ్ విషయంలో ప్రభుత్వం, పోలీసులు ఎన్ని రకాల కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న యువతలో ఎలాంటి మార్పు రావడం లేదు. బెట్టింగ్ లో లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బుద్వేల్‌ కు చెందిన బీటెక్ విద్యార్థి క్రికెట్‌ బెట్టింగ్‌ భూతానికి బలయ్యాడు.

New Update
Cricket Betting

Cricket Betting

Cricket Betting : బెట్టింగ్ విషయంలో ప్రభుత్వం, పోలీసులు ఎన్ని రకాల కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న యువతలో ఎలాంటి మార్పు రావడం లేదు. బెట్టింగ్ లో లక్షలు పోగొట్టుకుని ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే బుద్వేల్‌లో చోటు చేసుకుంది.

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

క్రికెట్‌ బెట్టింగ్‌ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. డబ్బులు అధికంగా వస్తాయన్న ఆశతో బెట్టింగ్‌లో పాల్గొన్న యువకుడు చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన బుద్వేల్‌లో విషాదాన్ని నెలకొల్పింది. బుద్వేల్‌కు చెందిన పవన్ కుమార్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఐపీఎల్ సీజన్ అంటేనే బెట్టింగ్ రాయుళ్లు పండగ చేసుకుంటారు. ఈ ఒక్క ఐపీఎల్ సీజన్ లోనే బెట్టింగ్ దందాలో కోట్లు చేతులు మారతాయి. ఈ బెట్టింగుల ద్వారా ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు యువకులు డబ్బు పోగోట్టుకొని మనస్థాపంతో ప్రాణాలు తీసుకున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

పవన్ కడా ఇటీవల జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో బెట్టింగ్‌కు లోనయ్యాడు. మొదట్లో స్వల్ప లాభాలు రావడంతో ఆశ పెరిగింది. ఆ తర్వాత పెద్ద మొత్తంలో అంటే సుమారు 80 వేలు బెట్టింగ్ పెట్టాడు. అయితే.. పెట్టిన మొత్తాన్ని నష్టపోయిన పవన్‌ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. పరిస్థితిని తట్టుకోలేక ఇంటి గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని పవన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎదిగిన కొడుకు బెట్టింగ్ భూతానికి బలవ్వడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

Advertisment
Advertisment
Advertisment