TGSRTC: భారీ లాభాల్లో తెలంగాణ ఆర్టీసీ.. రూ.1,008.79 కోట్ల ఆదాయం!

తెలంగాణ ఆర్టీసీ భారీ లాభాల బాట పట్టింది. 'మహాలక్ష్మి' పథకంతో ప్రయాణికుల సగటు 45.49 నుంచి 59.10 లక్షలు పెరిగింది. 2024-25లో రూ.529.20 కోట్ల లాభాలు రాగా.. 2025-26లో రూ.1,008.79 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 

New Update
TSRTC: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో డీఏ ప్రకటించిన ఆర్టీసీ యాజమాన్యం..

తెలంగాణ ఆర్టీసీ భారీ లాభాల బాట పట్టినట్లు అధికారులు చెబుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల్లో ఉన్న రోడ్డు రవాణా సంస్థకు భారీ ఆదాయం చేకూరుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మహాలక్ష్మి' పథకం అమలుతో గత రెండేళ్లుగా మహిళలకు ‘జీరో’ టికెట్లు ఇస్తోంది. 2023 డిసెంబరు 9 నుంచి ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండగా.. వారికి ఛార్జీల మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే గత ప్రభుత్వంలో రోజువారీ ప్రయాణికుల సగటు 45.49 లక్షలు ఉండగా మహాలక్ష్మి పథకంతో 59.10 లక్షలు పెరిగినట్లు వెల్లడించారు. 

Also Read :  నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు : KTR

రూ.1,008.79 కోట్ల లాభాలు..

ఈ మేరకు ఇటీవల ఈ సంఖ్య 13.61 లక్షలు దాటినట్లు తెలిపారు. దీంతో ఆర్టీసీ గత, ప్రస్తుత ఆర్థిక సంవత్సరాల్లో లాభాలబాట పట్టిందని, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.104.11 కోట్లు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. 2024-25లో జనవరి నాటికి రూ.529.20 కోట్ల లాభాలు రాగా.. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.709.29 కోట్లు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. 2025-26లో రూ.1,008.79 కోట్ల లాభాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 

Also read :  తల్లి డైరెక్షన్‌..కొడుకులు యాక్షన్‌.. షేక్​ పేట చోరీ కేసులో బిగ్‌ట్విస్ట్‌

మరోవైపు బడ్జెట్‌లో రవాణాశాఖ పద్దులపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. సంస్థ సాధించిన ఫలితాలను, రానున్న ఆర్థిక సంవత్సరం లక్ష్యాల్ని రవాణాశాఖ వెల్లడించినట్లు తెలిపారు. ఇక 2025 ఫిబ్రవరి 28 నాటికి సంస్థ చెల్లించాల్సిన బకాయిలు రూ.9,897.55 కోట్లు ఉండగా.. ఇందులో బ్యాంకు రుణాలు రూ.2,719.71 కోట్లు ఉన్నాయన్నారు. ఉద్యోగులకు రూ.7,177.84 కోట్లు చెల్లించాల్సినవిగా పేర్కొన్నారు. 
గతంలో మొత్తం ఆర్టీసీకి రూ.10,327.89 కోట్ల నష్టాలు వాటిల్లినట్లు వెల్లడించారు. 

Also read :  గువాహటి ఐఐటీ పరిశోధకుల అద్బుతం.. అంతర్జాతీయ సరిహద్దులపై రోబోల నిఘా !

Also Read :  జైలు భోజనం వద్దు.. డ్రగ్స్ కావాలని సాహిల్ డిమాండ్

latest-telugu-news | today telugu news | mahalaxmi-scheme | tickets | tgsrtc-bus | latest telangana news | telangana-news-updates | telangana news today

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG News: సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్!

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో పర్యటించారు. ఈ మేరకు లబ్ధిదారుడు శ్రీనివాస్ కుటుంబ కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు.

New Update
cm revanth tg

Telangana CM Revanth Reddy lunch in fine rice beneficiary home

TG News: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో పర్యటించారు. ఈ మేరకు లబ్ధిదారుడు శ్రీనివాస్ కుటుంబ కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక ఉదయం భద్రాచలంలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి.. స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. 

10 లక్షల కొత్త రేషన్‌కార్డులు..

ఇక రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మార్చి 30న ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో వీరు పాల్గొన్నారు. అయితే రాష్ట్రంలో ఏప్రిల్‌ నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభవుతుందని సీఎస్‌ శాంతి కుమారి తెలిపారు. అలాగే దాదాపు10 లక్షల కొత్త రేషన్‌కార్డులు జారీ కానున్నాయని పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని తెలిపారు. ధనవంతుల లాగే పేదవారు సన్నబియ్యం తినాలని కోరుతున్నారన్నారు. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

2024లో 1.56 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు. దేశంలో ఎక్కువగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ ఉందని.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత భారీగా వరి ఉత్పత్తి జరగలేదని తెలిపారు. సన్న బియ్యం పండిస్తే బోనస్ కూడా అందిస్తున్నామని స్పష్టం చేశారు.

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

 ration rice | cm revanth | khammam | telugu-news | today telugu today telugu news

 

 

Advertisment
Advertisment
Advertisment