SLBC: SLBC ఘటనపై మోదీతో సీఎం రేవంత్ భేటీ.. రంగంలోకి ఇంటర్నేషనల్ ఎక్స్‌పర్ట్స్!

SLBC ఘటనపై మోదీతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. టన్నెల్ సహాయక చర్యలపై ప్రధానికి వివరించారు. 8 మందిని క్షేమంగా తీసుకొచ్చేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. ఇంటర్నేషనల్ ఎక్స్‌పర్ట్స్‌ను రంగంలోకి దింపనున్నట్లు సమాచారం. 

New Update
slbc cm.pm

SLBC incident CM Revanth Reddy meet Prime Minister Modi

SLBC: SLBC ఘటనపై మోదీతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. టన్నెల్ సహాయక చర్యలపై ప్రధానికి వివరించారు. 8 మందిని క్షేమంగా తీసుకొచ్చేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. ఇంటర్నేషనల్ ఎక్స్‌పర్ట్స్‌ను రంగంలోకి దింపనున్నట్లు సమాచారం.ఇక మోదీతో భేటీ సమయంలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్, డీజీపీ ఉన్నారు. టన్నెల్‌లో ప్రస్తుత పరిస్థితిని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. 

Also Read: USA: తృటిలో తప్పిన పెను ప్రమాదం..ప్రయాణికులను కాపాడిన పైలెట్

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు..

ఈ క్రమంలోనే హైదరాబాద్ ఫేజ్ 2 మెట్రో, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రీజినల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రధానికి వివరించారు. విభజన హామీలు, పెండింగ్ నిధుల విడుదలపై కూడా ప్రధానితో చర్చించినట్లు సమాచారం. 

Also Read: మరోసారి భారీ భూకంపం.. 6.1 తీవ్రత నమోదు- ఎక్కడంటే?

ఇదిలా ఉంటే.. ప్రమాదం జరిగి మూడు రోజులు గడిచినా ఇంకా ఆ 8 మంది ఆచూకీ లంభించలేదు. రెస్య్కూ ఆపరేషన్‎లో పాల్గొన్న   NDRF, NGRF, L&T, ఫైర్, సింగరేణి, హైడ్రా, ఇండియన్​ ఆర్మీ , ఇంజనీరింగ్​ విభాగం, నేవి, మార్కోస్ కమెండోలతో పాటు టన్నెల్​ ఎక్స్‌పర్ట్స్,​ క్రిస్​కూపర్, రాబిన్స్ కంపెనీ, నవయుగ, మెగా కంపెనీల టీంలు సైతం వారిపై ఆశలున్నట్లు చెప్పట్లేదు. అంతేకాదు ఈ ఆపరేషన్ చాలా డేంజర్ గా మారిందని, లోపల పేరుకుపోయిన మట్టిదిబ్బలను తొలగిస్తే మరో 50 మీటర్ల టన్నెల్‌ కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరింస్తున్నారు. దీంతో రెస్య్కూ ఆపరేషన్ చివరి అంకానికి చేరుకుంటుండగా ఆ 8మంది కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి. 

Also Read:  మహా శివరాత్రి నాడు ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే.. పుణ్యమే

15 మీటర్ల వరకు చేరుకున్న బృందాలు..

ఈ మేరకు మంగళవారం అర్థరాత్రి వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగగా ఘటనాస్థలానికి 15 మీటర్ల వరకు చేరుకున్నట్లు సహాయక బృందాలు తెలిపాయి. అయితే బురద, మట్టి పెల్లలతో లోపల భయానక పరిస్థితులున్నట్లు చెబుతున్నాయి. ఘటనా స్థలానికి దరిదాపుల్లోకి వెళ్లినప్పటికీ ఆక్సిజన్ ​అందకపోవడంతో మళ్లీ వెనక్కి వచ్చేశారు. అయితే బుధవారం ఆక్సిజన్ ​సాయంతో ఘటనా స్థలానికి చేరుకుంటామని వెల్లడించారు. మరోవైపు ఊట పెరుగుతున్న కారణంగా సీపేజ్, కూలుతున్న మట్టి పెల్లలతో టన్నెల్‎లో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. సహాయక బృందాలు అత్యంత జాగ్రత్తతో ఆచితూచి అడుగులు వేస్తుండగా.. టన్నెల్​లోంచి గంటకు 5వేల లీటర్ల ఊటనీరు ఉబికివస్తోంది. 100 HP కెపాసిటీ ఉన్న భారీ పంపును ఏర్పాటు చేశారు. అయినప్పటికీ 200 మీటర్ల మేర పేరుకుపోయిన బురద, శిథిలాలు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నట్లు రెస్క్యూ ఆపరేషన్‎లో పాల్గొంటున్న సిబ్బంది తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heatwave Warning : బయటకు వెళ్తున్నారా? జాగ్రత్త...ఈ రోజు మండనున్న ఎండలు..అరెంజ్‌ అలర్ట్‌

ఒకవైపు విపరీతమైన ఎండలు, మరోవైపు వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోవాతావరణం బెంబేలెత్తిస్తుంది. ఉదయమంతా వడగాల్పులతో సతమతమవుతుంటే, సాయంత్రం అయ్యేసరికి వాతావరణం మారి వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో  ఈ రోజు కూడా వడగాలులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

New Update
Heatwave Warning

Heatwave Warning


Heatwave Warning : ఒకవైపు విపరీతమైన ఎండలు, మరోవైపు వర్షాలతో రెండు తెలుగు రాష్ర్టాల్లో వాతావరణం బెంబేలెత్తిస్తుంది. ఉదయమంతా వడగాల్పులతో సతమతమవుతుంటే, సాయంత్రం అయ్యేసరికి వాతావరణం మారి వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో  ఈ రోజు కూడా వడగాలులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది. రెండు రాష్ర్టాల్లోనూ ఈ రోజు  ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాకుండా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయిని అధికారులు పేర్కొన్నారు.

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

శనివారం, ఆదివారం ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని చాలా జిల్లాలలో రాత్రి పూట వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరినగర్, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాగల రెండు రోజులు తెలంగాణలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం గరిష్టంగా ఆదిలాబాద్ లో 44.6, కనిష్టంగా హైదరాబాద్ లో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!


మరోవైపు రాత్రి సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుని సాయంత్రానికి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణ లోని ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ఉరుములు మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Also Read: సరిహద్దుల్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు!

ఇక ఏపీలోను భిన్నమైన వాతావరణ పరిస్థితులకు అవకాశం ఉంది.శనివారం ఏపీలో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శ్రీకాకుళం జిల్లా బూర్జ, హిరమండలం, లక్ష్మీనరసుపేట, పాతపట్నం, విజయనగరం జిల్లా సంతకవిటి, పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి, పాలకొండ మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీయనున్నాయి.. శ్రీకాకుళం-1, విజయనగరం-15, పార్వతీపురంమన్యం-9, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2, తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది.. మరో 28 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం కనిపించనుంది. ఆదివారం నాలుగు మండలాల్లో తీవ్ర, 17 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. వేసవి అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఉరుములతో కూడిన అకాల వర్షాలు పటేడప్పుడు చెట్ల క్రింద నిలబడవద్దని సూచించింది.

Also Read: శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన 80 మంది తెలంగాణ పర్యటకులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు