/rtv/media/media_files/2025/04/13/KEpZV24cs5Ii4vscAC20.jpg)
Srisailam High way
నాగర్ కర్నూల్ జిల్లాలో ఉండే సలేశ్వరం బాగా ఫేమస్. ఇక్కడ శివుడిని దర్శించుకోవడానికి భక్తులు విపరీతంగా వస్తారు. ఏడాది ఒకసారి చేసే జాతరకు విశిష్టత ఉండండతో ఈ సమయంలో భక్తులు పోటెత్తుతారు. ప్రతీ ఏడాది లాగే ఈ ఏడు కూడా సలేశ్వర్ జాతరకు జనాలు వేలల్లో వెళుతున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం ప్రధాన రహదారి రద్దీగా మారింది. మన్ననూర్ చెక్పోస్టు వద్ద సలేశ్వరం వెళ్లే వాహనాలు టోల్ చెల్లించే క్రమంలో ఆలస్యం జరుగుతోంది. దీంతో చెక్పోస్టు నుంచి సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అయితే ట్రాఫిక్ ను వాలంటీర్లు, అటవీశాఖ కంట్రోల్ చేస్తోంది.
Also Read : వక్ఫ్ బిల్లుపై ఓవైసీ సంచలన ప్రెస్ మీట్
Also Read : ఆ స్టార్ హీరో కుమారుడితో అనుపమ డేటింగ్.. నెట్టింట దర్శనమిస్తున్న ఫొటో?
లింగమయ్య స్వామి జాతర..
ప్రతీ యేడూ చైత్ర పోర్ణమి సందర్భంగా సలేశ్వరంలో మూడు రోజుల పాటూ లింగమయ్య స్వామి జాతర జరుగుతుంది. దీనికోసం భక్తులు చాలా దూరం కాలి నడకన వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా కష్టమైన మార్గంలో. అయినా కూడా భక్తులు ఎంతో శ్రద్ధగా, నిష్టగా ఇక్కడకు వెళుతుంటారు. ప్రస్తుతం ఈ ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలానికి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు.
Also Read: Supreme Court: రాష్ట్రపతి బిల్లులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Also Read : బూట్లలో కుప్పలు తెప్పలుగా బంగారం.. మొత్తం ఎన్ని కేజీలంటే?
high-way | srisailam | today-latest-news-in-telugu | today-news-in-telugu | latest-telugu-news | telugu-news | latest telangana news | traffic-jam