SLBC: సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ ఫోన్.. SLBC ఘటనపై ఏం చెప్పారంటే!

నాగర్ కర్నూల్ SLBC ఘటన నేపథ్యంలో సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ ఫోన్ చేసి ఆరాతీశారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ప్రభుత్వం తరఫున అన్ని ప్రయత్నాలు చేయాలని కోరారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. 

New Update
revanth rahul

Rahul Gandhi phone call to CM Revanth for SLBC incident

SLBC: నాగర్ కర్నూల్ SLBC ఘటన నేపథ్యంలో సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ ఫోన్ చేసి ఆరాతీశారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ప్రభుత్వం తరఫున అన్ని ప్రయత్నాలు చేయాలని కోరారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. 

బాధితుల కుటుంబాలకు అండగా.. 

ఈ మేరకు ఆదివారం ఉదయమే ఫోన్ చేసిన రాహుల్ గాంధీ.. SLBC సొరంగం వద్ద జరుగుతున్న సహాయక చర్యల గురించి మాట్లాడారు. దాదాపు 20 నిమిషాల పాటు అన్ని అప్‌డేట్‌లు తెలుసుకున్నారు. దీంతో వార్త అందగానే ప్రభుత్వం ఎంత త్వరగా స్పందించిందో, మంత్రి ఉత్తమ్ రెడ్డిని సంఘటన స్థలానికి తరలించడం, NRDF, SRDF రెస్క్యూ స్క్వాడ్‌లను మోహరించడం గురించి రేవంత్ వివరించారు. గాయపడిన వారికి వైద్య సహాయం అందించడంతోపాటు లోపల చిక్కుకున్న వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీంతో రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలను అభినందించారు. చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేయాలని కోరారు.

ఇది కూడా చదవండి: రాజలింగమూర్తి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ .. ఏడుగురు అరెస్ట్!

 ఇదిలా ఉంటే.. ప్రధానీ మోదీ సైతం శనివారం రేవంత్ కు ఫోన్ చేసి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి తెలిపారు. నాగర్​ కర్నూల్​ జిల్లా(Nagar Kurnool District) దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా ఇందులో ఇరక్కుపోయినా 8మంది కార్మికులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాగం తీవ్రంగా శ్రమిస్తోంది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు కూలింది. పలువురు కార్మికులు బయటకు రాగా.. మరికొందరు టన్నెల్‌లోనే చిక్కుకుపోయారు.

ఇది కూడా చదవండి: Bhupalpally: అయ్యో! పాపం.. పాలు పట్టించిన గంటల్లోనే ఇద్దరు కవలలు మృతి! ఏమైందంటే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: విషాదం.. ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి.. !

హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో మంగళవారం ఆయసంతో ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తికి వైద్యులు ఎక్స్పైరీ అయిన ఇంజక్షన్‌ను ఇచ్చారు. అది వికటించడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతదేహాంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

New Update
Injuction

Expired Injuction

హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇంజక్షన్ వికటించడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇంతకీ అసలేం జరిగిందో తేలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కార్వాన్ బాంజవాడికి చెందిన ఐలయ్య(53) మంగళవారం మధ్యాహ్నం ఆయాసంతో బాధపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని రింగ్‌రోడ్డు సమీపంలో హైకేర్‌ ఆస్పత్రికి తరలించారు. 

Also Read: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!

ఆ తర్వాత వైద్యులు అతడికి పరీక్షలు చేసి ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడి ఆరోగ్యం క్షీణించింది. దీంతో అక్కడున్న వైద్యులు తమ ఆస్పత్రిలో గుండె సంబంధిత వైద్యులు లేరని.. వెంటనే మరో ఆస్పత్రికి తరలించాలని సూచనలు చేశారు. అయితే కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా.. అప్పటికే ఐలయ్య మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు ఇలా ఎలా జరిగిందని వైద్యులను నిలదీశారు. 

Also Read: పశ్చిమ బెంగాల్‌లో హింస వెనుక ముఖ్యమంత్రి కుట్ర : కేంద్ర మంత్రి

చివరికి ఐలయ్యకు ఇచ్చిన ఇంజక్షన్లను పరిశీలించారు. అయితే ఆ ఇంజక్షన్ మార్చి నెలలోనే ఎక్స్పైరీ అయినట్లుగా గుర్తించారు. గడువు ముగిసినప్పటికీ కూడా ఇంజక్షన్ ఇవ్వడం ఏంటని వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇంజక్షన్ ఇవ్వడం వల్లే ఐలయ్య మృతి చెందాడని వాగ్వాదానికి దిగారు. దీంతో మృతదేహంతోనే ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుని విచారణ చేస్తున్నారు. ఇదిలాఉండగా.. గతంలో కూడా ఇలా ఇంజక్షన్‌లు వికటించి రోగులు మృతి చెందిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 

Also Read: సూర్యాపేట జిల్లాలో కూలీల ఆటో బోల్తా.. స్పాట్‌లో పదిమంది!

rtv-news | telangana 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు