/rtv/media/media_files/2025/04/09/0iwcympku57pisv8ti1X.jpg)
mujra party rangareddy
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఏతబర్పల్లి గ్రామ శివారులోని హాలీడే ఫామ్హౌస్లో జరుగుతున్న ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. బర్త్ డే సెలబ్రెషన్స్ పేరుతో కొంతమంది యువకులు ముజ్రా పార్టీ ఏర్పాటు చేసినట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని భగ్నం చేశారు. ఈ పార్టీ కోసం నిర్వాహకుడు ముంబై నుంచి యువతులను రప్పించినట్టుగా పోలీసులు వెల్లడించారు.
మొయినాబాద్ లో ముజ్రా పార్టీ భగ్నం..
— RTV (@RTVnewsnetwork) April 9, 2025
హాలీ డే ఫాంహౌస్ లో ఎస్ఓటీ సోదాలు, అర్థనగ్నంగా నృత్యాలు..
డ్రగ్స్, మద్యం స్వాధీనం చేసుకున్న ఎస్ఓటీ పోలీసులు..
ఏడుగురు అమ్మాయిలు, 12 మంది యువకులు అరెస్ట్..
బర్త్ డే పార్టీ ముసుగులో ముజ్రా పార్టీ.. ముంబై నుంచి అమ్మాయిలను రప్పించిన… pic.twitter.com/9nFsa2IiAQ
Also read : ఒక్క మ్యాచ్ తో హాట్ టాపిక్ గా మారిన ప్రియాంశ్ ఆర్య..ఎవరీ కుర్రాడు?
Also read : తండ్రితో మంచు మనోజ్ లొల్లి.. మోహన్ బాబు ఇంటివద్ద హై టెన్షన్!
ఏడుగురు అమ్మాయిలు, 12మంది అబ్బాయిలు
ఈ ఘటనలో అర్ద నగ్నంగా నృత్యాలు చేస్తున్న ఏడుగురు అమ్మాయిలు, 12మంది అబ్బాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకులు అందరూ పాత బస్తీకి చెందిన వారు కాగా యువతుల్లో ముంబై నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. ముజ్రా పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో ఫామ్హౌస్పై దాడులు చేశామని ఎస్వోటీ పోలీసులు వివరించారు. ఇక ఫామ్ హౌజ్ లో భారీ స్థాయిలో డ్రగ్స్తో పాటు పెద్ద మొత్తంలో మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : ఎంతకు తెగించావమ్మా.. భర్తపై కోపంతో 5 నెలల బిడ్డను నీటిలో ముంచి చంపేసింది!
Also read : Uttar Pradesh : ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!
birthday-celebrations | Mujra party | rangareddy | Moinabad Farm house | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news today | telangana-news-update | breaking news in telugu