Mujra Party : మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ భగ్నం..ఏడుగురు అమ్మాయిలు అరెస్ట్!

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం ఏతబర్‌పల్లి గ్రామ శివారులోని హాలీడే ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలో అర్ద నగ్నంగా నృత్యాలు చేస్తున్న ఏడుగురు అమ్మాయిలు, 12మంది అబ్బాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

New Update
mujra party rangareddy

mujra party rangareddy

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం ఏతబర్‌పల్లి గ్రామ శివారులోని హాలీడే ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. బర్త్ డే సెలబ్రెషన్స్ పేరుతో కొంతమంది యువకులు ముజ్రా పార్టీ ఏర్పాటు చేసినట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని భగ్నం చేశారు. ఈ పార్టీ కోసం నిర్వాహకుడు ముంబై నుంచి యువతులను రప్పించినట్టుగా పోలీసులు వెల్లడించారు.  

Also read :  ఒక్క మ్యాచ్ తో హాట్ టాపిక్ గా మారిన ప్రియాంశ్ ఆర్య..ఎవరీ కుర్రాడు?

Also read :  తండ్రితో మంచు మనోజ్ లొల్లి.. మోహన్ బాబు ఇంటివద్ద హై టెన్షన్!

ఏడుగురు అమ్మాయిలు, 12మంది అబ్బాయిలు 

ఈ ఘటనలో అర్ద నగ్నంగా నృత్యాలు చేస్తున్న ఏడుగురు అమ్మాయిలు, 12మంది అబ్బాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  యువకులు అందరూ పాత బస్తీకి చెందిన వారు కాగా  యువతుల్లో ముంబై నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. ముజ్రా పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో ఫామ్‌హౌస్‌పై దాడులు చేశామని ఎస్‌వోటీ పోలీసులు వివరించారు. ఇక ఫామ్ హౌజ్ లో భారీ స్థాయిలో  డ్రగ్స్‌తో పాటు పెద్ద మొత్తంలో మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

Also Read :  ఎంతకు తెగించావమ్మా.. భర్తపై కోపంతో 5 నెలల బిడ్డను నీటిలో ముంచి చంపేసింది!

Also read :  Uttar Pradesh : ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!

 

birthday-celebrations | Mujra party | rangareddy | Moinabad Farm house | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news today | telangana-news-update | breaking news in telugu

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Asaduddin Owaisi: 'వాళ్లని వదలొద్దు'.. ఉగ్రదాడిపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

పహల్గాం ఉగ్రదాడిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. యూరీ, పుల్వామా కన్నా ఇది తీవ్రంగా ఖండించదగిన దాడి అంటూ వ్యాఖ్యానించారు. దీనికి బాధ్యులైన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

New Update
Asaduddin Owaisi

Asaduddin Owaisi

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో 28 మంది పర్యాటకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. అయితే ఈ ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. యూరీ, పుల్వామా కన్నా ఇది తీవ్రంగా ఖండించదగిన దాడి అంటూ వ్యాఖ్యానించారు. ఈ దాడిలో మరణించినవారి బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. దీనికి బాధ్యులైన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

Also Read: 15 ఏళ్ళు...11 దాడులు..227 మంది మృతి..జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల విధ్వంసం

'' నిన్న పహల్గాంలో జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను కేంద్రం శిక్షిస్తుందని ఆకాంక్షిస్తున్నాం. మృతుల కుటుంబాలకు అండగా నిలబడుతాం. ఈ దాడిలో గాయపడ్డవారు వెంటనే కోలుకోవాలని కోరుతున్నాం. ఈ ఉగ్రదాడి.. యూరీ, పుల్వామా కన్నా తీవ్రంగా ఖండించదగినది. ఈసారి ఉగ్రవాదులు ప్రజలను టార్గెట్‌ చేసి కాల్పులు జరిపారు. ఇదొక నరమేధమని'' అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. 

Also Read: ఉగ్రదాడికి పాల్పడిన దుర్మార్గులు వీరే.. ఫొటోలు విడుదల చేసిన అధికారులు

ఇదిలాఉండగా.. పహల్గాంలోని బైసరన్‌లో జరిగిన ఉగ్రదాడికి 'ది రిసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించిన సంగతి తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం 6 నుంచి 8 మంది ఉగ్రవాదులు సైనిక దూస్తుల్లో వచ్చి పర్యాటకులపై కాల్పులకు పాల్పడ్డారు. వాళ్లు ఏకే 47, ఏకే 56 గన్‌లతో టూరిస్టులను కాల్చేశారు. ఈ భీకర దాడిలో 28 మంది పర్యాటకులు మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మరోవైపు ఈ దాడికి కౌంటర్ అటాక్ ఇచ్చేందుకు బుధవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో సర్జికల్ స్ట్రైట్‌కు ప్లాన్ వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.  

Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. సర్జికల్ ​స్ట్రైక్​కు సిద్ధం !

Also Read:  ప్రధాని టూర్ లో..జేడీ వాన్స్ ఇండియాలో..ముంబై తరహాలో ఉగ్రదాడి..టార్గెట్ ఎవరు?

 telugu-news | rtv-news | asaduddin-owaisi హైదరాబాద్ | తెలంగాణ

Advertisment
Advertisment
Advertisment