Ap-Telangana: నేటి నుంచి తెలంగాణలో మూడు రోజుల పాటు వడగళ్లు,ఉరుములతో వానలు!

చాలా కాలం తర్వాత ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. మార్చి 21 నుంచి 23 వరకూ రెండు రాష్ట్రాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ ఆ చుట్టుపక్కల పరిసరాల్లో నేడు కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

New Update
thunderstrom

thunderstrom

చాలా కాలం తర్వాత ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. అందులోనూ ఎండాకాలం ఎండలు పెరుగుతున్న సమయంలో ఇవి కురవబోతున్నాయి. ఇవి ఒక్క రోజే పడితే, వేడి మరింత పెరిగే ప్రమాదం ఉండేది. అయితే 3 రోజులు కురిసే అవకాశం ఉండటం వల్ల.. మండే ఎండల నుంచి కొంత ఉపశమనం దొరికింది అనుకోవచ్చు. మార్చి 21 నుంచి 23 వరకూ రెండు రాష్ట్రాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. 

Also Read: MF Hussain Painting:వేలంలో రూ.118 కోట్లు పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్.. ఇందులో అంత ప్రత్యేకత ఏంటో తెలుసా?

రైతుల పంటలు...

హైదరాబాద్ ఆ చుట్టుపక్కల పరిసరాల్లో నేడు కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.తెలంగాణకి సంబంధించి వరుసగా 4 రోజులు వర్షాలు కురుస్తాయి అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇవి వానాకాలంలో వర్షాల లాగా కాకుండా.. అక్కడక్కడా కురుస్తాయి. అలాగే కంటిన్యూగానూ పడవు. ఇక్కడో సమస్య ఉంది. నిజానికి ఈ టైంలో వాన పడకూడదు. ఎందుకంటే ఈ సమయంలో వానలు పడితే రైతుల పంటలు దెబ్బతింటాయి. ప్రధానంగా నిర్మల్, నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు పడ్డాయి.ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. భారీ వర్షం కొన్ని ప్రాంతాల్లో నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

Also Read: America-Trump: అమెరికా విద్యాశాఖ మూసివేత..కీలక ఆదేశాలు జారీ చేసిన ట్రంప్‌!

వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఒడిశా నుంచి దక్షిణ ఛత్తీస్ గఢ్ మీదుగా దక్షిణ విదర్భ వరకూ సముద్ర మట్టం నుంచి 0.9కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని, దీని ప్రభావంతో తెలంగాణలో చల్లటి వాతావరణంతో పాటు మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 

నిన్నటి వరకూ 42 డిగ్రీల వరకూ నమోదయిన ఉష్ణోగ్రతలు ఈ మూడు రోజులు 39 డిగ్రీలకు పడిపోయే అవకాశముందని తెలిపింది. పలుచోట్ల వర్షం పడటంతో అనేక మంది హ్యాపీగా ఉన్నారు.

Also Read: Phone Pay-Google Pay: ఫోన్ పే, గూగుల్ పే వాడే వారికి షాక్.. కొత్త రూల్స్!

Also Read: Health: కొబ్బరి నీరు  నిమ్మకాయ నీరు, ఏ సహజ పానీయం ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరం అంటే..!

 

Tags : rains | telangana | weather | ap-weather | AP Weather Alert | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక

రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.

New Update
Rains

Rains

 Rain Alert : ఒకవైపు ఎండలు మండుతుంటే మరోవైపు వరుణుడు కూడా తన సత్తా చాటుతున్నాడు. పొద్దంతా ఎండలు రాత్రి వర్షాలు అన్నట్లు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.

Also read: KTR: HCU భూముల వెనుక భారీ భూకుంభకోణం.. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతా

నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఉందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోఆవరణం వరకు విస్తరించి ఉందని, ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని చెప్పింది. తర్వాత దిశను మార్చుకొని ఉత్తర-ఈశాన్య దిశగా తిరిగి.. రాగల 24గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనంగా పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.


 ఇది కూడా చదవండి: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్

ఈ క్రమంలో మంగళవారం ములుగు, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. బుధవారం భూపాపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో వానలు పడుతాయని చెప్పింది. 11న ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

Also read: Mana Mitra: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్.. అందరి ఫోన్లు తీసుకోనున్న సచివాలయ సిబ్బంది

Advertisment
Advertisment
Advertisment