🔴Live News: సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెండ్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఉత్తరాది రాష్ట్రాల నుంచి పిల్లల్ని తీసుకువచ్చి తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దందాలో విజయవాడకు చెందిన బలగం సరోజిని కీలక నిందితురాలిగా గుర్తించారు. 9 నెలలుగా 26 మంది పసిపిల్లల్ని విక్రయించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో నకిలి దర్శనం టికెట్ల కేసులో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. పాత సర్వదర్శనం టికెట్లను ఎడిట్ చేసి భక్తులకు వేల రూపాయలకు అమ్మిన ఇద్దరు కేటుగాళ్లపై ఆలయ సీఈవో మదుసూదన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆమెకు పెళ్లైంది.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆమె మరోకరిపై మనసు పడింది. అతడే కావాలనుకుంది. కట్టుకున్న భర్త, కన్న ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో పారిపోయింది ఓ వివాహిత. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.
చర్చ్ వేడుకలు ఏర్పాట్లు చేస్తుండగా తమిళనాడు కన్యాకుమారి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎనాయం పుతెంతురై సెయింట్ ఆంటోనీ చర్చి ముందు ఇనుప నిచ్చెన హైటెన్షన్ వైర్లకు తగిలి నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. డెడ్బాడీలను పోస్ట్మార్టానికి హాస్పిటల్కు పంపారు.
హైదరాబాద్ కేపీహెచ్బీ పీఎస్ పరిధిలో పూజశ్రీ అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 6వ ఫేజ్లోని ఎలగెంట్ అభిరుచి అపార్ట్మెంట్లో ప్లాట్ నంబర్ 204లో ఎవరూలేని సమయంలో ఈ దారుణానికి పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
MP గ్వాలియర్లో ఐదేళ్ల బాలికపై మద్యం మత్తులో మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పక్కింటి బాలికని రేప్ చేసి, దారుణంగా గాయపరిచాడు. చిన్నారి హాస్పిటల్లో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. ప్రైవేట్ పార్ట్స్కు 28కుట్లు వేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు.
హైదరాబాద్ లంగర్ హౌస్లోని హుడా పార్క్ చెరువు శుభ్రం చేస్తుండగా తండ్రి, కొడుకు బురదలో ఇరుక్కుపోయి మృతిచెందారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఎమ్మెల్యే కౌసర్ ఆరోపించారు. బాధితుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా వచ్చేలా చేస్తామన్నారు.
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కీసరలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అన్నదమ్ములు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రహీంఖాన్ పేట్కు చెందిన గూడూరు చంద్రశేఖర్, మత్సగిరిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.