PM Modi : వయనాడ్కు వెళ్లనున్న ప్రధాని మోదీ.. ఎప్పుడంటే ?
ప్రధాని మోదీ వయనాడ్ పర్యటన ఖరారైంది. ఆగస్టు 10న కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి బాధితుల్ని పరామర్శించనున్నారు.
ప్రధాని మోదీ వయనాడ్ పర్యటన ఖరారైంది. ఆగస్టు 10న కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి బాధితుల్ని పరామర్శించనున్నారు.
కేరళలో తీవ్రమైన నిపా ఇన్ఫెక్షన్ ముప్పు మరోసారి కలకలం రేపుతుంది. మలప్పురం జిల్లాలో సేకరించిన గబ్బిలాల శాంపిల్స్లో నిపా వైరస్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఇన్ఫెక్షన్ తో 14 ఏళ్ల యువకుడు చనిపోయిన తరువాత మరో యువకుడికి కూడా నిపా సోకినట్లు అధికారులు గుర్తించారు.
కేరళలోని సూజిపూరా వాటర్ఫాల్స్లో విషాదం చోటుచేసుకుంది. అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. కోస్ట్ గార్డ్ సిబ్బంది హెలీకాప్టర్ ద్వారా గాలించారు. చివరికి వారి ఆచూకీ లభ్యమైంది. కోస్ట్ గార్డ్ సిబ్బంది సురక్షితంగా ముగ్గురిని రక్షించారు.
కేరళ కొండచరియలు విరిగి పడి ఇళ్లు కోల్పోయిన వాయనాడ్ బాధితులకు కర్ణాటక ప్రభుత్వం 100 ఇళ్లు కట్టిస్తామని ప్రకటించింది. మరోవైపు పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళం అందించారు.
కేరళ రాష్ట్రం వయనాడ్ విపత్తులో బాధిత కుటుంబాలకు సాయం చేసేందుకు పలువురు సినీ తారలు ముందుకొస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు తమ వంతు సాయంగా రూ.20 లక్షలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా అందించారు.
కేరళలోని వయనాడ్ లో ప్రకృతి బీభత్సానికి 300 మందికి పైగా చనిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ కనుమలను పర్యావరణ సున్నిత ప్రాంతం గా ప్రకటించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
కేరళలోని వాయనాడ్లో జరిగిన విలయంలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికి 300 మంది చనిపోయారు. ఇంకా చాలా మంది గల్లంతయ్యారు. ఆచూకీ దొరకని వారిలో 49 మంది చిన్నారులున్నారని ప్రభుత్వం తెలిపింది.
వయనాడ్లోని చూరాల్మలైలో 1000 మంది అసలు ఎక్కడున్నారో తెలియదని అక్కడున్న రెస్క్యూ సిబ్బంది తెలిపారు. మొత్తం 3000 మందిలో దాదాపు 1000 మంది మాత్రమే తప్పించుకున్నారన్నారు. శిథిలాల కింద ఉన్న శవాలను వెలికితీస్తున్నామని.. డెడ్బాడీలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని అన్నారు.
వయనాడ్ లో కొండచరియలు సృష్టించిన విషాదం ఎన్నో కుటుంబాల్లో అంతులేని ఆవేదన మిగిల్చిన విషయం తెలిసిందే.సుమారు 320 మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు.మృత్యుంజయులను గుర్తించేందుకు డ్రోన్ ఆధారిత రాడార్ ను ఉపయోగించనున్నట్లు అధికారులు ప్రకటించారు.