విడాకుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అందులో భార్యకు హక్కు!

కేరళకు చెందిన దంపతుల విడాకుల కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కేసు ముగిసేవరకూ అత్తగారింటికి సంబంధించిన ఆస్తిలో భార్యకు హక్కు ఉంటుందని తెలిపింది. భర్త పొందే ప్రయోజనాలన్ని ఆమెకు దక్కాల్సిందేనని స్పష్టం చేసింది.

author-image
By srinivas
New Update
ererererer

Kerala : విడాకుల కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దంపతుల మధ్య విడాకుల కేసు ముగిసేవరకూ అత్తగారింటికి సంబంధించిన ఆస్తిలో భార్యకు హక్కు ఉంటుందని, భర్త పొందే ప్రయోజనాలన్ని ఆమెకు దక్కాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేకాదు నెల వారీ ఖర్చులను కూడా చెల్లించాలని సూచించింది. 

Also Read :  చిట్టి రోబో బడా దొంగతనం.. 12 రోబోట్‌లను కిడ్నాప్‌ చేసి..!

నెలకు రూ.2.50 లక్షలను భరణం..

ఈ మేరకు కేరళకు చెందిన ప్రముఖ కార్డియాలాజిస్ట్ విడాకులు కావాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఆ కేసు పెండింగ్‌లో ఉండగానే తనకు నెలకు రూ.2.50 లక్షలను భరణం కింద ఇప్పించాలని అతని భార్య ఫ్యామిలీ కోర్టును అభ్యర్థించారు. దీంతో భరణాన్ని రూ.1.75 లక్షలకు పెంచుతూ జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ పి.బి.వరాలే ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

ఇది కూడా చదవండి: సోషల్ మీడియా యూజర్లకు సీఎం వార్నింగ్.. అలా చేస్తే పీడీ యాక్ట్‌ కేసు!

నెల వారీ భరణాన్ని రూ.80 వేలకు తగ్గిస్తూ మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. భర్త సంపాదన, ఆస్తులను పరిగణనలోకి తీసుకుని నెలకు రూ.1.75లక్షల భరణాన్ని ఇవ్వాలని ఆదేశించింది. దీంతో మద్రాస్‌ హైకోర్టులో అతను మరోసారి సవాల్‌ చేయగా.. భార్యకు చెల్లించాల్సిన భరణాన్ని రూ.80వేలకు తగ్గించింది. చివరకు ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరగా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. 

Also Read :  మల్లారెడ్డి ఆస్పత్రిపై కేసు నమోదు.. వారే చంపేశారంటూ రోగి బంధువులు..!

Also Read :   10,12 పరీక్షల తేదీని ప్రకటించిన సీబీఎస్‌ఈ బోర్డు

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Air India flight: విమానంలో పక్క ప్యాసింజర్‌పై మూత్రం పోసిన వ్యక్తి

ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఓ వ్యక్తి తోటి ప్యాసింజర్ పై మూత్ర విసర్జన చేశాడు. AI 2336 లోని బిజినెస్ క్లాస్‌లో బుధవారం ఈ సంఘటన జరిగింది. జరిగిన దానికి ఆ వ్యక్తి ప్రయాణికుడిని క్షమాపణ కోరారు.

New Update
Air India flight 123

Air India flight 123

ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బిజినెస్ క్లాస్‌లో ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఎయిర్ ఇండియాకు చెందిన AI 2336 లోని బిజినెస్ క్లాస్‌లో బుధవారం ఈ సంఘటన జరిగింది. ప్యాసింజర్ వికృత ప్రవర్తనకు ఫ్లైట్‌లో ప్రయాణికులందరూ అసహించుకున్నారు. అయితే జరిగిన దానికి ఆ వ్యక్తి క్షమాపణలు కోరాడు.

Also read: BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

ప్రయాణీకుడు బిజినెస్ క్లాస్‌లోని 2D సీటులో కూర్చుని సమీపంలో కూర్చున్న ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. బాధిత ప్రయాణీకుడు ఈ సంఘటనకు సంబంధించి ఇంకా ఫిర్యాదు చేయనప్పటికీ, నిందితుడు తన చర్యలకు క్షమాపణలు చెప్పాడు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా సంస్థ అధికారులు తెలిపారు. పక్క వ్యక్తిపై యూరిన్ పోసిన ప్యాసింజర్ పెద్ద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అట. దీనిపై బ్యాంకాన్ వెళ్లాక కంప్లెయింట్ ఇస్తానని బాధిత ప్రయాణికుడు ఫ్లైట్ సిబ్బందికి తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment