Virat Kohli: అదే నా వీక్ నెస్‌ అయ్యింది.. కోహ్లీ బయటపెట్టిన భావాలు!

సిగ్నేచర్ షాట్ కవర్​డ్రైవ్ కోహ్లీకి బలహీనంగా మారిందని పలువురు మాజీలు ఎన్నోసార్లు విమర్శించిన సంగతి తెలిసిందే. అది నిజమే అంటూ కోహ్లీ అంగీకరించాడు. ఇది నాకు సంకటస్థితి. కొన్నేళ్ల నుంచి కవర్‌ డ్రైవ్‌ నా బలహీనతగా మారిందంటూ విరాట్‌ అన్నాడు.

New Update
cric

Virat Kohli

టీమ్ఇండియా (Team India) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పాకిస్థాన్ (Pakistan) ​తో మ్యాచ్​లో సెంచరీతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్​లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే కొంతకాలంగా తన ఫామ్​పై అనేక విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తన సిగ్నేచర్ షాట్ కవర్​డ్రైవ్ కోహ్లీకి బలహీనంగా మారిందని పలువురు మాజీలు అన్న సంగతి తెలిసిందే. 

Also Read: Anand Mahindra: ఒబెసిటీ పై పోరు..ఆనంద్‌ మహీంద్రా నామినేట్‌ చేసింది వీరినే!

నిజానికి ఈ షాట్‌ కోసం ప్రయత్నిస్తూనే విరాట్ కొంతకాలంగా పదే పదే స్లిప్‌లో క్యాచ్‌ ఇస్తూ ఔట్ అయ్యాడు. అయితే దీన్ని విరాట్ అంగీకరించాడు. నిజంగానే కవర్​డ్రైవ్ తనకు బలహీనంగా మారిందని ఒప్పుకున్నాడు.'ఇది నాకు సంకటస్థితి. కొన్నేళ్ల నుంచి కవర్‌ డ్రైవ్‌ నా బలహీనతగా మారింది. కానీ ఆ షాట్‌తో నేను చాలా పరుగులే చేశాను.

Also Read: Horoscope Today:ఈ రోజు ఈ రాశి వారికి అన్ని శుభవార్తలే ..కానీ ..!

తొలి రెండు బౌండరీలు...

ఈ రోజు నేను నా షాట్లను నమ్ముకున్నా. నా తొలి రెండు బౌండరీలు కూడా కవర్‌ డ్రైవ్‌ ద్వారానే  వచ్చాయి. అలాంటి షాట్ల వల్ల బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు కంట్రోల్​తోనే ఉన్నట్లు అనిపిస్తుంది. వ్యక్తిగతంగా నాకు అది మంచి ఇన్నింగ్స్‌. జట్టుకు ఇది మంచి విజయం' అని బీసీసీఐ (BCCI) షేర్ చేసిన వీడియోలో విరాట్ చెప్పుకొచ్చాడు.

రీసెంట్​గా పాక్​తో జరిగిన మ్యాచ్​లో విరాట్ ఆ బలహీనతను దాటేసినట్లు కనపడ్డాడు. అతడు చూడ ముచ్చటైన కవర్‌ డ్రైవ్‌లతో ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్​తో తన ఫామ్​పై ఉన్న అనుమానాలకు గట్టిగా సమాధానం ఇచ్చాడు. కాగా, ఈ మ్యాచ్​లోనే విరాట్ వన్డేల్లో 14000 పరుగులు పూర్తి చేసి రికార్డులు క్రియేట్‌ చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర తర్వాత ఈ మైలురాయి అందుకున్న మూడో బ్యాటర్​గా కోహ్లీ నిలిచాడు. 

Also Read: Tamil Nadu: తమిళనాడులో హిందీ భాష వివాదం.. బోర్డులపై నల్ల రంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు

ఇక మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడం గురించి విరాట్ ప్రస్తావించాడు. వన్​డౌన్​లో బ్యాటింగ్​కు దిగేటప్పుడు జట్టను గెలిపించే స్థితిలో ఉంచడాన్నే ఆలోచిస్తానని అన్నాడు. ఆ స్థానంలో బ్యాటింగ్‌ చేసేటప్పుడు ఎప్పుడూ ఒకే ఆలోచనతో ఉంటా. ముప్పు తప్పించడం, జట్టును గెలిచే స్థితిలో నిలపడంపై దృష్టిపెడతా. కుదిరితే ఛేదన పూర్తి చేస్తా. మ్యాచ్‌ పరిస్థితి ఎలా ఉన్నా, కొన్నేళ్లలో నా పాత్రలో ఎలాంటి మార్పు లేదు' అని విరాట్ వెల్లడించాడు.

Also Read: Maha Shivratri 2025: మహాశివరాత్రి రోజు భార్యకు ఈ బహుమతి ఇస్తే.. మీరు ఊహించనివి జరుగుతాయ్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mohammad Rizwan: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్..ఇవే తగ్గించుకుంటే మంచిది!

రిజ్వాన్ 38 బంతుల్లో 36 పరుగులు చేసి షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో సహనం కోల్పోయిన రిజ్వాన్ డగౌట్‌లోకి తిరిగి వెళ్లే క్రమంలో కోపంతో తన హెల్మెట్‌ను నేలకేసి విసిరాడు. ఇందుకు  సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

author-image
By Krishna
New Update
pak-captain Rizwan

pak-captain Rizwan

Mohammad Rizwan: పాకిస్తాన్ సూపర్ లీగ్(Pakistan Super League) మ్యాచ్‌లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్(Islamabad United) ముల్తాన్ సుల్తాన్స్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యునైటెడ్ కేవలం 17.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.  వికెట్ కీపర్-బ్యాటర్ ఆండ్రీస్ గౌస్ అజేయంగా 80 పరుగులు చేశాడు. 

Also Read: అందుకే గేమ్ ఛేంజర్ డిజాస్టర్ .. అసలు మ్యాటర్ చెప్పిన కార్తిక్ సుబ్బారాజు

సోషల్ మీడియాలో వైరల్

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముల్తాన్ సుల్తాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు గానూ 168 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ , ఉస్మాన్ ఖాన్ రెండో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.  రిజ్వాన్ 38 బంతుల్లో 36 పరుగులు చేసి షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో సహనం కోల్పోయిన రిజ్వాన్ డగౌట్‌లోకి తిరిగి వెళ్లే క్రమంలో కోపంతో తన హెల్మెట్‌ను నేలకేసి విసిరాడు. ఇందుకు  సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉస్మాన్ ఖాన్ దూకుడుగా ఆడి 40 బంతుల్లో 61 పరుగులు చేశాడు. మైఖేల్ బ్రేస్‌వెల్ (9), ఇఫ్తికార్ అహ్మద్ (10), క్రిస్ జోర్డాన్ (6) సహకారంతో జట్టు  168 పరుగులు చేసింది. 

Also Read: Rajamouli: మహేష్ బాబు కోసం RTO ఆఫీస్ కి రాజమౌళి.. వీడియో వైరల్

ఇస్లామాబాద్ యునైటెడ్ బౌలర్లలో మెరెడిత్ (1/33), హోల్డర్ (1/25), షాదాబ్ (1/29) తరఫున రాణించారు. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన  ఇస్లామాబాద్ ఆటగాళ్లలో సాహిబ్‌జాదా ఫర్హాన్ 13 బంతుల్లో 22 పరుగులు చేయగా..  గౌస్ (80), కోలిన్ మున్రో(45), మహ్మద్ నవాజ్ (21) పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.  

Also Read: జీరో లైన్ దాటిన భారత జవాన్.. బంధించిన పాక్ ఆర్మీ!

Also Read: Duvvada Srinivas: థాంక్యూ జగన్.. సస్పెన్షన్ పై దువ్వాడ సంచలన వీడియో!

Advertisment
Advertisment
Advertisment