Jay Shah: జై షాకు బంపర్ ఆఫర్.. WCCలో చోటు!

ఐసీసీ ఛైర్మన్‌ జై షాకు అరుదైన అవకాశం లభించింది. కొత్తగా ఏర్పాటైన వరల్డ్‌ క్రికెట్‌ కనెక్ట్స్‌ (WCC) సలహా మండలిలో చోటు దక్కింది. ఈయనతోపాటు సౌరభ్‌ గంగూలీ, అనురాగ్‌ దహియా, సంజోగ్‌ గుప్తాలకు అవకాశం కల్పించారు. మొదటి సమావేశం జూన్‌ 7, 8న లార్డ్స్‌ లో జరగనుంది.

New Update
Jai Shah: అతి చిన్న వయసులో ఐసీసీ ఛైర్మన్‌గా జై షా.. ఆస్తులెంతో తెలిస్తే షాక్

Jai Shah gets chance on World Cricket Connects advisory board

Jay Shah: ఐసీసీ ఛైర్మన్‌(ICC Chairman) జై షాకు అరుదైన అవకాశం లభించింది. కొత్తగా ఏర్పాటైన వరల్డ్‌ క్రికెట్‌ కనెక్ట్స్‌ (WCC) సలహా మండలిలో చోటు దక్కింది. క్రికెట్ ప్రపంచంలో అవకాశాలు, సవాళ్లపై చర్చించేందుకు మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (MCC) ఇండిపెండెంట్ బోర్డు ఏర్పాటు చేసింది. దీని మొదటి సమావేశం జూన్‌ 7, 8 తేదీల్లో లార్డ్స్‌ వేదికగా జరగనుంది. ఇక ఇందులో ప్రస్తుత కెప్టెన్‌, మాజీ క్రికెటర్లు, పలువురు పాత్రికేయులకు సలహా మండలిలో చోటి కల్పించారు. ఇండియానుంచి సౌరభ్‌ గంగూలీ, ఐసీసీ సీసీఓ అనురాగ్‌ దహియా, జియో స్టార్‌ సీఈఓ సంజోగ్‌ గుప్తాలకు అవకాశం దక్కింది. 

క్రికెట్‌కు చెందిన అన్ని రంగాలు..

ఇక 2024లో క్రికెట్‌కు చెందిన అన్ని రంగాలలోని ప్రభావవంతమైన వ్యక్తులను ఒకచోట చేర్చడంలో అత్యంత ప్రజాదరణ పొందింది ఈ ఫోరమ్. ఇందులో భాగంగానే దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరిగే ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు సమావేశం నిర్వహించనున్నట్లు WCC తెలిపింది. గత జూలైలో జరిగిన మొదటి ఈవెంట్‌లో క్రికెట్‌లోని 120 మంది సమావేశమయ్యారు. వీరిలో ICC అధికారుతోపాటు క్రికెట్ తో పూర్తి అనుబంధమున్న దేశాల నుండి పలువురు వ్యక్తులు, ప్రముఖ ప్రసారకులు, సాంకేతిక నిపుణులు, కోచ్‌లు, మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొన్నట్లు వెల్లడించింది. 

ఇది కూడా చదవండి: America: భారతీయులకు ట్రంప్ బిగ్ షాక్!

క్లబ్ వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇది గేమ్‌లో సమప్యలను చర్చలతో సులభతరం చేస్తుంది. క్రికెట్ భవిష్యత్తు నిర్ధారించే మార్గాలపై ఏకాభిప్రాయాన్ని ఏర్పరచడం దీని లక్ష్యం అని డబ్ల్యూసీసీ పేర్కొంది. ఇదిలా ఉంటే.. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా పేరుగాంచిన జైషా.. గత ఏడాది డిసెంబర్ 1న ICC చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 

ఇది కూడా చదవండి: TDS: టీడీఎస్‌ రద్దుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

Also Read :  భర్తతో విడిపోతున్న మరో హీరోయిన్.. ఫొటోలు డిలీట్!

Also Read : నాలుగో రోజు కంటిన్యూ .. దిల్ రాజు ఇళ్లల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sourav Ganguly : పాకిస్తాన్‌తో సంబంధాలను తెంచుకోవాలి..  సౌరవ్ గంగూలీ సంచలన కామెంట్స్!

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పాకిస్తాన్‌తో సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని అన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉండటం తమాషా కాదన్న గంగూలీ..  ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించకూడదన్నారు.

New Update
sourav pak

sourav pak

పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మృతి చెందారు, దీనితో పొరుగు దేశమైన పాక్ పై ప్రతి ఒక్క భారతీయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పాకిస్తాన్‌తో సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని అన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉండటం తమాషా కాదన్న గంగూలీ..  ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించకూడదన్నారు. అంతేకాకుండా పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలని అది జరిగి తీరాలని గంగూలీ డిమాండ్ చేశాడు. ఐసీసీ, ఆసియా కప్ టోర్నమెంట్లలో కూడా ఆడకూడదని అన్నారు.

డానిష్ కనేరియా మినహా

అంతకుముందు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సైతం ఉగ్రదాడిని ఖండించారు. రెండు దేశాల మధ్య సంబంధాలపై భారత ప్రభుత్వ వైఖరి కారణంగా భారతదేశం పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లలో పాల్గొనదని శుక్లా అన్నారు. కాగా ఉగ్రదాడిపై ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రముఖుల నుంచి  స్పందనలు వస్తుంటే..  మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా మినహా పాకిస్థాన్‌ క్రికెటర్లు ఎవరూ స్పందించలేదు.  

Also read :  Seema Haider : నేను ఇండియాలోనే ఉంటా.. నన్ను పంపొద్దు.. మోదీకి సీమా రిక్వెస్ట్!

కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉగ్రవాదులు దాడితో సంబంధం ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ప్రధాని బలమైన సందేశాన్ని ఇచ్చారు, మరణించిన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు.

Also read : TG Crime: ఏం మనిషివిరా.. కడుపుతో ఉన్న భార్యకు కూల్‌డ్రింక్‌లో పురుగులమందు కలిపి

Advertisment
Advertisment
Advertisment