IPL 2025: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. RCB Vs KKR తొలి మ్యాచ్ రద్దు!?

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2025 ఆరంభంకానుంది. మార్చి 22న ఈడెన్‌గార్డెన్స్‌లో KKR Vs RCB మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రానున్న రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మ్యాచ్ రద్దు అయ్యే ఛాన్స్ ఉంది.

New Update
ipl 2025 kolkata

IPL 2025 KKR vs RCB first match rain effect

IPL 2025: మరో కొన్ని గంటల్లో ఐపీఎల్ 2025 మెగా టోర్నీ ఆరంభంకానుంది.  మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌ రైడర్స్,  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య తొలిమ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ కోసం ఆతృతగా  ఎదురుచూస్తున్న అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లే ఛాన్స్ ఉంది. రానున్న ఈ రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 

మార్చి 20-, 22 మధ్య కురిసే అవకాశం..

ఈ మేరకు పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌, నాడియా, బిర్భూమ్, తూర్పు బర్ధమాన్‌ జిల్లాలతోపాటు ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో గంటకు 40-, 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షాలు మార్చి 20-, 22 మధ్య కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో అభిమానుల్లో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ మొదలైంది.ఇక ఆరంభ వేడుకల కోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేయగా.. బాలీవుడ్ నటి దిశా పటాని, సింగర్ శ్రేయా ఘోషల్‌ అభిమానులను అలరించనున్నారు. 

Also Read: మరో డిజిటల్‌ అరెస్టు .. రూ.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

సంజూ దూరం.. 

ఇదిలా ఉంటే..  రాజస్థాన్‌ కు తొలి మూడు మ్యాచ్‌ల్లో రియాన్‌ పరాగ్‌ సారథిగా వ్యవహరించనున్నాడు. వేలి గాయం కారణంగా రెగ్యులర్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌ కేవలం బ్యాటింగ్ మాత్రమే ఆడతాడని,  పూర్తిగా కోలుకున్నాకే వికెట్‌ కీపింగ్‌ చేస్తాడని మేనేజ్ మెంట్ తెలిపింది. దీంతో ధ్రువ్‌ జురెల్‌ వికెట్‌ కీపింగ్‌ చేసే అవకాశం ఉండగా.. నాలుగు మ్యాచ్‌ల తర్వాత సంజూ పూర్తి గేమ్ లోకి దిగుతాడని రాజస్థాన్‌ రాయల్స్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. 

Also Read: అమెరికా విద్యాశాఖ మూసివేత..కీలక ఆదేశాలు జారీ చేసిన ట్రంప్‌!

ipl-2025 | kolkata | rain | telugu-news | today telugu news | rtv telugu news | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

దవడ పగిలిపోవడంతో.. మైదానంలోనే కుప్పకూలిన క్రికెటర్

న్యూజిలాండ్‌ పాకిస్థాన్ చివరి వన్డే సిరీస్‌లో పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ రిటైర్డ్ హ‌ర్ట్‌ అయ్యాడు. న్యూజిలాండ్ ఫీల్డర్ విసిరిన త్రో కారణంగా ఇమామ్ దవడకి గాయం కావడంతో నొప్పితో మైదానంలోనే కుప్పకూలాడు. వెంటనే వైద్య బృందం మైదానంలోకి చేరుకుని చికిత్స చేసింది.

New Update
Imam-ul-Haq

Imam-ul-Haq Photograph: (Imam-ul-Haq )

న్యూజిలాండ్‌-పాకిస్థాన్ మధ్య వన్డే సిరీస్‌ జరుగుతోంది. ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్‌ జరగ్గా.. పాకిస్థాన్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ ఇమామ్ ఉల్ హక్ రిటైర్డ్ హ‌ర్ట్‌ అయ్యాడు. మ్యాచ్ జరుగుతున్న టైంలో అతని తలకు బంతి తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. న్యూజిలాండ్ ఫీల్డర్ విసిరిన త్రో కారణంగా ఇమామ్ దవడకి గాయం కావడంతో నొప్పితో మైదానంలోనే కుప్పకూలాడు. కనీసం నడవలేకపోయే సరికి మైదానంలోకే వైద్య బృందం చేరుకుంది. అయితే వర్షం కారణంగా ఆట మధ్యలో ఆగిపోయి.. మళ్లీ స్టార్ట్ అయ్యింది. మ్యాచ్ జరుగుతుంటే మూడో ఓవర్‌లో ఈ సంఘటన జరిగింది.

ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ఇది కూడా చూడండి: Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

ఇది కూడా చూడండి: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

ఇది కూడా చూడండి: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

Advertisment
Advertisment
Advertisment