Vande Bharat Express: వందే భారత్‌లో ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్.. రైల్వేబోర్టు కీలక నిర్ణయం

వందే భారత్ రైళ్లలో ప్రయాణించేవారి కోసం భారతీయ రైల్వే కొత్త సదుపాయన్ని తీసుకొచ్చింది. అందులో ప్రయాణించే ఏ ప్రయాణికుడైనా టికెట్ బుకింగ్ చేసుకునేటప్పుడు ఫుడ్ ఆప్షన్ ఎంచుకోకపోయినా.. ప్రయాణం చేసేటప్పుడు వాటిని కొనుగోలు చేసేలా అవకాశం కల్పించింది.

New Update
vande bharat express

vande bharat express

వందే భారత్ రైళ్ల (Vande Bharat Express) లో ప్రయాణించేవారి కోసం భారతీయ రైల్వే (Indian Railways) కొత్త సదుపాయన్ని తీసుకొచ్చింది. ఇకనుంచి అందులో ప్రయాణించే ఏ ప్రయాణికుడైనా టికెట్ బుకింగ్ చేసుకునేటప్పుడు ఫుడ్ ఆప్షన్ ఎంచుకోకపోయినా.. ప్రయాణం చేసేటప్పుడు వాటిని కొనుగోలు చేసేలా అవకాశం కల్పించింది. ఆహారం అందుబాటులో ఉన్నదాన్ని బట్టి సిబ్బంది ఆహారం అందిస్తారని రైల్వే బోర్డు శుక్రవారం ప్రకటన చేసింది. దీనికి సంబంధించి ఐఆర్‌సీటీసీకి లేఖ రాసింది.  

Also Read: పాక్‌ ముష్కరుల చొరబాటు భగ్నం.. ఏడుగురిని మట్టుబెట్టిన భారత సైన్యం

Vande Bharat Express - Buy Food Onboard

అయితే వందేభారత్ ట్రైన్‌లో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మీల్స్ అనేది ఆప్షనల్‌గా చూపిస్తుంది. కొందరు వేరే ఆహారాన్ని చూసుకోవచ్చనే ఉద్దేశంతో ఫుడ్ ఆప్షన్‌ను స్కిప్ చేస్తుంటారు. అయితే ఒక్కోసారి ఇలా చేసుకోకపోవడం వల్ల రైళ్లో డబ్బులు ఇచ్చి కొందామన్నా కూడా ఆహారం ఇచ్చేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. డబ్బులు ఇస్తామన్నా కూడా ఇవ్వడం లేదు. దీంతో ఐర్‌సీటీసీ (IRCTC) కి దీనిపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. 

Also Read: కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన పాకిస్థాన్ హిందువులు

ఈ నేపథ్యంలోనే తాజాగా రైల్వేబోర్డు కొత్త సదుపాయాన్ని కల్పించింది. అంతేకాదు రైళ్లలో ప్రయాణికులకు అందించే ఆహారం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా ఐఆర్‌సీటీసీకి సూచనలు చేసిది. అలాగే ప్రయాణికులకు అసౌకర్యం ఉండకుండా రాత్రి 9 తర్వాత ట్రాలీల రూపంలో విక్రయాలు చేయకూడదని చెప్పింది. తాజాగా రైల్వేబోర్డు తీసుకున్న ఈ నిర్ణయాన్ని రైల్వే ప్రయాణికులు స్వాగతిస్తున్నారు. 

Also Read: అమెరికా ఐరన్ డోమ్ సిస్టమ్‌ అభివృద్ధిలో మేమూ భాగస్వాములవుతాం: కెనడా

Also Read: మనుషులా మానవ మృగాలా.. రన్నింగ్ ట్రైన్లో 4 నెలల గర్భిణిని ఇద్దరు కీచకులు.. ఛీ ఛీ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భారీ వర్షం.. పిడుగులు పడి 13 మంది మృతి

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మృతుల కుటుంబాలకు సీఎం నితిశ్ కుమార్ రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.

New Update
13 killed in lightning strikes in four districts of Bihar

13 killed in lightning strikes in four districts of Bihar

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. దర్‌బంగా, బెగూసరాయ్ జిల్లాల్లో తొమ్మిది మంది పిడుగుపాటుకు గురై మృతి చెందారు. మధుబనీ జిల్లాలో ముగ్గురు చనిపోయారు. వీళ్లలో ఇద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందిన తండ్రి, కూతురు. ఇక సమస్తిపుర్‌లో ఒక వ్యక్తి పిడుగుపాటు వల్ల మృతి చెందాడు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.    

Also Read: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి

ఈ ఘటనపై సీఎం నితీశ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. విపత్తు నిర్వహణ అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే బిహార్ ఆర్థిక సర్వే ప్రకారం చూసుకుంటే 2023లో పిడుగుపాటు వల్ల 275 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 Also read: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్‌..

ఇదిలాఉండగా భారత వాతావరణ శాఖ (IMD) కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 9 నుంచి 12వ తేదీ దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలుల విస్తాయని.. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవించే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.  

Also read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య

 

 

Advertisment
Advertisment
Advertisment