DMK Vs BJP: ముదురుతున్న భాషా వివాదం.. రంగంలోకి సుందర్ పిచాయ్‌!

హిందీ భాషపై డీఎంకే, బీజేపీ మధ్య వివాదం ముదురుతోంది. తమిళనాడులో హిందీ అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఎలా చేస్తారో చూస్తామంటూ సీఎం స్టాలిన్ సవాల్ విసురుతున్నారు. దీంతో హిందీ ఎందుకు కావాలో తెలుపే సుందర్ పిచాయ్‌ మాట్లాడిన వీడియోను అన్నామలై పోస్ట్ చేశారు.

New Update
PM Modi and CM Stalin

PM Modi and Tamil nadu CM Stalin

DMK Vs BJP: దేశంలో భాషా వివాదం రాజకీయ రంగు పులుముకుంది. తమిళనాడులో ఎలాగైనా హిందీ అమలు జరగాల్సిందేనని కేంద్రం భావిస్తోంది. అయితే అందుకు అవకాశం లేదని, హిందీ భాషను అమలు చేసేదేలేదంటూ తమిళనాడు డీఎంకే సర్కార్ కరాకండిగా చెబుతోంది. దీంతో ఎటూ తేల్చుకోలేని అన్నాడీఎంకే సైతం కేంద్రం పెత్తనం ఏమిటనే వాయిస్ వినిపిస్తోంది. అయితే త్రి భాషా వివాదం రగులుతున్న సమయంలో అనూహ్యంగా గుగూల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ను ఇందులోకి లాగారు. భాషల రాజకీయ యుద్ధంలోకి పిచాయ్‌ను ఎందుకు తీసుకొచ్చారనేది ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది.

1968 నుంచి వివాదం మొదలు..

ఈ మేరకు కేంద్రంపై పోరాటానికి తమిళ పార్టీలు ఎల్లప్పుడు ముందే ఉంటాయి. ముఖ్యంగా భాష విషయంలో అసలే వెనకడుగు వేయకపోగా.. హిందీ భాషను 1968 తమిళనాడులో ప్రవేశ పెట్టాలనుకుంటే అప్పుడు ఓ యుద్ధమే జరిగింది. తాజాగా కేంద్రం త్రి భాషా విధానాన్ని వ్యతిరేస్తూ తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా సమానికి సై అంటున్నారు. కానీ తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై మాత్రం.. హిందీ ఎందుకు కావాలో తెలుపుతూ సుందర్ పిచాయ్‌కి చెందిన ఓ వీడియోను నెట్టింట పోస్ట్ చేశారు. పాఠశాలలో తాను హిందీని ఎలా నేర్చుకున్నానో అందులో ఆయన చెప్పుకొచ్చారు. తన ఎదుగుదలకు హిందీ కూడా ఓ కారణమని ఆ వీడియోలో చెప్పకనే చెప్పారు. టెక్ దిగ్గజం మూడు భాషలు నేర్చుకోగలిగితే, అదే అవకాశం రాష్ట్రంలోని అన్ని విద్యార్థులకు అందుబాటులో ఉండాలని అన్నామలై అన్నారు. మంత్రుల పిల్లలు, మనవరాళ్ళు పాఠశాలల్లో మూడు భాషలు నేర్చుకోవడానికి అనుమతిస్తూ.. ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులు మాత్రం రెండు భాషలు మాత్రమే నేర్చుకోవాలని బలవంతం చేయడం దారుణమని అన్నామలై ఆరోపించారు.

Also read: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్..నిందితులు అరెస్టు!

అన్నాడీఎంకే మద్ధతు..

అయితే ఇది డీఎంకే, బీజేపీ మధ్య యుద్ధమే అయినా.. తమిళ సెంటిమెంట్ అంశంగా ఈ వివాదం రగులుతోంది. ఈ వివాదంలో సైలెంట్ గా ఉంటే తమకు నష్టం జరగడంతో పాటు డీఎంకేకు ప్లస్ గా మారుతుంది అనే కారణంతో తమిళనాడులోని మిగిలిన ద్రవిడ పార్టీలన్నీ డీఎంకేకు మద్దతుగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల పార్టీని స్థాపించి డీఎంకేను పదేపదే వ్యతిరేకిస్తున్న నటుడు విజయ్ పార్టీ సహా.. తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం డిఎంకే చిరకాల ప్రత్యర్థి అయిన అన్నాడీఎంకే కూడా డీఎంకే వాదనను బలపరుస్తోంది. తమిళులపై ఉచిత వ్యాఖ్యలు చేశారంటూ పార్లమెంటులో మోషన్ కూడా డీఎంకే దాఖలు చేయడంతో తమిళనాడు మొత్తం ఇపుడు ఇదే అంశంపై బీజేపీకి వ్యతిరేకంగా కౌంటర్ ఇస్తుంది. బీజేపీ మాత్రం ఇప్పటికి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయకపోవడంతో ఈ వివాదం ఎక్కడదాకా వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది. 

Also read: Jana Sena: జనసేనతో పవనన్న ప్రయాణం ఇదే.. ఒక్కడిగా మొదలై

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tahawwur Rana: భారత్ కు తహవూర్ రాణా అప్పగింత..స్పెషల్ ఫ్లైట్ లో..

ముంబయ్ పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణా చిట్టచివరి పిటిషన్ కూడా తిరస్కరణ గురైంది. దీంతో అక్కడి అధికారులు అతనిని భారత్ కు అప్పగించారు. ఒక ప్రత్యేక విమానంలో రాణాను తీసుకుని భారతీయ అధికారుల బృందం ఇండియాకు పయనమైంది. 

New Update
Tahawwur Rana

Tahawwur Rana Photograph: (Tahawwur Rana)

తనను భారత్ కు అప్పగించొద్దు మొర్రో అంటూ మొత్తుకున్నాడు. భారత్ కు తనను పంపిస్తే చిత్ర హింసలకు గురి చేస్తారని ఏడ్చాడు. కానీ అమెరికాలో సుప్రీంకోర్టుతో సహా ఏ న్యాయస్థానం అతని మాటను వినలేదు. చిట్టచివరి పిటిషన్ కూడా నిన్న తిరస్కరణకు గురైంది. దీంతో అక్కడి అధికారులు రాణాను భారతీయ అధికారులకు అప్పగించారు. చట్టపరమైన లాంఛనాలన్నింటినీ పూర్తి చేసుకుని తహవూర్ ను కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు అతనిని తీసుకుని అధికారుల బృందం ప్రత్యేక విమానంలో ఇండియాకు తిరుగుపయనమైందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పలు ఇంగ్లీష్ న్యూస్ లలో కథనాలు వచ్చాయి. ఈ రాత్రికి లేదా రేపు తెల్లవారు ఝాముకు వారు ఇండియా చేరుకోనున్నారు. 

ఎప్పటి నుంచో పోరాడుతున్న భారత్..

తహవూర్‌ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి. ఇతన్ని అప్పగించాలని భారత్ చాలాకాలంగా పోరాడుతోంది. అయితే దీన్ని తహవూర్ రాణా చాలా సార్లు ప్రయత్నించాడు. అక్కడి ఫెడరల్ కోర్టుల్లో చాలా సార్లు పిటిషన్ వేశాడు. ఆ కోర్టులన్నీ అతని అభ్యర్థనను తిరస్కరించాయి.  శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూఎస్‌ కోర్టు ఆఫ్‌ అప్పీల్‌లోనూ చుక్కెదురైంది. దీంతో చివరిసారి గా  గతేడాది నవంబరు 13వ తేదీన అమెరికా సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశాడు తహవూర్ రాణా. అయితే ఈ పిటిషన్ ను కట్టేయాలని కోర్టును అమెరికా ప్రభుత్వం కోరింది. దీనికి సంబంధించి 20 పేజీల అఫిడవిట్ ను దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు అమెరికా ప్రభుత్వం అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంది. రాణా పిటిషన్ ను కొట్టేసింది. తాజాగా నిన్న మరో న్యాయస్థానం కూడా అతని పిటిషన్ ను తిరస్కరించింది. వీటన్నిటితో పాటూ రాణా అప్పగింతపై అధ్యక్షుడు ట్రంప్ సైతం ప్రకటన చేశారు. ప్రధాని మోదీ పర్యటనకు వెళ్ళినప్పుడు 26/11 ముంబయి ఉగ్ర దాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్‌ కు అప్పగిస్తామని మాటిచ్చారు. 

 today-latest-news-in-telugu | Tahawwur Rana | india

Also Read: USA-China: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

Advertisment
Advertisment
Advertisment