Maoist: దండకారణ్యంలోకి RTV బృందం.. గ్రౌండ్ రిపోర్ట్ వీడియో!

దండకారణ్యంలో భద్రతా బలగాలు నిర్వహిస్తున్న సర్జికల్ స్ట్రైక్‌ను RTV ప్రాణాలకు తెగించి రికార్డ్ చేసింది. యుద్ధభూమిలో ఏం జరుగుతుందో ప్రజలకు చూపించేందుకు ప్రాణాలను లెక్కచేయలేదు. సైనిక శిబిరాలను దాటి మావోయిస్టుల అడ్డా బస్తర్ నుంచి డేరింగ్ రిపోర్టింగ్ చేసింది. 

New Update
RTV ground report in Dandakaranyam

RTV ground report from Dandakaranyam

Maoist: ఛత్తీస్‌ఘడ్ దండకారణ్యంలో భద్రతా బలగాలు సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తున్నాయి. బస్తర్ రేంజ్ అటవి పరిధిలోని బీజాపూర్, కరవగుట్ట ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. దీంతో తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్, ఓరిస్తా, ఆంధ్రప్రదేశ్ బార్డర్ పాంత్రాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే 2వేల కేంద్ర బలగాలు తెలంగాణ ములుగు, భద్రాద్రికొత్తగూడెం తదితర ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. మరోవైపు దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ పేరుతో మిలటరీ బలగాలు వరుస ఎన్ కౌంటర్లు జరుపుతున్నాయి. ఇందులో భాగంగానే యుద్ధభూమిలో ఏం జరుగుతుందో ప్రజలక కళ్లకు కట్టినట్లు చూపించేందుకు RTV ప్రాణాలకు తెగించి సాహసం చేస్తోంది. బస్తర్ నుంచి డేరింగ్ రిపోర్టింగ్ చేస్తూ ఎప్పటికప్పుడూ తాజా సమాచారం అందిస్తోంది. 

దండకారణ్యంలోకి ఆర్టీవీ బృందం..

అటు పోలీసులు, ఇటు మావోయిస్టుల నిర్భందాన్ని అధిగమించి దండకారణ్యంలోకి ఆర్టీవీ బృందం ప్రవేశించింది. దండకారణ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని తాజా పరిస్థితిని బాహ్య ప్రపంచానికి అందించేందుకు ఎవరూ చేయని సాహసం చేసింది. తెలంగాణ సరిహద్దు దాటి అక్కడినుంచి ద్విచక్రవాహనాలపై మైళ్ల దూరం పర్యటించిన ఆర్టీవీ బృందం.. సైనిక శిబిరాలను దాటుకుని మావోయిస్టు అతి తీవ్ర ప్రభావిత ప్రాంతాలను నిశితంగా గమనించింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మడ్వి హిడ్మా కోసం భద్రతాబలగాలు నూతనంగా ఏర్పాటుచేసిన సైనిక శిబిరాలను సందర్శించింది. ఆకాశంలో డ్రోన్లతో రహదారులపై రోడ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అడవులను జల్లెడపడుతున్న వేలాది మంది పారామిలిటరీ బలగాలతో భద్రతా బలగాలు పహారా కాస్తుండటం స్పష్టంగా గమనించి వీడియోలు తీసింది.

ఇది కూడా చదవండి: Imran Khan: చనిపోయే వరకు ఇక్కడే ఉంటా.. ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన ప్రకటన

అంతేకాదు వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేసేందుకు బహుముఖ వ్యూహంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమంపై ఆరా తీసింది. మావోయిస్టులు, భద్రతా బలగాల కాల్పుల్లో వినియోగించిన రాకెట్ లాంఛర్ లను భద్రతాబలగాలు వినియోగిస్తున్న ఆయుధ సామాగ్రిని జనాలకు కళ్లకు కట్టినట్లుగా చూపించింది. 

ఇది కూడా చదవండి: HYDRA: ప్రతి సోమవారం హైడ్రా ప్రజావాణి.. ఈ నంబర్లకు కాల్ చేయండి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

భారత ఆయుధాల లిస్ట్ లో మరో కొత్త అస్త్రం చేరనుంది. లేజర్ ఆధారిత వెపన్ ను డీఆర్డీవో మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. గాల్లో ఎగురుతున్న యూవీఏ, డ్రోన్లను ఇది పడగొట్టగలదు. 

New Update
india

Laser Weapon

భారత దేశానికి చెందిన డీఆర్డీవో మరో కొత్త ప్రయోగం చేసింది. భారతదేశానికి కొత్త అస్త్రాన్ని అందించింది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో మొదటిసారి పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్‌లో భాగంగా గాల్లో ఎగురుతున్న యూఏవీ, డ్రోన్లను నేలకూల్చడంలో సఫలమైంది. దీనికి సంబంధించిన  వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఒక వాహనంలో ఈ లేజర్ ఎనర్జీని వెపన్ ను అమర్చారు. దీనికి ఎంకే 2(ఏ) ల్యాండ్ వెర్షన్ అని పేరు పెట్టారు. ఇది యూఏవీ, డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతో పాటు నిఘా సెన్సార్‌లను పనిచేయకుండా చేసింది. దీనిద్వారా.. లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్‌ చేరిందని డీఆర్డీవో తన ట్వీట్ లో రాసింది. అయితే ఇది కేవలం ప్రారంభమైనని..ఇలాంటివి మరిన్ని డీఆర్డీవో తయరాు చేసేందుకు సిద్ధంగా ఉందని డీఆర్డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి.కామత్‌ చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఇలాంటి ఆయుధాలను ప్రదర్శించాయి. ఇజ్రాయెల్ కూడా పని చేస్తోందని..మనది నాలుగో దేశమని ఆయన అన్నారు. 

 

 today-latest-news-in-telugu | army

 

Also Read: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!

Advertisment
Advertisment
Advertisment