Mallikarjun Kharge: ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయి.. ఖర్గే కీలక వ్యాఖ్యలు

ప్రధాని మోదీ చెబుతున్న వికసిత్‌ భారత్‌ వల్ల దేశ ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయని మల్లికార్జున ఖర్గే విమర్శించారు.ఇది కేవలం కొందరు సంపన్నుల ఖజానాను మాత్రమే నింపుతోందంటూ ఆరోపించారు. కోట్లాది మంది వద్ద ఖర్చు చేసేందుకు అదనపు ఆదాయం లేదన్నారు.

New Update
Mallikarjun Kharge

Mallikarjun Kharge

కాంగ్రెస్ (Congress) జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) కేంద్ర ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ చెబుతున్న వికసిత్‌ భారత్‌ వల్ల దేశ ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయంటూ విమర్శించారు. ఇది కేవలం కొందరు సంపన్నుల ఖజానాను మాత్రమే నింపుతోందంటూ ఆరోపించారు. కోట్లాది మంది ప్రజల వద్ద ఖర్చు చేసేందుకు అదనపు ఆదాయం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌ సుంకాలు, వాణిజ్య అడ్డంకులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. 

Also Read :  యాక్షన్ తో దుమ్ములేపిన సల్లు భాయ్.. సికిందర్ టీజర్ చూశారా?

Also Read: వీడ్ని పట్టుకుంటే రూ.లక్ష మీ సొంతం.. పోలీసుల సంచలన ప్రకటన

'' మోదీ (PM Modi) జీ.. కోట్లాది మంది భారతీయులకు ఖర్చు చేసేందుకు అదనపు ఆదాయం లేదు. దేశ జీడీపీలో 60 శాతం కేవలం ప్రజలు ఖర్చు చేయడం పైనే ఆధారపడి ఉంది. 10 శాతం మంది మాత్రమే ఆర్థిక వృద్ధిని, వినియోగాన్ని పెంచుతున్నారు. మిగిలిన 90 శాతం మంది నిత్యావసర వస్తువులు కొనలేని పరిస్థితి ఉంది. పన్ను చెల్లిస్తున్న వారిలో 50 శాతం మందికి దశాబ్ద కాలంలో వేతనం పెరగడం ఆగింది. గ్రామీణ వేతనాల పెరుగుదల కూడా అంతే ఉంది. 

Also Read: హిందీ వల్ల 25 నార్త్ ఇండియా భాషలు నాశనమయ్యాయి: స్టాలిన్

దేశ ప్రజల ఆదాయాలు పెంచడంలో ఎన్డీయే విధానాలు విఫలమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్‌ సుంకాలతోనే పోరాడుతోంది. వాణిజ్యంలో కూడా అడ్డంకులు ఉన్నాయి. యువత నిరుద్యోగం ఊబిలో చిక్కుకుపోయింది. ద్రవ్యోల్బణం పట్టి పీడిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కూడా దక్కలేదు. మీరు చెబుతున్నటువంటి వికసిత్‌ భారత్ అనేది ప్రజల జేబులను ఖాళీ చేస్తోంది. కొద్దిమంది సంపన్నులు ఖజానా మాత్రమే నింపుతోందని'' మల్లికార్జున ఖర్గే అన్నారు.   

Also Read :  బంగ్లాదేశ్తో మ్యాచ్ రద్దు.. పరువు తీసుకున్న పాకిస్థాన్ !

Mallikarjun Kharge Key Comments

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

భారత ఆయుధాల లిస్ట్ లో మరో కొత్త అస్త్రం చేరనుంది. లేజర్ ఆధారిత వెపన్ ను డీఆర్డీవో మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. గాల్లో ఎగురుతున్న యూవీఏ, డ్రోన్లను ఇది పడగొట్టగలదు. 

New Update
india

Laser Weapon

భారత దేశానికి చెందిన డీఆర్డీవో మరో కొత్త ప్రయోగం చేసింది. భారతదేశానికి కొత్త అస్త్రాన్ని అందించింది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో మొదటిసారి పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్‌లో భాగంగా గాల్లో ఎగురుతున్న యూఏవీ, డ్రోన్లను నేలకూల్చడంలో సఫలమైంది. దీనికి సంబంధించిన  వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఒక వాహనంలో ఈ లేజర్ ఎనర్జీని వెపన్ ను అమర్చారు. దీనికి ఎంకే 2(ఏ) ల్యాండ్ వెర్షన్ అని పేరు పెట్టారు. ఇది యూఏవీ, డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతో పాటు నిఘా సెన్సార్‌లను పనిచేయకుండా చేసింది. దీనిద్వారా.. లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్‌ చేరిందని డీఆర్డీవో తన ట్వీట్ లో రాసింది. అయితే ఇది కేవలం ప్రారంభమైనని..ఇలాంటివి మరిన్ని డీఆర్డీవో తయరాు చేసేందుకు సిద్ధంగా ఉందని డీఆర్డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి.కామత్‌ చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఇలాంటి ఆయుధాలను ప్రదర్శించాయి. ఇజ్రాయెల్ కూడా పని చేస్తోందని..మనది నాలుగో దేశమని ఆయన అన్నారు. 

 

 today-latest-news-in-telugu | army

 

Also Read: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!

Advertisment
Advertisment
Advertisment