Viral Video: నీ ఫోన్‌ నీకు కావాలంటే..నాకు కావాల్సింది ఇచ్చేయ్‌!

బృందావన్‌ లో  ఒక వానరం ఏకంగా  ఒక పర్యాటకుడి నుంచి సామ్ సంగ్ ఎస్ 25 మొబైల్ ఫోన్ ను ఎత్తుకుపోయింది.కోతిని ఎంత బతిమాలుడుకున్నప్పటికీ..అది ఇవ్వలేదు.దీంతో అక్కడున్న వారు ఓ మ్యాంగో జ్యూస్‌ ప్యాకెట్‌ విసరగా దానిని పట్టుకున్న కోతి, ఫోన్ ను కింద పడేసింది.

New Update
monkey

monkey

సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని ఫన్నీవీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో ఎక్కువ వీడియోలు కోతులకు సంబంధించినవే ఉంటాయి. ఈ వెరైటీ వీడియోలు చూసేందుకు నెటిజన్లు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తుంటారు. మనం నిత్యం ఆలయాల దగ్గర, పర్యాటక ప్రదేశాల దగ్గర కోతులను ఎక్కువగా చూస్తుంటాం. అక్కడికి వచ్చే పర్యాటకుల నుంచి ఏవోక వస్తువులు తీసుకుని వారిని ఏడిపిస్తూంటాయి.

Also Read: America: అమెరికా దాటి వెళ్లకండి... హెచ్-1బీ వీసాదారులకు హెచ్చరికలు!

కొన్ని సందర్భాల్లో విలువైన వస్తువులనే ఎత్తుకుపోతుంటాయి. ఏ వస్తువులనైన వానరాలు తినే వస్తువులు అనుకుంటాయి. ఈ నేపథ్యంలో బృందావన్‌ లో  ఒక వానరం ఏకంగా  ఒక పర్యాటకుడి నుంచి సామ్ సంగ్ ఎస్ 25 మొబైల్ ఫోన్ ను ఎత్తుకుపోయింది. దీంతో అతను.. లబోదిబో మన్నాడు. కోతి తీరిగ్గా అక్కడున్న ఒక కట్టడం పైకిఎక్కేసి... ఆ ఫోన్‌ యజమానికి చుక్కలు చూపించింది. పాపం.. అతను తన ఫోన్ ఇవ్వాలని కోతిని ఎంతగానో బతిమాలడుకున్నాడు. 

Also Read: Telangana: మందుబాబులకు అదిరిపోయే వార్త... మార్కెట్లోకి ఏకంగా 37 కొత్త బ్రాండ్లు..!

ఇంతలో అక్కడున్న వాళ్లు ఆ పర్యాటకుడికి ఓ సలహా ఇచ్చారు. దానికి ఇష్టమైన దాన్ని విసిరితే.. దాని చేతిలో ఉన్న మొబైల్ ను కిందకు పడేస్తుందేమో అని అన్నారు. దీంతో అతగాడు.. ఇదే ఉపాయాన్ని అప్లై  చేశాడు. కోతి ముందుకు ఒక మ్యాంగో జ్యూస్ ప్యాకెట్‌ విసిరాడు.అది కాస్త కోతి క్యాచ్ పట్టింది. ఆ తర్వాత వానరం..ఆ మ్యాంగోను తన చేతిలో తీసుకుని..దాని చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ను కింద పడేసింది. దీంతో ఆ పర్యాటకుడు హమ్మయ్యా.. నా ఫోన్ అయితే  దొరికిపోయిందోచ్ అని పండగ చేసుకున్నాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కోతి కూడా క్విడ్ కో ప్రో చేస్తుందీగా.. అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Ap Crime: నిన్న కాకినాడ..నేడు కోనసీమలో దారుణం..కాలయములవుతున్న కన్నతండ్రులు!

Also Read: TTD: తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్‌ న్యూస్‌..ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు!


 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Madya Pradesh: ఊళ్ళో నీటి కరువుతో భర్తను వదిలేసిన భార్య!

మధ్యప్రదేశ్ లోని దేవ్ర గ్రామంలో నీటి కరువు కారణంగా విసిగిపోయిన ఓ ఇల్లాలు భర్తను వదిలేసి పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో భర్త జితేందర్ అధికారుల దగ్గరికి వెళ్లి తన బాధను చెప్పుకోగా.. వెంటనే గ్రామానికి మంచి నీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. 

New Update
drought

Madya Pradesh: మనస్పర్థలు, గొడవలతో భర్తను వదిలేసిన భార్యలు చూసుంటారు. కానీ ఊళ్ళో నీటి కరువు కారణంగా భర్తను వదిలేసి పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది ఓ ఇల్లాలు. ''భవిష్యత్తులేని ఆ గ్రామంలో ఉంటే తన పిల్లలు ఏం బాగుపడతారని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 
ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని దేవ్ర గ్రామంలో వెలుగుచూసింది. 

అయితే దేవ్ర గ్రామంలో జితేంద్ర అనే వ్యక్తి రోజువారీ కూలీగా జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు.  కాగా, ఈ గ్రామంలో ప్రజలు నీటి కరువుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఊరు అంతటా కలిపి ఒకే ఒక్క బోరు బావి ఉండగా.. రోజంతా గ్రామస్థులు నీటి కోసం దాని ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం ఓ ట్యాంక్ నిర్మించినప్పటికీ దానికి నీటి సరఫరా ఏర్పాట్లు లేవు. 

నీటి కరువుతో భర్తను వదిలేసి.. 

ఈ పరిస్థితులతో విసిగిపోయిన జితేందర్ భార్య పిల్లలను తీసుకొని పుట్టింటింది వెళ్ళిపోయింది. దీంతో జితేందర్ జిల్లా అధికారుల దగ్గరికి వెళ్లి తన బాధను చెప్పుకున్నాడు. ''భవిష్యత్తులేని గ్రామంలో నా పిల్లలు ఏం బాగుపడతారని తన భార్య నిలదీసిందని'' వాపోయాడు.  దీనిపై స్పందించిన అధికారులు వెంటనే గ్రామానికి మంచి నీటి సౌకర్యం కల్పించాలని పీహెచ్‌ఈ ఆదేశించారు. 

Advertisment
Advertisment
Advertisment