Walayar case: భర్తముందే కూతుళ్లపై ప్రియుడితో అత్యాచారం చేయించిన తల్లి.. ‘వలయార్ కేసు’లో భయంకర నిజాలు!

కేరళ ‘వలయార్ కేసు’లో భయంకర నిజాలు బయటపడుతున్నాయి. 2017లో జరిగిన ఈ కేసులో సీబీఐ విచారణ నడుస్తుండగా తల్లి తన 13,9 ఏళ్ల కూతుళ్లపై ప్రియుడితో లైంగిక దాడి చేయించినట్లు తేలింది. ఆమె భర్త సహకారం కూడా ఉందని తెలుస్తుండగా నిందితులకు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. 

New Update
Kakinada: మైనర్ బాలికపై దాడి... పోక్సో కేసు నమోదు..!

Kerala Walayar case

Walayar case: కేరళ ‘వలయార్ కేసు’లో భయంకర నిజాలు బయటపడుతున్నాయి. 2017లో జరిగిన ఈ కేసులో సీబీఐ విచారణ నడుస్తుండగా తల్లి తన కూతుళ్లపై లైంగిక దాడి చేయించినట్లు తేలింది. అయితే అత్యాచారం చేసిన వ్యక్తుల్లో ఒకరితో ఆమెకు అక్రమ సంబంధం ఉందని, ఆమె భర్త కూడా పిల్లలపై పలుసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు సీబీఐ ఆరోపించింది. భర్త, పిల్లల సమక్షంలోనే A1 నిందితుడు వాలియ మధుతో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఛార్జిషీట్‌లో పేర్కొంది. వారందరి వేధింపులను తట్టుకోలేక 9, 13, ఏళ్ల ఇద్దరు ఆడపిల్లలు సైసైడ్ చేసుకున్నట్లు వెల్లడించింది. 

కేసు కొట్టివేసిన కోర్టు..

ఈ ఘటన 2017లో జరగగా.. జనవరి 13న 13 ఏళ్ల బాలిక వలయార్‌లోని అట్టప్పలంలో ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది. 2 నెలల తర్వాత 2017 మార్చి 4న ఆమె 9ఏళ్ల చెల్లెలు ఉరేసుకుని మరణించింది. మొదట ఆత్మహత్యలుగా భావించగా పోస్టుమార్టం నివేదికల్లో లైంగిక దాడి జరిగిందని తేలడంతో స్థానికుల నుంచి తీవ్ర ఆగ్రహజ్వాలలు రేకెత్తాయి. అయితే ఆధారాలు లభించకపోవడంతో పాలక్కాడ్ పోక్సో కోర్టు కేసు కొట్టివేసింది. నిందితులు వాలియ మధు, ఎం మధు, శిబు, ప్రదీప్ కుమార్‌లపై సాక్ష్యాలు లేకపోవడంతో నిర్దోషులుగా విడుదల చేసింది. ఇది కేరళ వ్యాప్తంగా భారీ నిరసనలు కారణమవగా బాలికల పేరెంట్స్ లైంగిక నేరాలకు సంబంధించి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద విచారణ ఎదుర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: Maoist: మావోయిస్టులపై లాస్ట్ ఆపరేషన్.. PLGA ఆవాసంలోకి చొచ్చుకెళ్లిన భద్రతా బలగాలు!

2019లో సిట్ ఏర్పాటు..

అయితే ఈ కేసు 2019 జూన్ లో అనూహ్యంగా మలుపు తిరగడంతో సిట్ ఏర్పడింది. లైంగిక వేధింపుల వల్లే పిల్లలు చనిపోయారని పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే కేరళ హైకోర్టు 2021లో సీబీఐ విచారణకు ఆదేశించింది. సీబీఐ ఛార్జిషీట్, 2021లో పోలీసులు ఛార్జిషీట్ లలో తేడాలుండటంతో పోక్సో కోర్టు తిరస్కరించింది. దీంతో  2024 ఆగస్టులో కేరళ హైకోర్టు ఈ కేసును ఎర్నాకుళం సీబీఐ కోర్టుకు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ విచారణలో తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణం జరిగినట్లు సీబీఐ తేల్చింది. అక్కను మొదట వేధించగా అది చూసిన చిన్న పాట తీవ్ర మనోవేధనకు గురైనట్లు సీబీఐ తెలిపింది. 

ఇది కూడా చదవండి: Trump: ఉక్రెయిన్లు రష్యన్లు కావొచ్చు.. ట్రంప్ సంచలన ప్రకటన

నిందితులకు జీవిత ఖైదు..

ఇక ఈ కేసు తాజా సీబీఐ ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. తల్లిదండ్రులే లైంగిక దాడికి అనుమతించారని, ఏళ్ల తరబడి వారి టార్చర్ ను పిల్లలు భరించారని చెప్పింది. తనతో లైంగిక సంబంధం పెట్టుకున్న వాడే పెద్ద అమ్మాయిని రేప్ చేశాడని తెలిసినా పెద్దగా పట్టించుకోని దుర్మార్గురాలు చిన్న కూతురిపై కూడా అత్యాచారం చేసేందుకు ప్రోత్సహించినట్లు వెల్లడైంది. అయితే సీబీఐపై తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, తాము నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు పాలిగ్రాఫ్ టెస్టుకు సిద్ధమని వాదిస్తోంది. దీనిని కోర్టు నిర్ధారించాల్సి ఉండగా సీబీఐ ఆరోపణలు నిజమైతే నిందితులకు జీవిత ఖైదు తప్పదు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హిరో విజయ్ సంచలన నిర్ణయం

టీవీకే అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు ఆమోదించిన ఈ వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో పాటు మరికొందరు పిటిషన్ వేసిన సంగతి తెలసిందే.

New Update
TVK Chief Vijay

TVK Chief Vijay

క్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల ముస్లింలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత, సినీనటుడు విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు ఆమోదించిన ఈ వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో పాటు మరికొందరు పిటిషన్ వేసిన సంగతి తెలసిందే. తాజాగా విజయ్ కూడా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

 ఇదిలాఉండగా.. వక్ఫ్‌ సవరణ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలలైన పిటిషన్లపై ఏప్రిల్ 16న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై ఇప్పటిదాకా 10 పిటిషన్లు దాఖలయ్యాయి. మరికొన్ని త్రిసభ్య ధర్మాసనం ముందు జాబితా కావాల్సి ఉంది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌తో కూడిన బెంచ్ విచారణ చేయనుంది. 

Also Read: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

ముందుగా ఏప్రిల్ 15న విచారణ చేపడతామని సుప్రీం ధర్మాసనం చెప్పగా.. కేంద్రం గత మంగళవారం కేవియట్ దాఖలు చేసింది. తమ అభిప్రాయాలు తెలుసుకోకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని తెలిపింది. ఈ క్రమంలోనే వక్ఫ్ సవరణ చట్టంపై వచ్చిన పిటిషన్లను ఏప్రిల్ 16న విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా ఇటీవల లోక్‌సభ, రాజ్యసభలో వక్ఫ్ సవరణ చట్టం 2025 ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సమ్మతితో ఈ చట్టం అమల్లోకి కూడా వచ్చింది.  

Also read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ

Also Read: షేక్ హసీనాకు బిగ్ షాక్.. మరోసారి అరెస్టు వారెట్ జారీ

rtv-news | waqf-amendment-bill | national-news | telugu-news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు