Jayalalithaa Assets: కళ్లు చెదిరిలే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఖజానా!

తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చెందిన ఆస్తులు,పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బెంగళూరులోని కోర్టు అధికారులు అప్పగించారు.10,000 పట్టు చీరలు, 750 జతల పాదరక్షలు,27 కిలోల బంగారం, వజ్రాభరణాలు,రత్నాలు ఇతర వస్తువులను అప్పగించారు.

New Update
jayalaliotha asets

jayalaliotha asets

Jayalalithaa Assets: ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి తమిళనాడు(Tamilnadu) దివంగత సీఎం జయలలితకు చెందిన ఆస్తులు, పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బెంగళూరులోని కోర్టు(Benguluru Court) అధికారులు శుక్రవారం అప్పగించారు. బెంగళూరు పరప్పన అగ్రహార కారాగారంలో ఇప్పటి వరకు జయలలిత ఆస్తులు, పత్రాలను భద్రపరిచారు.

Also Read: Indian illegal immigrants: మరో 119 మందితో అమెరికా నుంచి బయల్దేరిన విమానం..ఈ సారి ల్యాండింగ్‌ ఎక్కడంటే!

10,000 పట్టు చీరలు, 750 జతల పాదరక్షలు,27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలు,601 కిలోల వెండి వస్తువులు, 1672 ఎకరాల వ్యవసాయ భూములు పత్రాలు, నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 8,376 పుస్తకాలు తదితరాలను తీసుకు వెళ్లేందుకు భారీ భద్రతతో అధికారులు ఆరు ట్రంకు పెట్టెలు తీసుకువచ్చారు.

Also Read: Techie: రూ.8 కోట్లతో ప్రమోషన్ ఓ చేతిలో...భార్య నుంచి విడాకులు మరో చేతిలో...జీవితంలో ఓడిపోయనంటూ ఓ టెకీ ఆవేదన!

తమిళనాడు నుంచి కర్ణాటకకు...

న్యాయమూర్తి హెచ్‌ఎన్‌ మోహన్ సమక్షంలో వాటిని అధికారులకు అప్పగించారు. జయలలిత అక్రమార్జనకు సంబంధించిన కేసు 2004 లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ అయినప్పుడు అక్కడ జప్తు చేసిన ఆస్తులు,పత్రాలు ఇక్కడికి తీసుకువచ్చి భద్రపరిచారు.మరో వైపు తాము జయలలితకు వారసులమని, ఆ  ఆస్తులను తమకే అప్పగించాలని దీపక్‌,దీప అనే వ్యక్తులు వేసుకున్న అర్జీని కర్ణాటక హైకోర్టు ఇది వరకే కొట్టివేసింది.

దాన్ని సవాల్‌ చేస్తూ వారు సర్వోన్నత న్యాయస్థానంలో వేసిన పిటిషన్‌ నూ అక్కడి ధర్మాసనం తోసిపుచ్చింది. జప్తు చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువను 913.14 కోట్లుగా అధికారులు మదింపు వేయగా..అది నేడు కనీసం రూ.4,000 కోట్లుగా ఉండొచ్చని అనధికారికంగా తెలుస్తోంది.

Also Read: Elon Musk-Modi: ప్రపంచ కుబేరుడి పిల్లలకు ప్రత్యేక బహుమతులిచ్చిన భారత ప్రధాని..ఏమిచ్చారో తెలుసా!

Also Read: Vallabhaneni Vamsi Arrest Case: నా భర్తను జైల్లో చంపేస్తారు.. వల్లభనేని వంశీ భార్య సంచలన ఆరోపణలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

VIRAL VIDEO: బెంగళూరులో సినిమా రేంజ్ లో రోడ్డు ప్రమాదం.. చూస్తే షాక్ అవుతారు!

బెంగళూరులో పట్టపగలే సినిమా రేంజ్‌ రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంలో ఉన్న వాటర్ ట్యాంకర్‌ మరో వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో అదుపు తప్పింది. దీంతో నడి రోడ్డు పై మూడు పల్టీలు కొట్టింది.

New Update
bengalore

bengalore

బెంగళూరు నగరంలో పట్టపగలే సినిమా రేంజ్‌ రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. అతి వేగంలో ఉన్న వాటర్ ట్యాంకర్‌ మరో వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో అదుపు తప్పింది. దీంతో నడి రోడ్డు పై మూడు పల్టీలు కొట్టింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Also Read: Ram Mandir: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !

వివరాల ప్రకారం..వాటర్‌ ట్యాంకర్‌ వర్తూర్‌ వైపు నుంచి దొమ్మసాంద్రకు నీటిని తీసుకుని వెళ్తోంది.ఈ క్రమంలో సదరు వాటర్ ట్యాంకర్‌ డ్రైవర్‌ ముందు వెళ్తున్న వాహనాలను ఓవర్‌ టేక్‌ చేశాడు. ఒక్కసారిగా వేగం పెరగడంతో ట్యాంకర్‌ వాహనం అదుపు తప్పింది.

Also Read: Waqf Act Protest: బెంగాల్ చల్లబడటం లేదు..మళ్ళీ నిరసనలు, పోలీస్ వాహనానికి మంటలు..

దీంతో వాహనం ప్రమాదానికి గురైంది. సినిమా రేంజ్‌ లో పల్టీలు కొడుతూ..రోడ్డు పై పడిపోయింది.  ట్యాంకర్‌ లో ఉన్న నీళ్లు ఎగిరిపడ్డాయి.దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.ఇక ఈ ప్రమాదం కారణంగా ట్యాంకర్‌ డ్రైవర్‌, వాహనంలో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

దీంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా రోడ్డు పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

Also Read: TG JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 18 వేల ఉద్యోగాలు.. ఈ నెలలోనే నోటిఫికేషన్!

Also Read: సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే వారికి అలర్ట్.. ఆ 6 ప్లాట్ ప్లాట్‌ఫామ్‌లు మూసివేత!

bengalore | latest-news | latest-telugu-news | latest telugu news updates | Water Tanker Crash | national-news | national news in Telugu | telugu-news-national-news 

Advertisment
Advertisment
Advertisment