India- Pakistan: భారత్‌, పాక్‌ల మధ్య కీలక సమావేశం.. ఎందుకంటే ?

ఇటీవల పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే దీనిపై చర్చలు జరిపేందుకు పాకిస్థాన్, భారత్ మిలిటరీ అధికారులు మధ్య శుక్రవారం కీలక సమావేశం జరిగింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
India, Pakistan to hold flag meeting

India, Pakistan to hold flag meeting

India- Pakistan: ఇటీవల పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే దీనిపై చర్చలు జరిపేందుకు పాకిస్థాన్, భారత్ మిలిటరీ అధికారులు(Military officers) శుక్రవారం సమావేశమైనట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌(Poonch sector)లో గురువారం నియంత్రణ రేఖ వెంట (LOC) ఉగ్ర కదలికలను గుర్తించినట్లు అధికారులు చెప్పారు.   

Also Read: డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. అదుపు తప్పిన కంటైనర్.. ఒకరు మృ‌తి

పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలు..

ఈ నేపథ్యంలోనే భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. అయితే ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై ఇరుదేశాల మధ్య సైన్యాధికారులతో శుక్రవారం అక్కడ ఫ్లాగ్‌ సమావేశం జరగనుందని భారత సైన్యానికి చెందిన ఓ అధికారి చెప్పారు. మరోవైపు చూసుకుంటే గత కొన్ని రోజులుగా పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడతోంది. గత వారమే ఘాటి సెక్టార్‌(Ghati Sector)లో పాకిస్థాన్‌ సైన్యం కాల్పులకు పాల్పడింది. ఈ దాడులపై అప్రమత్తమైన భారత బలగాలు పాక్‌ సైన్యాన్ని తిప్పికొట్టాయి. 

Also Read: సర్కార్ కీలక నిర్ణయం.. ఆ మహిళలకు 60 రోజుల పాటు సెలవులు

కానీ దీనివల్ల కాల్పల విరమణ ఒప్పందం ఉల్లంఘన కాలేదని భారత సైన్యాధికారులు(Indian Army officers) చెప్పారు. ఇక ఫిబ్రవరి 4,5 తేదీల మధ్య అర్ధరాత్రి సమయంలో కొందరు చొరబాటుదారులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో భారత సైన్యం వాళ్లపై కాల్పులు జరిపింది. ఏడుగురు చొరబాటుదారులు హతమయ్యారు. అనంతరం పలుమార్లు జరిగిన ఉగ్రకాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందారు. అయితే తాజాగా కాల్పుల విరమణ ఒప్పందంపై పాకిస్థాన్, భారత్ మిలిటరీ అధికారులు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: ట్రంప్‌ ఎఫెక్ట్‌ ...నిర్బంధించి పంపేస్తారన్న భయంతో 11 ఏళ్ల బాలిక ఆత్మహత్య!

Also Read: Flipkart Mobile Offers: ఇదెక్కడి ఆఫర్రా బాబు.. మతిపోతుంది: ఫ్లిప్‌‌కార్ట్‌లో రూ.50వేల ఫోన్ పై భారీ డిస్కౌంట్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

VIRAL VIDEO: కండక్టర్ కాదు కామాంధుడు.. బస్సులో నిద్రపోతున్న యువతి ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ.. ఛీ ఛీ!

కర్ణాటకలో దారుణం జరిగింది. మంగళూరు సమీపంలోని ముడిపు-స్టేట్ బ్యాంక్ మార్గంలో నడిచే కేఎస్ఆర్టీసీ బస్సులో ఓ యువతిని కండక్టర్ లైంగికంగా వేధించాడు. నిద్రిస్తుండగా ఆమె పక్కనే నిలబడి పదేపదే టచ్ చేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో కండక్టర్‌ను విధుల నుంచి తొలగించారు.

New Update
Conductor sexually harasses young woman sleeping on bus in karnataka

Conductor sexually harasses young woman sleeping on bus in karnataka

కామాంధులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఆడది కనిపిస్తే చాలు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. మానవత్వం, మంచి మరచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఒంటరిగా ఉన్నా.. వంద మందిలో ఉన్నా.. పాడు బుద్దితో అతి నీచంగా, అసభ్యకంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. గతం కంటే ఈ మధ్య కాలంలో మహిళలపై అత్యాచార ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. 

Also Read: Maoist Operation: తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్

తాజాగా అలాంటిదే మరొకటి జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఒక యువతిపై కండక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. నిద్రపోతున్న ఆ యువతి పక్కనే నిలబడి.. చేతులతో టచ్ చేస్తూ లైంగికంగా వేధించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ కండక్టర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆ వీడియో ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ కామ కండక్టర్‌ను విధుల నుంచి తొలగించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్

Also Read: ఉలిక్కిపడ్డ 'బెజవాడ'.. ఆ ప్రాంతంలో ఉగ్రవాద కదలికలు..!

నిద్రపోతున్న యువతిపై

ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. మంగళూరు సమీపంలోని ముడిపు-స్టేట్ బ్యాంక్ మార్గంలో నడిచే కేఎస్ఆర్టీసీ బస్సులో ఓ యువతి నిద్రపోతుంది. అదే సమయంలో బస్సు కండక్టర్ ఆమె పక్కకి వచ్చి నిలబడి ఆ యువతిని పదేపదే టచ్ చేస్తూ లైంగికంగా వేధించాడు. ఆమె కూర్చున్న సీట్‌ పక్కనే నిల్చుని మెల్ల మెల్లగా చెయ్యి వేశాడు. ఇది గమనించిన తోటి ప్రయాణీకుడు ఈ సంఘటనను తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. అది కాస్త రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కేఎస్ఆర్టీసీ అధికారులు ఆ కండక్టర్‌ను విధుల నుంచి తొలగించారు. 

Also Read:Pahalgam Terror Attack: టార్గెట్ హైదరాబాద్‌..  ఆ ప్రాంతాలపైనే ఉగ్రవాదుల ఫోకస్!

viral-news | viral-video | crime news
Advertisment
Advertisment
Advertisment