/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/train-jpg.webp)
trains
పలు రైళ్ల ఆలస్యంతో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఆదివారం రాత్రి ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.12,13 ప్లాట్ఫాం లపై తీవ్రమైన రద్దీ ఏర్పడింది.దీంతో ఒకానొక సమయంలో ఆందోళనకర పరిస్థితి తలెత్తింది. తొక్కిసలాట చోటు చేసుకునే అవకాశం ఉండడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.
ఆ రెండు ప్లాట్ఫాంల పైకి ప్రయాణికులు రాకుండా కట్టడి చేశారు.ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.దీని పై రైల్వే మంత్రిత్వ శాఖ సైతం స్పందించింది.భారీగా ప్రయాణికులు వచ్చినప్పటికీ ఎలాంటి తొక్కిసలాటగానీ, అలాంటి పరిస్థితి తలెత్తలేదని పేర్కొంది.
గంగా,స్వతంత్ర సేనాని, జమ్మూ రాజధాని,లఖ్నవూ మెయిల్,మగధ్ ఎక్స్ప్రెస్ లు ఢిల్లీ రైల్వే స్టేషన్ కు రావడానికి ఆలస్యమయ్యాయి.ఒకేసారి ఐదు రైళ్లు ఆలస్యం కావడంతో వాటిలో వెళ్లాల్సిన ప్రయాణికులు ఆ రెండు ప్లాట్ఫాం ల పైకి భారీగా చేరుకున్నారు.దీంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు.
వెంటనే రద్దీ నియంత్రన చర్యలు తీసుకున్నారు. తీవ్రమైన రద్దీతో భయాందోళనలు చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గత నెల15 న ఢిల్లీ రైల్వే స్టేష్ లోనే తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.కుంభమేళాకు వెళ్లే భక్తులు భారీగా పోటెత్తడంతో మొత్తం 18 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.ఈ నేపథ్యంలో మళ్లీ అలాంటి పరిస్థతి తలెత్తకుండా అధికారులు ముందే అప్రమత్తమయ్యారు.రద్దీని నియంత్రిచడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read:YS Viveka Murder-SIT: వివేకా హత్య కేసులో రంగంలోకి దిగిన సిట్...వారి మరణాల పై విచారణ!
delhi | railway-station | rush | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | Delhi railway station