Tamil Nadu: తమిళనాడులో హిందీ భాష వివాదం.. బోర్డులపై నల్ల రంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు

తమిళనాడులో డీఎంకే కార్యకర్తలు పలు బోర్డులపై ఉన్న హిందీ పేర్లకు నల్ల రంగం పూయడం దుమారం రేపుంతోంది. దీనిపై స్పందించిన బీజేపీ చీఫ్ అన్నమలై డీఎంకేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.

New Update
DMK blackens Hindi signs in Tamil Nadu, Annamalai calls them 'confused nincompoops'

DMK blackens Hindi signs in Tamil Nadu, Annamalai calls them 'confused nincompoops'

తమిళనాడులో హిందీ భాషపై వివాదం నడుస్తోంది. జాతీయ విద్యా విధానం ద్వారా బలవంతంగా హిందీని రుద్దుతున్నారని సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. కేంద్రం రూ.10 వేలు కోట్లు ఇచ్చినా ఈ విద్యా విధానాన్ని అమలు చేయమని ఆయన స్పష్టం చేశారు. దీంతో అధికార డీఎంకే కార్యకర్తలు పలు బోర్డులపై ఉన్న హిందీ పేర్లకు నల్ల రంగం పూయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రైల్వేస్టేషన్లు, పోస్టాఫీసులతో పాటు వివిధ చోట్ల ఉన్న ప్రభుత్వ సైన్‌ బోర్డులపై హిందీ అక్షరాలపై నల్లరంగు పూస్తున్నారు. 

Also Read: అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలు తొలగింపు.. ఢిల్లీ అసెంబ్లీలో తొలిరోజు రచ్చ రచ్చ!

ఆదివారం డీఎంకే శ్రేణులు పాలైయంకోట్టై, పాలక్కాడ్ రైల్వే స్టేషన్‌లోని బోర్డులపై హిందీ పేర్లకు నల్ల రంగు వేశారు. సోమవారం కూడా దీన్ని పలు చోట్ల కొనసాగించారు. చెన్నైలోని అలందూర్ పోస్టాఫీస్‌, అలాగే జీఎస్టీ రోడ్డులో ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని హిందీ అక్షరాలతో ఉన్న సైన్ బోర్డులపై బ్లాక్ పెయింట్ వేశారు. అయితే హిందీ భాషను వ్యతిరేకిస్తున్న డీఎంకేపై  బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై మండిపడ్డారు. 

Also Read: రైతులకు గుడ్ న్యూస్ .. పీఎం కిసాన్ డబ్బులు వచ్చేశాయ్‌ !

త్రిభాషా విధానంపై డీఎంకే పార్టీ కపటత్వం చూపిస్తోందంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. ఆ పార్టీ నేతల సొంత పిల్లలు బహు భాషా పాఠశాలల్లో చదువుకున్నప్పుడు త్రిభాషా విధానాన్ని డీఎంకే ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నలు గుప్పించారు. డీఎంకే అనేది వాళ్ల కుటుంబాలకు, ఇతరులకు భిన్నమైన ప్రమాణాలు పాటించే అవివేకుల సమూహం అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలను డీఎంకే తప్పు దారి పట్టిస్తోందని విమర్శించారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధునిక జిన్నా: తరుణ్ చుగ్

పశ్చిమ బెంగాల్‌లో హింసకు మమతా బెనర్జీ సమాధానం చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అల్లర్లు చెలరేగుతుంటే ముఖ్యమంత్రి మౌనంగా ఉండటాన్ని ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు ఖండించారు. తరుణ్ చుగ్ మమతా బెనర్జీని ఆదునిక జిన్నాతో పోల్చారు.

author-image
By K Mohan
New Update
CM Mamata Banerjee: నీతి ఆయోగ్ సమావేశం నుంచి సీఎం మమతా బెనర్జీ వాకౌట్‌

వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడే విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. వక్ఫ్ సవరణ చట్టం 2025 పై పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ లో తీవ్ర అసంతృ‌ప్తి జ్వాలలు ఎగిపిపడుతున్నాయి. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయి. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం 2025 బిజెపిని ప్రశంసించి తగిన ఒక సాహసోపేతమైన చర్య.

ఈ చట్టానికి వ్యతిరేకంగా భారతదేశంలోని అనేక నగరాల్లో నిరసనలు చెలరేగాయి. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ లో హింసా కాండ మొదలైంది. అక్కడ హిందూ కుటుంబాలను లక్ష్యంగా చేసుకున్నారు. దుకాణాలను దోచుకున్నారు. మరియు శుక్రవారం ప్రార్థనల తర్వాత ముస్లిం గుంపులు అల్లర్లు చెలరేగడంతో సంఘాలు పారిపోవాల్సి వచ్చింది. అల్లర్లు లేపి రాళ్లు రువ్వడం, వాహనాలు ధ్వంస చేయడం, నిప్పంటించడం వంటి హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా సీఎం మమతా బెనర్జీ నోరు మెదపడం లేదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. హింసాకాండ జరిగిన ప్రాంతం నుంచి భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి చర్యలు ఉగ్రవాదం అదుపు లేకుండా విజృంభిస్తోందనడానికి ఇది స్పష్టమైన నిదర్శనమని బిజెపి విమర్శించింది. అల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. సుకాంత మజుందార్, దిలీప్ ఘోష్ , ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ వంటి సీనియర్ రాష్ట్ర బిజెపి నాయకులు టిఎంసి మౌనాన్ని విమర్శించారు. హిందువులను వారి ఇళ్ల నుండి వెళ్ళగొట్టేటప్పుడు టిఎంసి కళ్ళు మూసుకుందని ఆరోపించారు.

Also read: Waqf Board Act: వక్ఫ్ బోర్డు చట్టంలో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

ముర్షిదాబాద్‌లో అత్యంత దారుణమైన హింస జరిగినప్పటికీ, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, పాట్నా, సిల్చార్, లక్నో, తమిళనాడులోని హోసూర్ వంటి నగరాల్లో నిరసనలు చెలరేగాయి. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చట్టాన్ని తిరస్కరించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అస్సాంలోని సిల్చార్‌లో, నిరసనలు హింసాత్మకంగా మారాయి, పోలీసులతో జనాలు ఘర్షణ పడ్డారు. ఢిల్లీలోని జామా మసీదులో నిరసనలు శాంతియుతంగా ఉన్నాయి. బీజేపీ మాత్రం ఎన్ని నిరసనలు వస్తున్నా వక్ఫ్ చట్టం విషయంలో వెనక్కి తగ్గేతే లేదని తేల్చి చెప్పింది. బిజెపి నాయకుడు తరుణ్ చుగ్ మమతా బెనర్జీని ఆధునిక జిన్నాతో పోల్చారు, మైనారిటీ సంతృప్తి కోసం ఆమె హిందువుల భద్రత తాకట్టు పెట్టారని ఆరోపించారు. ముర్షిదాబాద్‌లో ముగ్గురు వ్యక్తుల మరణాలపై ఆమె మౌనాన్ని ఆయన ఖండించారు. 

Advertisment
Advertisment
Advertisment