Encounter: వారిని ఎన్‌కౌంటర్ చేయండి.. సీఎం సంచలన ఆదేశాలు!

ముంగేర్‌ ASI సంతోష్ కుమార్ సింగ్ హత్య కేసులో బీహార్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నిందితులు పోలీసులపై దాడికి పాల్పడితే ఎన్ కౌంటర్ చేయాలని డిప్యూసీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆదేశాలు జారీ చేశారు. నేరాలను అంతం చేయడానికి కఠిన చర్యలుంటాయన్నారు.

New Update
bihar  encntr

bihar encntr Photograph: (bihar encntr)

Encounter: బీహార్‌ ముంగేర్‌లోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్‌ ASI సంతోష్ కుమార్ సింగ్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల్లో ఒకరైన గుడ్డు యాదవ్‌ను అరెస్టు చేయగా మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ఘటనపై బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా సంలచన నిర్ణయం తీసుకున్నారు. కేసుకు సహకరించకుండా ఎదురుదాడులకు పాల్పడిన నిందితులను అవసరమైన ఎన్ కౌంటర్ చేయాలని పోలీసులను ఆదేశించారు. 

పోలీసులపై నిందితుడు దాడి..

ఈ మేరకు పోలీసులు గుడ్డు యాదవ్‌ను అరెస్టు చేసిన తర్వాత తీసుకెళ్తుండగా పోలీసు వాహనం బోల్తా పడింది. ఆ తర్వాత నిందితుడు గుడ్డు తప్పించుకునే ప్రయత్నంలో పోలీసుల నుండి ఆయుధాన్ని లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితుడి కాలికి కాల్పులు జరిపారు. ఈ ప్రమాదంపై మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా.. ఈ సంఘటన విచారకరం. ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నేరాలను అంతం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మేము సుపరిపాలన కోసమే అధికారంలో ఉన్నాం. ప్రభుత్వం అధికారులపై ఎవరూ దాడి చేసిన ఊరుకోం. నేరస్థుడి వాదన వినేందుకు ప్రభుత్వం నుండి పూర్తి స్వేచ్ఛ ఉంది. కానీ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్‌కౌంటర్ చేస్తామని హెచ్చరించారు. 

Also Read: మహిళా ఎస్ఐపై కానిస్టేబుల్ అత్యాచారం.. బ్లాక్‌మెయిల్ చేస్తూ.. చివరికి!

అసలు ఏం జరిగిందంటే..

ASI సంతోష్ సింగ్ పోలీసు బృందంతో కలిసి ఓ వివాదాన్ని పరిష్కరించడానికి ముంగేర్‌లోని నందలాల్‌పురా ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగిందని స్థానికులు తెలిపారు. ఇరువర్గాలతో మాట్లాడుతున్న క్రమంలో గొడవ మరింత పెద్దదైంది. గుర్తు తెలియని వ్యక్తి పదునైన ఆయుధంతో ASI సంతోష్ కుమార్ తలపై దాడి చేశాడు. ఈ దాడిలో ఏఎస్ఐ సంతోష్ తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమించడంతో ASI మరణించాడు.   

Also Read: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

New Update
Agniveers

Agniveers

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఆదివారం నాయబ్ సింగ్‌ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

'' హర్యానా నుంచి 2022-23లో 2,227 మంది, 2023-24లో 2893 మంది ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరారు. త్రివిధ దళాల్లో తమ సర్వీసులు పూర్తి చేసుకున్న అగ్నివీరుల భవిష్యత్తు కాపాడేందుకు మా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచిందని'' నాయబ్ సింగ్ సైనీ అన్నారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా హర్యానాలో చేపట్టే కానిస్టేబుళ్లు, ఫారెస్టు గార్డు, జైల్‌ వార్డెన్ల నియామకాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు హర్యానా అగ్నివీర్ పాలసీ 2024ను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా అగ్నివీరులకు పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. వీటితో పాటు స్వయం ఉపాధిని ఎంచుకునే వాళ్లకి కూడా అవసరమైన సబ్సిడీలు అందిస్తామని పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

Also Read: అమెరికాలో అగ్నిప్రమాదం...పది మంది తెలుగు విద్యార్థులు..

 telugu-news | rtv-news | haryana | agniveer | agniveer-jobs

Advertisment
Advertisment
Advertisment