Indigo Flight: షాకింగ్ ఘటన.. విమానాన్ని ఢీకొట్టి ఇంజిన్‌ లో పడిన పక్షి.. చివరికి ఏమైందంటే..!?

కేరళ నుంచి బెంగళూరు వెళ్లే విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టడం వల్ల ఫ్లైట్‌ క్యాన్సిల్‌ అయ్యింది. పక్షి విమానాన్ని ఢీకొని నేరుగా ఇంజిన్‌ లో పడింది. దీంతో విమానాన్ని వెంటనే రద్దు చేయాల్సి వచ్చింది. పక్షి ఢీకొన్న సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులు ఉన్నారు.

New Update
Indigo

Indigo Photograph: (Indigo)

ఓ పక్షి చేసిన పని వల్ల సుమారు  180 మంది తీవ్ర అవస్థలు పాలయ్యారు. ముఖ్యంగా గంటల తరబడి విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది. అందుకు ప్రధాన కారణం.. ఓ పక్షి విమానాన్ని ఢీకొట్టడమే. రన్‌వేపై వేగంగా వెళ్తున్న విమానాన్ని పక్షి ఢీకొట్టింది. అంతేకాకుండా నేరుగా వెళ్లి ఇంజిన్‌లో పడింది. దీంతో సిబ్బంది వెంటనే విమానాన్ని రద్దు చేశారు. ముఖ్యంగా అందులో ఉన్న 179 మంది ప్రయాణికులకు ఏమీ జరగకుండా సురక్షితంగా బయటకు దింపారు. ఆపై విమానాన్ని అక్కడే నిలిపివేశారు. 

Also Read: Hyderabad: పాపం.. దొంగతనానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు.. ఏం జరిగిందంటే?

కేరళ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఇండిగో విమానం  తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో వ 179 మంది ప్రయాణికులతో బయల్దేరడానికి సిద్ధంగా ఉంది. పైలెట్లు కూడా విమానాన్ని టేకాఫ్ చేసేందుకు రెడీ అయ్యారు.  రన్‌వేపై విమానాన్ని వేగంగా తీసుకుని వెళ్తున్న క్రమంలో ఓ గద్ద వచ్చి వారి విమానాన్ని వేగంగా ఢీకొట్టింది.

Also Read: EX Sarpanch: సూర్యాపేట మాజీ సర్పంచ్ ను చంపింది అల్లుళ్లే.. కూతుళ్లు కూడా.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

దీంతో పక్షి నేరుగా వెళ్లి విమానం ఎడమ వైపు ఉన్న ఇంజిన్‌లో చిక్కుకుంది. విషయం గుర్తించి అధికారులు వెంటనే విమానాన్ని రద్దు చేశారు. ముఖ్యంగా క్షణాల్లోనే విమానాన్ని ఆపి అందులో ఉన్న 179 మంది ప్రయాణికులను  బయటకు తీసుకు వచ్చారు. ఆపై ఇంజిన్‌ను పరీక్షించి దాన్ని తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ప్రయాణికులు.. తాము వెళ్లాల్సిన విమానం రద్దు కావడంతో.. విమానాశ్రయంలోనే గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది.

వారు వెళ్లే విమానం ఉదయమే వెళ్లాల్సి ఉండగా.. సాయంత్రం 6.30 గంటలకు ఇండిగో సంస్థ మరో విమానాన్ని ఏర్పాటు చేసింది. మొత్తంగా 179 మంది ప్రయాణికులను మరో విమానం ద్వారా వారి గమ్య స్థానానికి చేర్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఓ పక్షి చేసిన పని వల్ల అంత మంది ఆగిపోవాల్సి వచ్చిందంటూనే.. ఆ పక్షి ఎంత పని చేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Also Read: TG Cabinet Expansion: ఢిల్లీ నుంచి ఫోన్.. నాకు హోంశాఖ.. మంత్రి పదవిపై కోమటిరెడ్డి సంచలనం!

Also Read: Pooja Hegde: లక్షలు పెట్టి నన్ను ట్రోల్ చేయిస్తున్నారు.. నెగటివ్ పీఆర్ గుట్టువిప్పిన పూజ

kerala | indigo | flight | cancel | bird | latest-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hunger strike: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

రైతు ఉద్యమ నాయకుడు జగ్జీత్ సింగ్ దల్వాల్ 131 రోజుల నిరాహార దీక్షను విరమించుకున్నాడు. కనీస మద్ధతు ధరపై చట్టం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల కోరిక మేరకు ఆయన దీక్ష విరమించారు.

New Update
farmer leadar

farmer leadar Photograph: (farmer leadar)

పంటలకు కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఓ రైతు ఉద్యమ నాయకుడు నిరాహార దీక్ష చేశాడు. పంజాబ్‌కు చెందిన జగ్జీత్ సింగ్ దల్వాల్ 131 రోజులుగా ఏమీ తినకుండా దీక్ష చేస్తున్నాడు. 131 రోజుల తర్వాత అతను నిరాహార దీక్షను విరమించారు. పంజాబ్ రైతుల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని రైతు సంఘాలను ఆయన్ని కోరాయి. రైతు సమస్యలపై కేంద్ర ప్రభుత్వం చర్యల కోసం గత ఏడాది నవంబర్‌ 26న జగ్జీత్ సింగ్ దల్వాల్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో రైతు సంఘాలు ఆందోళన చెందాయి.

Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

ఈ నేపథ్యంలో ఫతేగఢ్‌ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్‌లో కిసాన్ మహాపంచాయత్ నిర్వహించారు. జగ్జీత్ సింగ్ దల్వాల్ నిరాహార దీక్ష ముగించాలని రైతుల సమావేశంలో కోరారు. ఈ నేపథ్యంలో శనివారం హాస్పిటల్‌ నుంచి ఇంటికి చేరుకున్న జగ్జీత్ సింగ్ దల్వాల్‌,  రైతుల విన్నపం మేరకు ఆమరణ నిరాహార దీక్షను ఆదివారం ముగించారు. మరోవైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు కూడా నిరాహార దీక్షను విరమించాలని జగ్జీత్ సింగ్ దల్వాల్‌ను శనివారం కోరారు. రైతుల డిమాండ్లపై రైతు సంఘాల ప్రతినిధులతో మే 4న కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుందని బిట్టు హామీ ఇచ్చారు.

Advertisment
Advertisment
Advertisment