/rtv/media/media_files/2026/04/06/attari-railway-station-in-punjab-2026-04-06-18-04-50.jpg)
Attari Railway Station in Punjab requires passport and visa
భారతీయ రైల్వేల్లో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు వెళ్తుంటారు. సాధారణంగా రైళ్లలో టికెట్లు కొని ప్రయాణాలు చేస్తారు. కానీ ఓ రైల్వే స్టేషన్(railway-station) లో మాత్రం ఇలా ఉండదు. అక్కడికి వెళ్లాలంటే తప్పకుండా పాస్పోర్టు(passport), వీసా(visa) కావాల్సిందే. ఇంతకీ ఆ రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్లోని అమృత్సర్ సమీపంలో 'అటారీ శ్యామ్ సింగ్' అనే రైల్వే స్టేషన్ ఉంది. పాకిస్థాన్ సరిహద్దుకు దగ్గరగా ఇది ఉంటుంది. భారత్లో చివరి రైల్వే స్టేషన్ ఇదే.
Also Read: దేశంలో UGC, వన్ నేషన్ -వన్ ఎలక్షన్.. ప్రధాని మోదీ కీలక ప్రకటన
Attari Railway Station In Punjab Requires Passport And Visa
ఈ రైల్వే స్టేషన్ నుంచే ప్రయాణికులు పాకిస్తాన్లోని లాహోర్కు వెళ్తుంటారు. అందుకే ఈ స్టేషన్లోకి వెళ్లే భారతీయ పౌరులు కచ్చితంగా పాకిస్తాన్ వీసా కలిగి ఉండాలి. ఇక్కడి రూల్స్ కూడా కఠినంగా ఉంటాయి. ఎవరైనా సరైన డాక్యుమెంట్స్ లేకుండా ఈ రైల్వే స్టేషన్లోకి వస్తే వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ రైల్వే స్టేషన్కు వెళ్లాలనుకునే వారు ముందుగానే అన్ని డాక్యుమెంట్సు రెడీగా ఉంచుకోవాలి.
Also Read: రోడ్లపైకి వస్తున్న పశువులు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఈ స్టేషన్ నుంచి సంఝౌతా అనే ఎక్స్ప్రెస్ ప్రయాణిస్తుంది. ఇది భారత్, పాకిస్తాన్ మధ్య రాకపోకలు సాగిస్తోంది. కానీ పలు రాజకీయ కారణాల వల్ల కొన్నిసార్లు ఈ రైలును నిలిపివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాదు అటారి రైల్వేస్టేషన్లో భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా ఉంటాయి. ఇక్కడ కూలీలు కనిపించరు. ప్రయాణికులే తమ లగేజ్ను మోసుకెళ్లాలి. ఈ స్టేషన్ చిన్నదే అయినప్పటికీ మంచి సౌకర్యాలు ఉంటాయి.
Follow Us