Up: కుంభమేళా ఎఫెక్ట్‌..వాయిదా పడుతున్న హైకోర్టు కేసులు!

మహా కుంభమేళాకు గత వారం రోజులుగా భక్తుల తాకిడి ఎక్కువ కాగా.. ఆ ఎఫెక్ట్ హైకోర్టుపై పడింది. ముఖ్యంగా అలహాబాద్ హైకోర్టులోని కేసులన్నీ పెండింగ్‌లో పడేలా చేసింది. గత రెండు రోజుల నుంచి యూపీలో 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిన సంగతి తెలిసిందే.

New Update
up

up

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. కేవలం దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి కూడా  భక్తులు భారీగా వస్తున్నారు. దీంతో రోడ్లన్నీ స్తంభించిపోయాయి. దాదాపు 60 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా.. భక్తులు తీవ్ర సమస్యలు ఎదుర్కుంటున్నారు. కేవలం కుంభమేళాకు వెళ్లే వాళ్లే కాకుండా సామాన్య ప్రజలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కుంభమేళా పుణ్యమా అంటూ అలహాబాద్ హైకోర్టులోని కేసులన్నీ పెండింగ్‌లో పడ్డాయి. 

Also Read: Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం పై మగువ...బీజేపీ పెద్ద ప్లానే...నలుగురు ఎమ్మెల్యేలకు అవకాశం...!

144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా జనవరి 13వ తేదీన ప్రారంభం అయ్యింది. ఆ రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అక్కడకు వెళ్తున్నారు. విదేశాల నుంచి కూడా ప్రముఖులు వస్తూ.. త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే ప్రయాగ్ రాజ్ వెళ్లే మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్‌లు అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వారం రోజుల నుంచి అయితే 200 నుంచి 300 కిలో మీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి.దీంతో కేవలం 50 కిలో మీటర్లు ప్రయాణించేందుకు కూడా సుమారు 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది. 

Also Read: Maha Kumbh mela: మహా కుంభమేళాకు భారీగా తరలి వచ్చిన భక్తులు...కాశీలోనే ఆంక్షలు విధించిన అధికారులు!

కొన్ని వారాలుగా పెండింగ్‌...

45 రోజుల పాటు సాగే ఈ మహా కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగనుంది. అప్పటి వరకు ప్రజలకు ట్రాపిక్ సమస్యలు తప్పేలా లేవు. అయితే ఈ ట్రాఫిక్ సమస్యల వల్లే ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టులో కేసులన్నీ గత కొన్ని వారాలుగా పెండింగ్‌ పడుతున్నట్లు తెలుస్తుంది. ట్రాఫిక్‌ రద్దీ వల్ల పిటిషన్ దారులు, లాయర్లు సమయానికి కోర్టుకు హాజరు కాలేకపోతున్నారు. దీంతో చేసేదేమీ లేక ఆ కేసులను వాయిదా వేస్తున్నారు. ముఖ్యంగా ఆల్ట్ న్యూస్ జర్నలిస్ట్, ఫ్యాక్ట్ చెకర్ మొహమ్మద్ జుబేర్ ఓ పిటిషన్ వేశారు. ఘజియాబాద్ దస్నా దేవి ఆలయం కేసులో నమోదు అయిన క్రిమనల్ కేసును కొట్టివేయాలంటూ న్యాయస్థానాన్ని కోరారు.

ఈ పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. కానీ కుంభమేళా ట్రాఫిక్ వల్ల పిటిషనర్లు కోర్టుకు హాజురు కాలేకపోయారు. దీంతో ఏమి చేయలేని స్థితిలో  జస్టిస్ సిద్దార్థ్ వర్మ, జస్టిస్ యోగేంద్ర కుమార్ శ్రీవాత్సవ్ కేసును మరోసారికి వాయిదా వేశారు. ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనల వల్ల ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేకపోతున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కారణం వల్లే ఇరు పార్టీలకు చెందిన వాళ్లు హాజరు కాలేకపోయారని స్పష్టం చేశారు. దీని కారణంగానే జుబేర్‌కు ఫిబ్రవరి 17వ తేదీ వరకు అరెస్టు నుంచి తాత్కాలిక ఉపశమనం దొరికింది.

Also Read:Horoscope Today: ఈ రాశి వారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తొందపాటు నిర్ణయాలు తీసుకోవద్దు..జాగ్రత్త!

Also Read:BIG BREAKING: తెలంగాణలో మందు బాబులకు షాక్.. భారీగా ధరల పెంపు!

Advertisment
Advertisment
Advertisment