Virat Kohli: కోహ్లీని కొట్టేవాడే లేడు...మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రికార్డ్ బద్దలు

జరగదేమో అనుకున్న మ్యాచ్ జరగడమే కాదు అందులో టీమ్ ఇండియా సూపర్ విక్టరీని కూడా సాధించింది. కింగ్ విరాట్ కోహ్లీ, కే ఎల్ రాహుల్ లు సెచరీలతో చెలరేగిపోయారు. రికార్డులను బద్దలు కొట్టారు.

New Update
Virat Kohli: కోహ్లీని కొట్టేవాడే లేడు...మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రికార్డ్ బద్దలు

ఆసియా కప్ సూపర్ -4లో భారత్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 228 పరుగుల తేడాతో పాక్ ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన 50 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోరును పాకిస్తాన్ ముందు ఉంచింది. తరువాత బ్యాటింగ్ చేసిన పాక్ 32 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్ అయింది. గాయాల కారణంగా రవూఫ్, నసీమ్ షాలు అసలు బ్యాటింగ్ కే దిగలేదు. దీంతో ఎనిమిది వికెట్లకే ఇన్నింగ్సును ముగించాల్సి వచ్చింది.

భారత జట్టులో ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఇద్దరూ హాఫ్ సెంచురీలతో శుభారంభాన్ని ఇచ్చారు. తరువాత వచ్చిన విరాట్, కే ఎల్ రాహుల్ లు చివర వరకు ఆడి సెంచురీలతో భారత్ ను విజయం దిశగా పరుగులుపెట్టించారు. విరాట్ 94 బంతుల్లో 122 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా...కే ఎల్ రాహుల్ 106 బంతుల్లో 111 పరుగులు చేశాడు. మరోవైపు టీమ్ ఇండియా బౌలర్లు కూడా చెలరేగిపోయారు. ముందు నుంచే పాక్ ఆటగాళ్ళను కట్టడి చేస్తూ మ్యాచ్ ను తమ చేతుల్లోకి తీసుకున్నారు. 8 ఓవర్లు బౌలింగ్ చేసిన కులదీప్ 25 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇక బుమ్రా, శార్ధూల్, హార్ధిక్ పాండ్యాలు తలా ఒక వికెట్ తీసుకున్నారు.

 king virat kohli beated sachin, raina's all time records.

భారత్-పాక్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మ్యాజిక్ చేశాడు. అందుకే అతడికి మ్యాన్ ౠఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది. దీంతో ఇంతకు ముందు సురేష్ రైనా, సిద్ధు పేరిట ఉన్న రికార్డ్ను కోహ్లీ బద్దలు కొట్టినట్టు అయింది. ఆసియా కప్ వన్డే ఫార్మాట్ లో ఎక్కువ సార్లు మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అందుకున్న భారత్ ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఈ మ్యాచ్ తో విరాట్ 4వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. అంతకు ముందు రైనా, సిద్ధూలు 3సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు తీసుకున్నారు.

మరోవైపు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ నూ అధిగమించాడు కింగ్ కోహ్లీ. ఆసియా కప్ సూపర్-4లో పాక్ మీద సెంచరీ చేసిన విరాట్ అంతర్జాతీయ వన్డేల్లో తన 47వ వందను సాధించాడు. దీంతో వన్డే క్రికెట్ లో తక్కువ ఇన్నింగ్స్ లో 13వేల పరుగులు పూర్తి చేసుకున్న మొదటి బ్యాట్స్ మన్ గా కోహ్లీ రికార్డ్ నమోదు చేసుకున్నాడు. ఇంతకు ముందు సచిన్ పేరిట ఈ రికార్డ్ ఉండేది. సచిన్ 321 ఇన్నింగ్స్ లలో 13 వేల పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ 267 మ్యాచ్ ల్లోనే దాన్ని అధిగమించాడు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Babu Mohan : రాజకీయాల నుంచి సేవారంగంవైపు... బాబుమోహన్‌ కీలక నిర్ణయం

 ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఈ రోజు సేవా రంగంలోకి అడుగుపెట్టారు. తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు.

New Update
Babu Mohan

Babu Mohan

 ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అనుకోని కారణాల వల్ల ప్రస్తుతం ఆయన ఏ పదవిలో లేరు. అయితే ఆయన ఈ రోజు మరో రంగంలోకి అడుగుపెట్టారు. అదే సేవా రంగం. అవును తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు చేయూత అందిస్తామని ఆయన ప్రకటించారు. సోమవారం బషీర్ బాగ్‌ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఆవిర్భావ సమావేశంలో బాబు మోహన్ ట్రస్ట్ లక్ష్యాలు, కార్యక్రమాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతి పొందిన ఈ ట్రస్ట్.. నిరుపేదలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. నిరుద్యోగులకు చేయూత అందించడం కూడా ట్రస్ట్ ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా పేర్కొన్నారు.

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!
 
బాబు మోహన్ మాట్లాడుతూ.. తన కుమారుడి పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ద్వారా సమాజంలోని బలహీన వర్గాలకు సహాయం అందించాలనేది తన చిరకాల కోరిక అని అన్నారు. పేదరికం నుంచి బయటపడటానికి విద్య ఒక ముఖ్యమైన సాధనమని ఆయన నొక్కి చెప్పారు. అందుకే.. ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు.. వారికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.అలాగే.. సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం అందించడం కోసం.. వైద్య శిబిరాలు నిర్వహించడం, ఆసుపత్రి ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయడం వంటి కార్యక్రమాలను ఈ ట్రస్ట్ చేపడుతుందని బాబు మోహన్ తెలిపారు. ఉపాధి లేని యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి.. వారు ఉద్యోగాలు పొందేలా సహాయం చేస్తుందన్నారు.

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!
 
ట్రస్ట్ ద్వారా సహాయం పొందాలనుకునే వారు కోఆర్డినేటర్ రాజ్ కుమార్‌ను 8919511215 నెంబర్‌ ద్వారా సంప్రదించవచ్చని బాబు మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారు గూడెం కోయజాతికి చెందిన సమీప అనే విద్యార్థి ఎంటెక్ చేయడానికి, గ్రూప్స్ కోచింగ్ తీసుకోవడానికి బాబు మోహన్ తన ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు.

Also Read :  కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !


బాబు మోహన్ కుమారుడు పవన్ కుమార్ 2003 అక్టోబర్ 12న జరిగిన హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్పోర్ట్స్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ని ఢీ కొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కొడుకు మరణంతో బాబు మోహన్ ఎంతగానో కుంగిపోయారు. కొడుకు పేరిట సేవా కార్యక్రమాలు చేపట్టాలని తాను ఎంతో కాలంగా భావిస్తున్నానని.. కానీ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కుదరలేదన్నారు. తాను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల పూర్తి స్థాయిలో ట్రస్ట్ కోసం పని చేస్తానని ఆయన చెప్పారు.

 Also Read :  ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!

Advertisment
Advertisment
Advertisment