BLA WARNING: బలూచ్ లిబరేషన్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. పాక్ ఆర్మీతో తమ యుద్ధం కొనసాగుతోందని తెలిపింది. ఖైదీల మార్పిడి ప్రతిపాదనకు 48 గంటల డెడ్లైన్ ముగిసిందని, ఇకపై ఏం జరిగినా పాకిస్థాన్ ఆర్మీదే బాధ్యత అంటూ వార్నింగ్ ఇచ్చింది. అలాగే పాకిస్థాన్ సైన్యం చేసిన వాదనను తీవ్రంగా ఖండించింది.
భీకర పోరుకు సిద్ధం..
ఈ మేరకు జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో పాక్ సైన్యంతో భీకర పోరుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగానే తాము పెద్ద ఎత్తున పాకిస్థాన్ సైనికులను చంపామని ప్రకటించింది. ఖైదీల మార్పిడి ప్రతిపాదనను పాకిస్థాన్ తిరస్కరించిందని పేర్కొంది. మంగళవారం క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసిన విషయం తెలిసిందే. కాగా హైజాక్ చేసిన సమయంలో రైళ్లో 400 మందికిపైగా ప్రయాణికులను బంధించింది బలూచ్ సైన్యం.
Also Read: Trudeau:కుర్చీ చేత పట్టుకుని..నాలుక బయటపెట్టి..ట్రూడో ఫొటో వైరల్!
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం హైజాక్ అయిన ప్రజలను కాపాడే పనిలో పడింది. ఇందులో భాగంగా పాక్ ఆర్మీ 104మందిని విడిపించింది. ఇందులో 43 మంది పరుషులు, 26మంది మహిళలు, 11మంది చిన్నారులు ఉన్నారు. అయితే ఉగ్రవాదుల అదుపులో ఇంకా 100మందికి పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ 104 మందిని రక్షించే క్రమంలో 16 మంది మిలిటెంట్లు చనిపోయారని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఉగ్రవాదులకు, రక్షణ దళాలకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
Also read : ఆ విషయంలో నేనే నంబర్.1.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
బలోచిస్థాన్లోని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్కు జాఫర్ ఎక్స్ప్రెస్ కు వెళుతున్న రైలుపై బలోన్ ప్రాంతం దగ్గర కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. రైల్వే ట్రాకులను పేల్చి ట్రైన్ ను తమ అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రైల్లో ఉన్న వారందరినీ మిలిటెంట్లు అదుపులోకి తీసుకున్నారు. అయితే వెంటనే పాక్ సైనికులకు, మిలిటెంట్లకు కాల్పులు జరిగి కొంతమందిని కాపాడారు. ఆ కాల్పుల్లో 30మంది పాక్ సైన్యాన్ని చంపినట్లు బలోచ్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. తమపై మిలిటరీ ఆపరేషన్ చేపడితే తమ దగ్గర బందీలుగా ఉన్నవారందరినీ చంపుతామని బెదిరించింది. బందీలను విడిచిపెట్టాలంటే.. బలోచ్ రాజకీయ నేరస్థులు, అదృశ్యమైన పౌరులు, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అందుకోసం 48 గంటల గడువు ఇచ్చింది.