Sunita Williams: భూమ్మీదకు రానున్న సునీతా విలియమ్స్‌.. టైమ్‌ చెప్పిన నాసా

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌ భూమి మీదకు రానున్నారు. మరికొన్ని గంటల్లోనే వాళ్ల తిరుగుప్రయాణం మొదలుకానుంది. అమెరికా కాలమాన ప్రకారం మంగళవారం సాయంత్రం వారు భూమి మీద ల్యాండ్ అవ్వనున్నారు.

New Update
sunita williams and butch wilmore

sunita williams and butch wilmore

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌ గత తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు వాళ్లు భూమి మీదకు తిరిగిరానున్నారు. అయితే తాజాగా వాళ్లు భూమి మీదకి వచ్చే సమయాన్ని నాసా ప్రకటించింది. మరికొన్ని గంటల్లోనే వాళ్ల తిరుగుప్రయాణం మొదలుకానుంది. అమెరికా కాలమాన ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 PM గంటలకు వారు భూమి మీద ల్యాండ్ అవ్వనున్నారు. 

Also Read: శాంతి కోసం ప్రయత్నిస్తే..పాక్ నమ్మకం ద్రోహం చేసింది-ప్రధాని మోదీ

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బుచ్ విల్మోర్‌లు గత ఏడాది అంతరిక్ష కేంద్రానికి(ISS) వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. చివరికి స్పేస్‌ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్‌ తాజాగా అక్కడికి వెళ్లి ఐఎస్‌ఎస్‌తో విజయవంతంగా అనుసంధానమైన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఇద్దరు భూమి మీదకు వచ్చే మార్గం సుగమమైంది. 

క్రూ డ్రాగన్‌లో నలుగురు వ్యోమగాములు నింగిలోకి పయనమయ్యారు. ఇందులో అమెరికాకు చెందిన ఆస్ట్రోనాట్స్‌ ఆన్‌ మెక్‌క్లెయిన్, నికోల్‌ అయర్స్, రష్యాకు చెందిన వ్యోమగామి కిరిల్ పెస్కోవ్, జపాన్‌కు చెందిన వ్యోమగామి టకుయా ఒనిషి ఉన్నారు. సునీత విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌లు ఈ క్రూ డ్రాగన్‌ మిషన్‌లోనే భూమి మీదకి రానున్నారు. మరో ఇద్దరు వ్యోమగాములు వాళ్ల స్థానంలో ఐఎస్ఎస్‌లో విధులు నిర్వహించనున్నారు. మొత్తానికి ఎట్టకేలకు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ భూమి మీదకు రానుండటంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.  

Also Read: యువతకు స్వయం ఉపాధి.. నేటి నుంచి రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు ప్రారంభం

జీతం ఎంతంటే ?

ఇక జీతం పరంగా చూస్తే నాసా ఉద్యోగులు.. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులు పొందే జీతాన్నే పొందుతారు. అయితే వ్యోమగాములకు జనర్ షెడ్యూల్‌ జీఎస్-13 నుంచి జీఎస్‌-15 కింద చెల్లింపులు ఉంటాయి. సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌లు జీఎస్‌-15 గ్రేడ్‌ పే శాలరీ తీసుకుంటున్నారు. దీని ప్రకారం చూస్తే వార్షిక వేతనం 1,24,133 డాలర్ల నుంచి 1,62,672 డాలర్ల (రూ.1.08 కోట్ల నుంచి రూ.1.41 కోట్లు) మధ్య ఉంటుంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Trump: ఆ దేశం అస్సలు వెళ్లకండి.. అమెరికన్లకు ట్రంప్‌ హెచ్చరిక

ట్రంప్ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్‌ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది.

New Update
Do not travel to Bahamas, there are sharks:,Trump admin advises Americans

Do not travel to Bahamas, there are sharks:,Trump admin advises Americans

ట్రంప్ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్‌ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది. బహమాస్ అనేది కామన్వెల్త్ దేశాల్లో ఒక స్వతంత్ర దేశం. పర్యాటక పరంగా దీనికి మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ మధ్య అక్కడికి వెళ్లే పర్యటకులపై కొందరు దుండగులు దోపిడీలకు పాల్పడుతున్నారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

అంతేకాదు మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. ఆఖరికీ హత్యలకు కూడా చేయడానికి వెకాడటం లేదు. అలాగే బహమాస్ సముద్ర జలాల్లో షార్క్‌ దాడుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఆ దేశానికి వెళ్లకూడదని ట్రంప్ సర్కార్ ప్రజలకు సూచనలు చేసింది.అక్కడ అద్దె గదుల్లో కూడా ఉండటం సురక్షితం కాదని చెపింది. ప్రైవేట్ సెక్యూరిటీ లేని ప్రాంతంలో బస చేయడం మంచిది కాదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మార్చి 31న ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

పర్యాటకులు మార్గదర్శకాలను నిర్లక్ష్యం చేసి ఆయుధాలు, తుపాకులు తీసుకెళ్లడం చట్టారీత్యా నేరమంటూ హెచ్చరించింది. రూల్స్‌ ఉల్లంఘిస్తే ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటారని తెలిపింది. అరెస్టులు, జైలుశిక్ష, జరిమానా విధిస్తారని మార్గదర్శకాల్లో పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

trump | telugu-news | rtv-news | usa

Advertisment
Advertisment
Advertisment