Crime: అల్లుడితో అత్త శృంగారం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మామ.. చివరికి ముగ్గురు కలిసి!

యూపీలో దారుణం జరిగింది. మేనల్లుడు నిమిష్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రీతి తన భర్త గౌరవ్‌ను ఘోరంగా హతమార్చింది. అల్లుడు, అతని స్నేహితుడి సాయంతో గొంతుకోసి చంపి రోడ్డు యాక్సిడెంట్‌గా క్రియేట్ చేసింది. కాల్ డేటా ఆధారంగా పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. 

New Update
Sex hormones: దంపతులు శృంగారానికి దూరంగా ఉంటున్నారా.. అయితే డేంజర్ లో ఉన్నట్లే!

Married woman kills husband over illicit relationship with son-in-law

Crime: ఉత్తరప్రదేశ్‌ బులంద్‌షహర్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఒక మహిళ తన సొంత మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకోవడం కలకలం రేపింది. అంతేకాదు ఈ విషయం తన మామకు తెలిసిందని, ఎలాగైనా మామ అడ్డుతగిలించుకోవాలని ప్లాన్ చేసి దారుణానికి ఒడిగట్టారు. మరో స్నేహితుడితో కలిసి అతన్ని హతమార్చగా ఈ ఘటన జనాలను ఉలిక్కిపడేలా చేసింది.  

గౌరవ్ బయటకు వెళ్లగానే రాసలీలు..

ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరవ్, ప్రీతిలకు కొంతకాలంక్రితం పెళ్లైంది. అయితే ప్రీతి ఇటీవల తన మేనల్లుడు నిమిష్ తో సన్నిహితంగా ఉంటోంది. అది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. గౌరవ్ బయటకు వెళ్లగానే ఇద్దరు రాసలీలల్లో తేలిపోయేవారు. బటయకూడా తిరిగారు. ఈ క్రమంలోనే గౌరవ్ కు అనుమానం వచ్చి ప్రీతిని హెచ్చరించాడు. దీంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అల్లుడితో కలిసి ప్లాన్ చేసింది. అయితే నిమిష్ తన స్నేహితుడు తరుణ్ తో కలిసి గౌరవ్ మర్డర్ కు ప్లాన్ చేశాడు. గౌరవ్ ను ముగ్గురు కలిసి చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. జనవరి 30న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి మరణించినట్లు పోలీసులకు సమాచారం అందగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. 

ఇది కూడా చదవండి: Rangarajan: అందుకే దాడి చేశాం.. 5వేల మందితో రామరాజ్యం నిర్మిస్తా: వీరరాఘవరెడ్డి సంచలనం

గౌరవ్ రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని గొంతు కోసి చంపినట్లు పోస్ట్ మార్టమ్ రిపోర్టులో బయటపడింది. దీంతో అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు భార్య కాల్ రికార్డ్స్ పరిశీలించారు. తన మేనల్లుడితో అక్రమ సంబంధం ఉందని, అందుకే గౌరవ్ ను హతమార్చారని గుర్తించారు. ప్రీతి, నిమిష్‌, అతని స్నేహితుడిని అరెస్టు చేశారు. ఒక వాహనం, మొబైల్ ఫోన్, పిస్టల్, కార్ట్రిడ్జ్‌లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Chiranjeevi: తల్లి అంజనాదేవికి అనారోగ్యం.. చిరంజీవి సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bike Accident : తండ్రికి బైక్‌ను గిప్ట్గా ఇచ్చేందుకు వెళ్తూ అనంతలోకాలకు!

తండ్రికి బైక్‌ను గిప్ట్ గా ఇచ్చేందుకు వెళ్తుండగా ఓ కూతురు చనిపోయింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద నేషనల్ హైవేపై చోటుచేసుకుంది.  చేతికందిన కుమార్తె ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

New Update
bike-accident suryapet

bike-accident suryapet

తండ్రికి బైక్‌ను గిప్ట్ గా ఇచ్చేందుకు వెళ్తుండగా ఓ కూతురు చనిపోయింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద నేషనల్ హైవేపై చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన చెడే జనార్దన్‌కు కుమార్తె యశస్విని (24), కుమారుడు ఉన్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో యశస్విని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా పనిచేస్తుంది. అయితే తనకు విద్యాబుద్ధులు నేర్పి తనను ఇంతటి ఉన్నతస్థాయికి చేర్చిన తన తండ్రికి బహుమతిగా ఇచ్చేందుకు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను ఇటీవల ఆమె కొనుగోలు చేసింది.  ఆ బైక్ ను తీసుకుని హైదరాబాద్ నుంచి తన కొలీగ్ నాగఅచ్యుత్‌కుమార్‌తో కలిసి శుక్రవారం రాత్రి 7 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేంది. 

Also read :  India-Pakistan: మేం ఆయుధాలు లేని సైనికులం..పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధమే!

యశస్వినిని ఢీకొట్టి తలమీదుగా

అయితే శనివారం అర్ధరాత్రి 12:30 గంటట సమయంలో ఆకుపాముల వద్ద  నేషనల్ హైవేపై చనిపోయి ఉన్న గేదెను గుర్తించక దానిని ఢీకొని పడిపోయారు. అదే టైమ్ లో వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ యశస్వినిని ఢీకొట్టి తలమీదుగా వెళ్లడంతో ఆమె స్పాట్ లోనే చనిపోయింది. బైక్ నడుపుతున్న నాగఅచ్యుత్‌కుమార్‌కు తీవ్ర గాయాలు కావడంతో కోదాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన తర్వాత లారీ డ్రైవర్ అక్కడనుంచి పరారయ్యాడు.  బాధితురాలి బాబాయ్ చేడె సురేష్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  చేతికందిన కుమార్తె ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం అనంతరం యశస్విని మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు.  

Also Read :   Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!

Also read :  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు